Posts

Showing posts from July, 2018

కేంద్రాన్ని నవీన్ పట్నాయక్ ఎందుకు పొగుడుతున్నారబ్బా?

Image
కేంద్రాన్ని నవీన్ పట్నాయక్ ఎందుకు పొగుడుతున్నారబ్బా? కేంద్ర ప్రభుత్వంపై టీడీపీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చ జరుగుతున్నప్పుడు బిజు జనతా దళ్ (బీజేడీ) సభ నుంచి వాకౌట్ చేయడం రాజకీయ వర్గాలను పెద్దగా ఆశ్చర్యపరచలేదు. బీజేపీకి, కాంగ్రెస్‌కు సమాన దూరంగా ఉంటామని ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ పలుమార్లు చెప్పుకొచ్చారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీతో పొత్తుపై వస్తున్న ఊహాగానాలను కొట్టి పడేశారు. బీజేపీ-బీజేడీ కలిసి చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నాయన్న కాంగ్రెస్ ఆరోపణలను కూడా ఆయన తీసిపారేశారు.   లోక్‌సభలో అవిశ్వాస తీర్మానంపై చర్చ జరుగుతున్నప్పుడు బీజేడీ సభ నుంచి వాకౌట్ చేసింది. ఒడిశా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (ఓపీసీసీ) అధ్యక్షుడు నిరంజన్ పట్నాయక్ మాట్లాడుతూ.. బీజేపీకి మేలు చేసేందుకే బీజేడీ సభ నుంచి వాకౌట్ చేసిందని ఆరోపించారు.   తాజాగా, ఈ రోజు ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశంసించారు. శానిటరీ ప్యాడ్స్‌పై వస్తు సేవల పన్ను (జీఎస్టీ) ఎత్తివేయడాన్ని కొనియాడారు. ప్యాడ్స్‌పై జీఎస్టీ ఎత్తివేయడం వల్ల ప్రభుత్వం అమలు చేస్తున్న ‘ఖుషీ’ పథకానికి మేలు జరుగుతుందన్నారు. ...

కేంద్రం.. పలాయనవాదం

కేంద్రం.. పలాయనవాదం! వీగిన అవిశ్వాసం  అనుకూలం 126 వ్యతిరేకం 325  325 ఓట్లతో మోదీ విజయం  ఓటింగ్ లో పాల్గొనని టీఆర్ఎస్..సేన గైర్హాజరు బీజేడీ సభ్యుల వాకౌట్ ఉదయం 11 నుంచి రాత్రి 11 వరకూ.. సాగిన 12 గంటలు సాగిన సభ సభ సాక్షిగా మాటల మాయ హామీలపై దాటవేత  విభజన సమస్యలు కాంగ్రెస్‌ పాపమే ఆర్థిక సంఘం వల్లే హోదా ఇవ్వలేదు హోదాతో సమానమైన ప్యాకేజీ ప్రకటించాం అందుకు చంద్రబాబు అంగీకరించారు వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే ‘యూటర్న్‌’ వైసీపీ వలలో పడొద్దని ఫోన్‌ చేసి చెప్పాను ఏపీ ప్రజల ఆకాంక్షలు నెరవేరుస్తాం అవిశ్వాసంపై చర్చలో మోదీ మళ్లీ పాత పాట  హోదాపై చర్చ వద్దు.. ప్రాజెక్టులపై దృష్టి పెట్టండి లెక్కలపై హోంమంత్రి రాజ్‌నాథ్‌దీ అదే బాట గల్లా ప్రశ్నలకు సమాధానం నిల్‌ ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి మాటలతో మాయ చేశారు. నవ్యాంధ్రకు ఏమిచ్చారో చెప్పకుండా, ఎలా న్యాయం చేస్తారో వివరించకుండా... చర్చమాటున మాట దాటవేశారు. నవ్యాంధ్రకు అన్యాయంపై తెలుగుదేశం ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చకు సవివరంగా సమాధానం ఇవ్వాల్సిన ప్రధాని... తూతూమంత్రంగా పాత పాటే పాడారు. మొత్తంగా ఏపీకి సాయంపై తగిన సమాధానం ఇవ్వకు...

