గాంధీ వారసులం కలవడం కష్టం కుటుంబ సభ్యులు 150 మందికిపైనే
గాంధీ వారసులం కలవడం కష్టం కుటుంబ సభ్యులు 150 మందికిపైనే బాపూజీ కుటుంబం సభ్యులు ఎంత మంది ఉన్నారు? వారంతా ఎక్కడ ఉన్నా... ఎప్పుడైనా కలుస్తారా?ఆ కుటుంబంలో ఇప్పటి పిల్లలకు మహాత్ముడి ఆశయాల గురించి తెలుసా?జాతిపిత వారసులు ప్రస్తుతం ఎలా ఉన్నారు? గాంధీ సిద్ధాంతాల పట్ల వారి అభిప్రాయమేంటి? ... అక్టోబరు 2 వస్తోందంటే ఇలా అందరిలో ఎన్నో ప్రశ్నలు... మరి సమాధానాలు ఎలా కనుక్కోవాలి? గాంధీ మునిమనవడు డాక్టర్ ఆనంద్ గోకని గాంధీ అలాంటి ఎన్నో ఆసక్తికర విషయాలను 'హాయ్ 'తో పంచుకున్నారు.* గాంధీజీ కుటుంబ సభ్యులంతా ఎక్కడ? ఎలా ఉన్నారు? మహాత్మా గాంధీకి నలుగురు మగ పిల్లలు. హరిలాల్ , మణిలాల్ , రామ్ దాస్ , దేవదాస్ . రామ్ దాస్ గాంధీ చిన్న కుమార్తె నా తల్లి. గాంధీజీ నలుగురు కుమారుల్లో ఒక్కొక్కరిదీ ఒక్కో రకమైన జీవనశైలి. హరిలాల్ గాంధీ జీవితం కొంచెం చెదిరిపోయింది. మహాత్ముని సూత్రాలు, ఆదర్శాలను ఆయన విభేదించేవారు. ఆయన ఒక్కరే ఒకవైపు ఉండిపోయారు. మిగతా ముగ్గురు కుమారులు గాంధీతో కలిసి దక్షిణాఫ్రికా వెళ్లిపోయారు. ముగ్గురు మగపిల్లలు గాంధీ వెంటే ఉన్నారు. కానీ దక్షిణాఫ్రికా నుంచి తిరిగి వచ్చేటప్పుడు రామ్ దాస్ , దేవదాస్ తిరిగి...