Posts

Showing posts from July, 2022

పాపం చివరికి వాళ్ళ "మస్తాన్" బయ్ కూడా...

Image
పాపం చివరికి వాళ్ళ "మస్తాన్" బయ్ కూడా... అది కూడా సాధారణ అసెంబ్లీ ఎన్నికలు ఇంకా 18 నెలలు ముందుగా జరిపిన సర్వేలో పాలక పార్టీ TRS కు మరియు మాంచి దూకుడు మీదున్న BJP పార్టీల మధ్య ఓట్ల శాతం కేవలం 8% అన్నాడంటే, ఇకదే ఎన్నికల నాటికి అది కూడా రోజురోజుకు మసక బారుతున్న పాలక పార్టీ గీత... రాత ఎలా వుండబోతుందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు !! ఇంకలాగే రేవంత్ రెడ్డి అభిమానుల ఆశలకు కూడా తీవ్రమైన శృంగభంగం ఖాయం... OffCourse మొన్నా మధ్య జరిగిన దుబ్బాక & హుజురాబాద్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కనీసం ఓ "డిపాజిట్"క్కూడా దిక్కులేని రోజున్నే అది కాస్తా తేలిపోయిందనుకోండి... ప్చ్... పాలక పక్షం ఆరాధ్య దైవం మస్తాన్ బయ్ నే అంత మాటన్నాడంటే ! పాపం !! ఇక చెప్పేదేముంది ?! ఇకలాగే అటు పాలక తెరాస మరియు ఇటు కాంగ్రెస్ పార్టీల మధ్యనున్న BJP ఆఁ రెండు పార్టీల ఓట్ల శాతానికి గండి కొట్టి తన అకౌంట్లో వేసుకొని ఇంకా గణనీయంగా ఎగబాకడం తధ్యం...

కాసేపు "ఆరా మస్తాన్ సర్వే"ల్లోని వాస్తవాలు పూర్తిగా పక్కన పెడితే....

Image
కాసేపు "ఆరా మస్తాన్ సర్వే"ల్లోని వాస్తవాలు పూర్తిగా పక్కన పెడితే.... ఈ సదరు సర్వేపై పాలక పక్షక మద్దత్తుదారుల మాటల తీరు స్పందన చూస్తా వుంటే... మొత్తానికి... ఈ సర్వేపై... పాలకపక్షం స్పందిస్తున్న తీరు... దానిపై వారు దుమ్మెత్తి పోస్తున్న తీరులో... వారిని "ఆత్మరక్షణ"లో పడేసి, వారినెంతో "భయాందోళన"కు గురిచేస్తున్నదని చెప్పకతప్పదు... ఇక వీటన్నిటితో తోడు : తాము జవాబు చెప్పలేనప్పుడు... తమ దగ్గర జవాబు లేనప్పుడు... తిట్ల దండకం అందుకోవడం... నానా యాగి చేయడం... తలాతోక లేకుండా తూలడం... అబద్దాలు ప్రచారం చేయడం... ఎగిరెగిరి పడ్డం.. మొదటినుండీ వున్నదే... ఇప్పుడు కూడా అదే తోవలో పోతున్నారు... శుభం...

అఖండ భారత్ కోసం పరితపించిన వీరులునరనరాన దేశభక్తి నింపుకున్న ధీరులుభారతీయ జన సంఘ్ సంస్థాపకులు