అవిశ్వాసంపై చర్చ.. ఏ పార్టీకి ఎంత సమయం

అవిశ్వాసంపై చర్చ.. ఏ పార్టీకి ఎంత సమయం ? అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా వివిధ పార్టీలకు లోక్‌సభ స్పీకర్‌ సుమిత్రా మహజన్‌ సమయం కేటాయించారు. సభలో ఆయా పార్టీల సంఖ్యా బలాన్ని బట్టి ప్రసంగించే సమయాన్ని కేటాయించారు. 1. బీజేపీకి మూడు గంటల 33 నిమిషాలు 2. కాంగ్రెస్‌కు 38 నిమిషాలు 3. ఏఐఏడీఎంకే 29 నిమిషాలు 4. తృణమూల్‌ కాంగ్రెస్‌ 27 నిమిషాలు 5. బీజేడీ 15 నిమిషాలు 6. శివసేన 14 నిమిషాలు 7. టీడీపీ 13 నిమిషాలు 8. టీఆర్‌ఎస్‌ 9 నిమిషాలు 8. సీపీఎం 7 నిమిషాలు 10. ఎస్‌పీ 6 నిమిషాలు 11. ఎన్‌సీపీ 6 నిమిషాలు 12. ఎల్‌జేఎస్‌పీకి 5 నిమిషాల సమయం కేటాయించారు.

కొత్త రేషన్‌కార్డులకు మోక్షమెన్నడో..?

Image
కొత్త రేషన్‌కార్డులకు మోక్షమెన్నడో..? పెండింగ్‌లో 8వేల దరఖాస్తులు పథకాల అమలులో అధికారుల బిజీ విచారణకు నోచుకోని దరఖాస్తులు ఆర్‌ఐ లాగిన్‌లో ఓపెన్‌ చేయని పరిస్థితి నల్లగొండ: అర్హులైన పేదలు ఆహార భద్రత కోసం ఎదురు చూస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్తకార్డుల కోసం దరఖాస్తులు స్వీకరించారు. మూడేళ్ల క్రితం తెలంగాణ ప్రభుత్వం పేరిట ఆహారభద్రత కార్డులను జారీ చేశారు. ఈ కార్డులు కూడా అర్హులందరికీ పూర్తి స్థాయిలో అందలేదు. దీన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం 2105 నుంచి 2017 వరకు ఆహార భద్రత కార్డు రానివారు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తులు చేసుకునే వెసులుబాటు కల్పించింది. ఏడాదిన్నర క్రితం జిల్లాల పునర్విభజన నేప థ్యంలో వెబ్‌సైట్‌ను ప్రభుత్వం నిలిపి వేయడంతో అప్పటి నుంచి కొత్త రేషన్‌కార్డులకు దరఖాస్తు చేసుకునే వీలు లేకుండాపోయింది. తాజాగా గత ఏప్రిల్‌ 1నుంచి ఆన్‌లైన్‌ వెబ్‌సైట్‌ను పునరుద్ధరించి మళ్లీ కొత్తకార్డుల కోసం దరఖాస్తులు స్వీకరిస్తోంది. అయితే ఏప్రిల్‌ నుంచి ఇప్పటి వరకు జిల్లాలో నూతన రేషన్‌కార్డుల కోసం 8వేలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. వీటికి ఎప్పటి లోగా మోక్షం కలుగుతుందో తెలియని పరిస్...

