ఈ రోజు వీర సావర్కర్ గారి జయంతి ని పురస్కరించుకుని ఆయనకు ఘన నివాళులు అర్పిస్తూ ఒకసారి ఆయన జీవితం గురించి ఙ్ఞాపకం చేసుకుందాం.
ఈ రోజు వీర సావర్కర్ గారి జయంతి ని పురస్కరించుకుని ఆయనకు ఘన నివాళులు అర్పిస్తూ ఒకసారి ఆయన జీవితం గురించి ఙ్ఞాపకం చేసుకుందాం. భారత స్వాతంత్య్రోద్యమం తొలినాళ్లలో సుభాష్ చంద్రబోస్ తో పరిచయమున్న వీర సావర్కర్ అన్ని మత గ్రంథాలను అధ్యయనం చేశారు, కానీ హిందూ జాతిని మనస్ఫూర్తిగా ప్రేమించారు. ఆ జాతి సర్వాంగీణ ఉన్నతికై నిరంతరం శ్రమించారు. సావర్కర్కు ఏ మతం పైనా ద్వేషంలేదు. మతోన్మాదం చాలా ప్రమాదకారి యని మానవచరిత్రలో దేవుని పేరుతో జరిగినంత మారణ హోమం ధనపిపాస వల్ల జరగలేదనే వారు. 1857వ సంవత్సరంలో జరిగిన ప్రథమ భారత స్వాతంత్య్ర సంగ్రామం ఓడి పోయి ఉండవచ్చు కానీ అది రగిలించిన స్వాతంత్య్ర సము పార్జన కాంక్ష ఎన్నో పోరాటా లకు నాంది పలికింది. లోక మాన్య తిలక్, సుభాష్ చంద్ర బోస్, మోహన్దాస్ గాంధీ వంటి నాయకుల ఆవిర్భావానికి కారణమైంది. గాంధీ నాయకత్వం సత్యం-అహింస మార్గాలనవలంబిస్తే వీర సావర్కర్, భగత్సింగ్, మదన్లాల్ ధింగ్రా, రాజగురు వంటి వారు క్రాంతికారులైనారు. వారు చేసిన బలిదా నాల వల్లనే చివరకు శాంతి, సంప్రదింపులు, సర్దుబాట్ల బాటలో మనం స్వతంత్రులైనాము. సావర్కర్ అనగానే మనకు విప్లవ వీరుడే గుర్తుకు వస్తాడు. కా...