Image
అఖండ భారత్ కోసం పరితపించిన వీరులు నరనరాన దేశభక్తి నింపుకున్న ధీరులు భారతీయ జన సంఘ్ సంస్థాపకులు డా౹౹ శ్యామ ప్రసాద్ ముఖర్జీ జయంతి సందర్భంగా ఆయనకు నా నివాళి ■ స్వతంత్ర భారత రాజకీయాకాశంలో సిద్ధాంత రహిత రాజకీయాలు, స్వార్థ , పదవీ వ్యామోహం వాదాల కారుమబ్బులు కమ్ముకున్న ఆ తొలి దినాలలో ఒక మెరుపు మెరిసి మాయమైంది. కళ్ళు మిరిమిట్లు గొలిపే ఆ మెరుపు వెలుగు క్షణ కాలమే కావచ్చు. కానీ గాఢాంధకార భవిష్యత్తులో మునిగి వున్న భారత ప్రజానీకానికి ఆమాత్రం వెలుగు చాలు...'భారతీయ జన సంఘం' అనే వాస్తవమైన సైద్ధాంతిక రాజకీయ పథాన్ని కనుగొనడానికి స్వతంత్ర భారత రాజకీయాలకు ఒక నూతన దిశను, నూతన లక్ష్యాన్ని ప్రసాదించిన ఆ మెరుపే స్వర్గీయ డాక్టర్ శ్యామ ప్రసాద్ ముఖర్జీ. ■శ్యామ ప్రసాద్ ముఖర్జీ భారతమాత కన్న మహా సంతానంలో ఒకరు. వారి జీవితంలో ప్రతిక్షణం, శరీరంలో ప్రతి కణం మాతృభూమి సేవకే సమర్పితం అయ్యాయి. ■1901 జూలై 7వ తేదీన అసుతోష్ ముఖర్జీ ,రాణి జోగ్మయాదేవి పుణ్య దంపతులకు శ్యాంప్రసాద్ ముఖర్జీ జన్మించారు. తన తండ్రి అసుతోష్ ముఖర్జీ నుంచి అనేక గొప్ప గుణాలు పుణికి పుచ్చుకున్నారు. వాటిలో అతి ప్రముఖ గుణం అసుతోష్ ముఖర్జీ యొక్క ప్రఖర...

భాగమతి-భాగ్‌ నగర్‌.. భాగ్యలక్ష్మి-భాగ్యనగర్‌.. ఈ పేర్ల వెనుక చరిత్ర ఏమిటి?

Image
భాగమతి-భాగ్‌ నగర్‌.. భాగ్యలక్ష్మి-భాగ్యనగర్‌.. ఈ పేర్ల వెనుక చరిత్ర ఏమిటి? హైదరాబాద్‌ పేరును భాగ్యనగర్‌గా మారుస్తామంటే కొందరు హైరానా పడిపోతున్నారు.. నిజానికి హైదరాబాద్‌ పేరు ఎంత ప్రసిద్ధమో భాగ్యనగర్‌ కూడా అంతే పాపులర్.. అసలు భాగ్యనగర్‌ అనే పేరు ఎందుకు ఉంది అంటే చరిత్ర లోతుల్లోకి వెళ్లాలి.. 430 ఏళ్ల నాటి ముచ్చట్లు ఇవి.. 🔸భాగమతి కథ🔸 ప్రచారంలో ఉన్న చరిత్ర ప్రకారం భాగమతి పేరిట వెలిసిన నగరం భాగ్యనగర్‌ అంటారు.. ఈ నగరాన్ని నిర్మించిన గోల్కొండ సుల్తాన్‌ మహమద్ కులీ కుతుబ్‌షా ప్రేమ కథ అందరికీ తెలిసే ఉండాలి.. ఆయన భాగమతి అనే యువతిపై మోజుపడి పెళ్లి చేసుకున్నాడు. ఆమె ఒక దేవదాసి అంటారు. నిజానికి హైదరాబాద్‌కన్నా పూర్వమే ఇక్కడ జనావాసాలు ఉండేవి.. కులీ కుతుబ్‌షా దీనికి నగర స్థాయి కల్పించి విస్తరించాడు.. భాగమతి పేరిట భాగ్‌నగర్‌ నిర్మించాడని, ఆ తర్వాత అది భాగ్యనగర్‌గా మారిందని కొందరు చరిత్ర కారులు చెబుతారు.. మరి కొందరు చరిత్రకారులు ఇది కల్పితం, అసలు భాగమతి ప్రేమ కట్టుకథ అంటారు.. ఏదైతేనే భాగమతి పెళ్లయిన తర్వాత హైదర్‌మహల్‌గా మారింది.. భాగ్యనగర్‌ పేరు హైదరాబాద్‌ అయిపోయిందంటారు.. (కులీ కుతబ్‌షా.. మూసీ నది వర...