హైదరాబాద్‌లో ఐటీ కంపెనీ నిర్వాకం.. 180 మంది తొలగింపు

Image
హైదరాబాద్‌లో ఐటీ కంపెనీ నిర్వాకం.. 180 మంది తొలగింపు అరగంట టైమిచ్చి రాజీనామాకు ఆదేశం 180 మందిని తొలగించిన సీడీకే గ్లోబల్‌ బెదిరించి తొలగించారంటున్న బాధితులు రొటీన్‌లో భాగమేనన్న కంపెనీ ఎండీ ఐటీలో కార్మిక చట్టాలు చట్టుబండలు హైదరాబాద్‌ సిటీ,  రాజధానిలో మరో ఐటీ కంపెనీ అక్కరలేని ఉద్యోగులను వదిలించుకోవడానికి నిబంధనలను తుంగలో తొక్కింది. రహేజా మైండ్‌స్పేస్‌లో ఉన్న సీడీకే గ్లోబల్‌ ఇండియా సంస్థ గత శుక్ర, సోమవారాల్లో కలిపి 180 మంది ఉద్యోగులతో బలవంతంగా రాజీనామాలు చేయించింది. అందులో కొంతమంది పుణే కార్యాలయ ఐటీ నిపుణులు కూడా ఉన్నారు. పొద్దున్నే ఉత్సాహంగా ఆఫీసుకు వచ్చిన ఉద్యోగులను ‘‘ముప్పయి నిమిషాల సమయం ఇస్తున్నాం. రాజీనామా చేసి వెళ్లిపోండి’’ అంటూ హెచ్‌ఆర్‌ సిబ్బంది ఆదేశించారు. లేఆఫ్‌ ఉద్యోగులకు ఇచ్చే పరిహారాలేవీ ఇవ్వలేదు. ఇస్తామని కూడా చెప్పలేదు. నిబంధనల గురించి ప్రశ్నించిన వారిని ఐటీ రంగంలో మరెక్కడా ఉద్యోగం దొరక్కుండా చేస్తామని బెదిరించారు. రాజీనామా చేసిన వారంతా నిజానికి గెంటివేతకు గురైనవారే. ఉద్యోగుల తొలగింపు వ్యవహారంలో సీడీకె గ్లోబల్‌ పూర్తిగా చట్టాలను ఉల్లంఘించిందని ఫోరమ్‌ ఫర్‌ ఐటీ ప్రొఫెషనల్...

నేడు రాష్ట్రవ్యాప్తంగా రాస్తారోకోలు: వీహెచ్‌పీ

నేడు రాష్ట్రవ్యాప్తంగా రాస్తారోకోలు: వీహెచ్‌పీ    రాష్ట్ర ప్రభుత్వం పరిపూర్ణానంద స్వామీజీని నగరం నుంచి బహిష్కరించడం యావత్‌ హిందూ సమాజాన్ని తీవ్రంగా అవమానించడమేనని వీహెచ్‌పీ రాష్ట్ర అధ్యక్షుడు రామరాజు అన్నారు. బుధవారం కోఠిలోని వీహెచ్‌పీ రాష్ట్ర కార్యాలయంలో విలేకరులతో ఆయన మాట్లాడారు. పరిపూర్ణానంద స్వామీజీని నగర బహిష్కరణ చేయడాన్ని నిరసిస్తూ ఈనెల 19న తెలంగాణలోని అన్ని ప్రాంతాల్లో వీహెచ్‌పీ, బజరంగ్‌దళ్‌ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహిస్తున్నామని తెలిపారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు రహదారుల దిగ్బంధం ఉంటుందని చెప్పారు. రాజ్యాంగాన్ని సంరక్షించడం ప్రభుత్వ విధి అని, ధర్మాన్ని రక్షించడం స్వామీజీల లక్ష్యమని అన్నారు. ప్రభుత్వం వెంటనే స్వామీజీపై బహిష్కరణను ఉపసంహరించుకుని క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్‌ చేశారు.

