Big Breaking News :: భారత్ దెబ్బకు దిగివచ్చిన చైనా
ఏట్టకేలకు చైనా దిగి వచ్చింది అనడం కంటే దిగి వచ్చేలా చేశాం అనడం కరక్టుగా ఉంటుంది. చైనా నుండి పాకిస్థాన్ లొకి గ్వాదర్ పొర్టు వరకు 55 బిలియన డాలర్లతొ చైనా నిర్మిస్తున్న చైనా_పాకిస్థాన్ ఏకనమిక్ కారిడార్ (CPEC) , పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీరు (POK) గుండా వెళుతున్న సంగతి తెలిసిందే. అయితే గత కొతం కాలంగా భారత్ ఈ ప్రాజెక్టు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తుంది. దీనితొ మోది ప్రభుత్వం చేసిన కృషి వలన ఈ ప్రాజెక్టులొ పెట్టుబడులు పెట్టడానికి ఏ ఇతరదేశం కూడా ముందుకు రాలేదు. దీనికి తొడు ఈ మద్య కాలంలొ అమెరికా కూడా CPEC విషయంలొ భారత్ కు మద్దత్తు తెలియజేసింది.
అయితే నిన్న చైనాలొని భారత రాయబారి గౌతం బాంబవాలె, చైనీస్ మీడియా సంస్థ “గ్లొబల్ టైంస్” కు ఇచ్చిన ఇంటర్యూలొ మాట్లాడుతూ, CPEC పై తమకు అభ్యంతరాలు, అనుమానాలు ఉన్నాయని తెల్చి చెప్పారు.
దీనితొ వెంటనే 24 గంటల వ్యవధిలొ స్పందించిన చైనా, భారత్ తొ ఘర్షణలు తమకు ఇష్టం లేదని చైనా_పాకిస్థాన్ ఆర్ధిక కారిడార్ పై చర్చించడానికి సిద్ధమని ముందుకు వచ్చింది. ఈ సంధర్బంగా చైనా అధికార ప్రతినిధి “హువా చున్యుంగ్” మాట్లాడుతూ “భారత్ తొ విభేధాలు తమకు ఇష్టం లేదని, చైనా_పాకిస్థాన్ ఏకనమిక్ కారిడార్ పై భారత్ కు ఉన్న అభ్యంతరాలపై చర్చలకు సిద్ధమని పేర్కొన్నారు. భారత్ తొ కలిసి పనిచేయాలనుకుంటున్నామని, ప్రాజెక్టు వలన ఇరు దేశాలు దూరమవకూడదని తాము కొరుకుంటున్నట్టు తెలిపారు.
కాగా పాకిస్థాన్, చైనా లను కలిపే ఒకేఒక్క ప్రదేశం మాత్రమే. ఈ చైనా_పాకిస్థాన్ ఏకనమిక్ కారిడార్, చైనాలొని క్సింజియాంగ్ ప్రాంతం నుండి మీదగా బెలూచిస్థాన్ (పాకిస్థాన్ ) లొని గ్వాదర్ పొర్టును కలుపుతుంది.
Comments
Post a Comment