నరేంద్ర మోడీ మరో 20ఏళ్ల పాటు పాలన అందించాలి

Image
నరేంద్ర మోడీ మరో 20ఏళ్ల పాటు పాలన అందించాలి *కార్యవర్గ భేటీలో నేతల అభిప్రాయం* *హైదరాబాద్‌, హైదరాబాద్‌ హెచ్‌ఐసీసీ వేదికగా జరుగుతున్న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో చర్చిస్తున్న అంశాలను కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ మీడియాకు వెల్లడించారు. దేశంలో పేదల అభ్యున్నతి, మహిళా సాధికారిత, స్వతంత్రతను మన స్వాతంత్ర్య సమరయోధులు ఆశించారని, బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశంలో ఇలాంటి అంశాలపైనే చర్చలు జరుగుతున్నాయని వెల్లడించారు. సామాజిక భద్రతకు సంబంధించి ప్రధాని మోదీ అమలు చేస్తున్న పథకాలపై చర్చించిన కార్యవర్గం ప్రజల ఆర్థిక స్వావలంబన దిశగా ఎన్నో చర్యలు చేపట్టినట్టు నడ్డా గుర్తు చేశారు. కరోనా సమయంలో ప్రపంచానికి, దేశ ప్రజలకు భారత్‌ అందించిన సేవలు అసమానమైనవని ఆయన పేర్కొన్నారు. ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ కార్యక్రమాలు నిర్వహిస్తున్న వేళ రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్మూను ఎంపిక చేయడం పార్టీ తీసుకున్న మరో కీలక నిర్ణయమన్నారు.* *విపక్ష పార్టీలు అవినీతి అక్రమాల్లో మునిగి ఉంటే సమాజ అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉందని గుర్తు చేశారు. ఆర్టికల్‌ 370 రద్దుపై గట్టిగా నిలబడిన ప్రధాని నరేంద్ర మోడీ, హోం మంత్రి అమిత్‌ షా...

సీఎం కేసీఆర్ చెల్లని రూపాయి : బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్

Image
*సీఎం కేసీఆర్ చెల్లని రూపాయి : బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ * *హైదరాబాద్‌, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ సీఎం కేసీఆర్‌ను చెల్లని రూపాయితో పోల్చారు. హైదరాబాద్‌లో జరుగుతున్నబీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో ఆయన మాట్లాడారు.* *సీఎం కేసీఆర్‌కు వణుకు మెదలైంది : ‘గౌరవప్రదమైన రాష్ట్రపతి ఎన్నికలను కేసీఆర్ అగౌరపరుస్తున్నారు. బైక్ ర్యాలీ నిర్వహించి ఆ హోదాను తగ్గించేలా కేసీఆర్ వ్యవహారం ఉంది. కేసీఆర్ తీరు వల్లే తెలంగాణలో శాంతిభద్రతలు క్షీణించాయి. మైనర్లు, మహిళల మీద అత్యాచారాలు పెరిగిపోయాయి. డ్రగ్స్ కంట్రోల్ చేయటంలో కేసీఆర్ సర్కార్ విఫలమైంది. రైతులకు బేడీలు వేసిన చరిత్ర కేసీఆర్‌ది. తెలంగాణ రైతులను వదిలి.. పంజాబ్ రైతులకు ఆర్థికసాయం చేయటం దారుణం. కేసీఆర్ దిగిపోయే రోజులు దగ్గరకు వచ్చాయి. తన ప్రభుత్వం ఉంటుందో..ఊడుతుందో కేసీఆర్ చూసుకోవాలి. టీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు పక్కదారి చూస్తున్నారు. తెలంగాణకు ప్రధాని రావటంతో.. సీఎం కేసీఆర్‌కు వణుకు మెదలైంది. కేసీఆర్‌ది తెలంగాణ రక్తమైతే కేంద్ర ప్రభుత్వాన్ని పడగొట్టాలి.’’ అని బండి సంజయ్ సవాల్ విసిరారు.*