Venkaiah Naidu makes record, speaks in ten languages in Rajya Sabha

Venkaiah Naidu makes record, speaks in ten languages in Rajya Sabha Setting a record, Rajya Sabha Chairman M. Venkaiah Naidu on Wednesday spoke in ten languages in the House. He spoke, though briefly, in Bangla, Gujarati, Kannada, Malayalam, Marathi, Nepali, Oriya, Punjabi, Tamil and Telugu to inform the members that simultaneous interpretation service has now been made available for the members to speak in any of the 22 languages listed in the eighth schedule of the Constitution. At the command of Naidu, who is an ardent advocate of speaking in mother tongue, Rajya Sabha Secretariat has made available interpretation facility for five more languages i.e. Dogri, Kashmiri, Konkani, Sindhi and Santhali. or other 17 languages, Rajya Sabha already has interpreters for 12 languages and interpreters of Lok Sabha are made available for five other languages. Naidu informed the members of the new Interpretation Service during the Zero Hour today. The monsoon session, which concludes on August 10...

అవిశ్వాసం వీగిపోవడం ఖాయం.. మాకు 314 మంది ఎంపీల మద్దతు: బీజేపీ

అవిశ్వాసం వీగిపోవడం ఖాయం.. మాకు 314 మంది ఎంపీల మద్దతు: బీజేపీ   ఈ నెల 20న లోక్‌సభలో మోదీ సర్కారుపై టీడీపీ పెట్టనున్న అవిశ్వాస తీర్మానం వీగిపోవడం ఖాయమని తెలుస్తోంది. స్పీకర్‌తో కలుపుకుని లోక్‌సభలో బీజేపీ బలం 274. ఎన్డీయేలోని జేడీయూ, లోక్‌జనశక్తి, శిరోమణి అకాళీదళ్‌తో పాటు చిన్నాచితకా పార్టీలు ప్రభుత్వానికి మద్దతుగా నిలుస్తున్నాయి. ఎన్డీయేతర పార్టీల మద్దతు కూడా తమకు లభిస్తుందని బీజేపీ విశ్వాసం వ్యక్తం చేస్తోంది. ఇప్పటివరకూ తమకు మద్దతిస్తోన్న ఎంపీలతో కలుపుకుంటే తమ బలం 314 అవుతుందని బీజేపీ అంటోంది. టీఆర్ఎస్, శివసేన, బిజూ జనతాదళ్, అన్నాడీఎంకే ఇంకా తమ వైఖరిని స్పష్టం చేయలేదు. టీడీపీ పెట్టే అవిశ్వాస తీర్మానానికి మద్దతుగా కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీతో పాటు ఇతర చిన్నా చితకా పార్టీల ఎంపీలు ఓటు వేయనున్నారు. 

ఎంసెట్ ఇంజనీరింగ్ తుదివిడత కౌన్సిలింగ్ షెడ్యూల్

Image
 ఎంసెట్ ఇంజనీరింగ్ తుదివిడత కౌన్సిలింగ్ షెడ్యూల్ విడుదలైంది. ఈ నెల 20, 21 తేదీల్లో ఆన్ లైన్ రిజిస్ట్రేషన్‌ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నెల 21న సర్టిఫికెట్ల పరిశీలన ఉంటుంది. 21 నుంచి 23వ తేదీ వరకు వెబ్ ఆప్షన్ల నమోదుకు అవకాశం కల్పించారు. ఈ నెల 25న తుది విడత సీట్లు కేటాయించనున్నారు.

దుర్గమ్మకు కేసీఆర్‌ కానుకలపై పిటిషన్‌ విచారణకు స్వీకరించిన హైకోర్టు....