ముగిసిన తొలిరోజు భాజపా జాతీయ కార్యవర్గ సమావేశాలు

Image
*ముగిసిన తొలిరోజు భాజపా జాతీయ కార్యవర్గ సమావేశాలు* హైదరాబాద్‌లో ముగిసిన తొలిరోజు భాజపా జాతీయ కార్యవర్గ సమావేశాలు సమావేశాల్లో ఆర్థిక తీర్మానం ప్రవేశపెట్టిన రాజ్‌నాథ్‌సింగ్ సమావేశాల్లో రాజకీయ తీర్మానం ప్రవేశపెట్టిన అమిత్‌షా రాత్రి 9.30 గంటల వరకు వేదిక వద్ద సాంస్కృతిక కార్యక్రమాలు రాత్రికి నోవాటెల్ హోటల్‌లో బస చేయనున్న ప్రధాని మోదీ *ముద్రా యోజన, జన్‌ధన్‌ పథకాలు ఇంటింటికీ చేరాయి: ధర్మేంద్ర ప్రధాన్‌* సమావేశాల్లో గరీబ్ కళ్యాణ్ గురించి చర్చించాం: కేంద్రమంత్రి ధర్మేంద్ర  ప్రధాన్‌ముద్రా యోజన, జన్‌ధన్‌ పథకాలు ఇంటింటికీ చేరాయి: ధర్మేంద్ర ప్రధాన్‌ రెండేళ్లలోనే ప్రజల ఆరోగ్యం కోసం 2.6 లక్షల కోట్లు ఖర్చు: ధర్మేంద్ర ప్రధాన్‌ భాజపా హయాంలో ఎగుమతులు, వృద్ధి రేటు పెరిగాయి: కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ సమస్యలు అధిగమించి రెండెంకల వృద్ధి సాధించాం: కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ ప్రజాస్వామ్యంలో అధికారం ఎవరి జాగీరు కాదు: కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ అధికారం శాశ్వతమని కొందరే భ్రాంతి చెందుతారు: కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ భాజపా అన్ని రాష్ట్రాల్లో మద్దతు కూడగడుతుంది: కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌...

దేశంలోనే పెద్ద రాష్ట్రం తెలంగాణా కంటే నాలుగు రెట్లు పెద్దదైన ఉత్తర ప్రదేశ్ లో వరుసగా రెండో సారి అధికారంలోకి వచ్చింది..

Image
దేశంలోనే పెద్ద రాష్ట్రం తెలంగాణా కంటే నాలుగు రెట్లు పెద్దదైన ఉత్తర ప్రదేశ్ లో వరుసగా రెండో సారి అధికారంలోకి వచ్చింది..  తెలంగాణ కంటే ఇంకో పెద్ద రాష్ట్రం గుజరాత్ లో వరుసగా 5 సార్ల నుండి అధికారంలో ఉంది...   తెలంగాణ కంటే రెండు రెట్లు పెద్ద అయిన మధ్య ప్రదేశ్ లో వరుసగా నాలుగు సార్లు...... వరుసగా రెండు మూడు సార్లు ఇంకా కొన్ని రాష్ట్రాల్లో అధికారంలో ఉంది.. మధ్యప్రదేశ్ రాజస్థాన్ గుజరాత్ ఢిల్లీ     లాంటి రాష్ట్రాల్లో రెండు టర్మ్ లలో MP సీట్లను మొత్తానికి మొత్తం గెలుచుకుంది.. దేశంలో అనేక రాష్ట్రాల్లో MP సీట్ల సంఖ్య 2014 కంటే 2019లో లో పెంచుకుంది... ఆవో దేవో సీఖో మీ దగ్గర ఏముంది సార్... ఉత్త మాటలు, ప్రలోభాలు  తప్ప మీరు 2014, 2019 లో రాష్ట్రంలో మొత్తం 17 MP సీట్లు గెల్చుకొలేక పోయారు... అసెంబ్లీ లో మీ బలం కూడా TDP కాంగ్రెస్ లలో గెలిచిన వారిని చేర్చుకుంటే పెరిగిందే కదా.. చివరాఖరికి మీరు గొప్పగా చెప్తున్న GHMC లో కూడా మీకు ప్రజల ఆదరాభిమానాలు దొరకలేదు... మీరు 2014 లో ఇచ్చిన ప్రధాన ఎన్నికల అజెండాలు అలాగే పక్కన ఉన్నాయి... ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి.... మా "రామన్న...

IT'S MASTER STROKE & FINISHING TOUCH OF BJP

Image
IT'S MASTER STROKE & FINISHING TOUCH OF BJP ´´´´´´´´´´´´´´´´´´´´´´´´´´´´´´´´´´´´´´´´´´´´´´´´´´´´´´´´´´´´´´´´´´´´´ ఒక్క సామాన్యుల్నే కాదు...  తలలు పండిన రాజకీయ పండితుల ఊహల్ని సైతం తలకిందులు చేస్తూ... శివసేన తిరుగుబాటు నాయకుడు ఏక్ నాథ్ రావు షిండేను మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా నిర్ణయించి... ఏక కాలంలో... ఇటు ఉద్దావ్ థాక్రేని అటు మరోవైపు శరద్ పవార్ ను & కాంగ్రెస్ పార్టీల్ని "చావుదెబ్బ"  కొట్టింది భారతీయ జనతా పార్టీ(BJP)... 288 స్థానాలున్న మహారాష్ట్ర అసెంబ్లీలో ప్రభుత్వం ఏర్పరిచేందుకు 145 సభ్యుల సాధారణ మెజారిటీ చాలు. ఇక 2019 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల పొత్తులో భాగంగా BJP పోటీచేసిన 144 స్థానాల్లో 106 గెలువగా... అదే శివసేన పోటీచేసిన స్థానాల్లో కేవలం 56 ల్లో మాత్రమే గెలిచింది. అయితే మిత్ర ధర్మాన్ని మరియు పొత్తు విధివిధానాల్ని తుంగలో తొక్కి తనకే ముఖ్యమంత్రి పీఠం కావాలనే మంకుపట్టు పట్టడంతో ఓ పీటముడి ఏర్పడింది. ఇక ఆఁ తరువాత తన తండ్రి బాలాసాహెబ్ థాక్రే జీ కాంగ్రెస్ & NCP(శరద్ పవార్) వ్యతిరేక సిద్దాంత పునాదుల్ని కాలరాచి అదే రెండు పార్టీల ముందు సాగిల పడి తన తండ్రికి తలవొంపులు త...

భయం భయం గుప్పిట్లో మేకబోతు గాంభీర్యంలో రాష్ట్ర సర్కార్

Image
భయం భయం గుప్పిట్లో మేకబోతు గాంభీర్యంలో రాష్ట్ర సర్కార్ ∞∞∞∞∞∞∞∞∞∞∞∞∞∞∞∞∞∞∞∞∞∞∞∞∞∞∞∞∞∞∞∞∞∞≠ రాష్ట్రపతి అభ్యర్థి ఎన్నికకు ఓటు వేసేది సామాన్య ఓటర్లా !? ఏమో మరి ! చూస్తా వుంటే... రాష్ట్ర పాలక పార్టీ తీరు మాత్రం అలానే అనుకుంటున్నట్టుగా వుంది మరి ! విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి కోసం TRS పార్టీ హైదరాబాద్ నగరంలో భారీ 'బైక్ ర్యాలీ' తీస్తున్నదట ! అది కూడా BJP కార్యవర్గ సమావేశాల సందర్బంగా నగరంలో భారీ ఎత్తున జరుగుతున్న ప్రధాన మంత్రి బహిరంగ సభకు ముందు రోజున్న... చూస్తా వుంటే... అభద్రతా భావంతో ఓటమి భయంలో అయోమయంలో పడ్డ అధికార పార్టీ మున్ముందు అమెరికాలో జరిగే అధ్యక్ష ఎన్నికలకు కూడా ఇక్కడ "బహిరంగ సభ"ను ఏర్పాటు చేసినా ఆశ్చర్యం లేదు... ప్చ్... 2018 లో ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో భారీ విజయం సాధించి, ఇక 2019 లో జరిగిన లోకసభ ఎన్నికల్లో చావు తప్పి కన్ను లొట్ట బోయింది మొదలు అన్నీ అయోమయం అడుగులే... అన్నింటా అప్రతిష్టను మూటకట్టుకునే చేష్టలే... వెరసి ఓటమి వైపు పరుగులు.. ఇక రాష్ట్రపతి ఎన్నికకు ఓటు హక్కున్న వారు MP లు మరియు MLA లు మాత్రమే... చివరికి MLC లకు కూడా ఆఁ హక్కు లేదు... ఇకలాంటిది నగర రోడ...