దుర్గమ్మకు కేసీఆర్‌ కానుకలపై పిటిషన్‌ విచారణకు స్వీకరించిన హైకోర్టు.....! సీఎం  కేసియార్   కనకదుర్గ అమ్మవారికి సమర్పించిన వజ్రాల ముక్కుపుడకకు వెచ్చించిన రూ.5 కోట్ల సొమ్మును ప్రభుత్వ ఖజానాకు జమ చేసేలా ఆదేశాలు జారీ చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని ఉమ్మడి హైకోర్టు విచారణకు స్వీకరించింది. సికింద్రాబాద్‌కు చెందిన ప్రొఫెసర్‌ పి.ఎల్‌.విశ్వేశ్వరరావు దాఖలు చేసిన ఈ పిటిషన్‌ను మంగళవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ టీబీఎన్‌ రాధాకృష్ణన్‌, జస్టిస్‌ రమేశ్‌ రంగనాథన్‌లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది.  పిటిషనర్‌ తరఫు న్యాయవాది మహమ్మద్‌ అబ్దుల్‌ ఖ్వావీ అబ్బాసీ వాదనలు వినిపించారు. దీనికి ఆధారాలేమిటని ధర్మాసనం ప్రశ్నించగా పత్రికల్లో కథనాలు వచ్చాయని న్యాయవాది చెప్పారు. ఇదే వ్యవహారానికి సంబంధించి మరో పిటిషన్‌ పెండింగ్‌లో ఉందని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది సంజీవ్‌కుమార్‌ ధర్మాసనం దృష్టికి తీసుకురాగా ప్రొఫెసర్‌ పి.ఎల్‌.విశ్వేశ్వరరావు పిటిషన్‌తో జత చేయాలని రిజిస్ట్రీని ఆదేశించింది.. By sources

ఎంపీలకు విప్ జారీ చేసిన బీజేపీ

Image
ఎంపీలకు విప్ జారీ చేసిన బీజేపీ  18 Jul 2018, 05:26 PM  న్యూఢిల్లీ: పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన తొలిరోజే టీడీపీ కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశ పెట్టడంతో మోదీ సర్కార్ విశ్వాస పరీక్షను ఎదుర్కోవాల్సి వచ్చింది. అవిశ్వాస తీర్మానంపై వచ్చే శుక్రవారం చర్చించనున్నట్లు స్పీకర్ సుమిత్రా మహాజన్ వెల్లడించారు. ఈ నేపథ్యంలో అధికార బీజేపీ తన పార్టీ ఎంపీలకు మూడు లైన్ల విప్ జారీ చేసింది. ఒకవేళ ఆ రోజు లోక్‌సభలో జరిగే చర్చలో పాల్గొనకుండా డుమ్మా కొట్టిన ఎంపీలపై అనర్హత వేటు కూడా వేసే అవకాశం ఉందని హెచ్చరించింది. శుక్రవారం రోజున జరిగే సమావేశంలో ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు రోజంతా చర్చలు జరగనున్నాయి. జీరో అవర్‌తో పాటు ప్రైవేట్ బిల్లులు ప్రవేశపెట్టేందుకు అవకాశంలేదు. ప్రధాని నరేంద్రమోదీ ప్రసంగం అనంతరం అవిశ్వాసంపై ఓటింగ్ జరగనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. జులై 20న జరిగే విశ్వాస పరీక్షలో పూర్తి మెజారిటీతో గెలుస్తామని కేంద్ర మంత్రి రామ్‌దాస్ అథవాలే అన్నారు. ఓటింగ్‌లో నెగ్గడం తమకు చాలా సులువైన విషయమని పేర్కొన్నారు. మా సామర్థ్యం ఏంటో ప్రతిపక్షానికి చూపిస్తామని సవాల్...

రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి కార్లకూ నంబర్లు ఉండాల్సిందే!

రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతితోపాటు గవర్నర్లు, లెఫ్ట్‌నెంట్ గవర్నర్ల అధికారిక వాహనాలకు కూడా రిజిస్ట్రేషన్ నంబర్లు ఉండాల్సిందేనని ఢిల్లీ హైకోర్టు బుధవారం స్పష్టంచేసింది. రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్నవాళ్ల వాహనాలపై కూడా జాతీయ చిహ్నం బదులు రిజిస్ట్రేసన్ నంబర్లు ఉండాలంటూ గతంలోనే ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఇలా ప్రత్యేకంగా వాళ్ల వాహనాలపై నాలుగు సింహాల గుర్తు ఉండటం వల్ల వాళ్లను లక్ష్యంగా చేసుకోవడం సంఘ విద్రోహ శక్తులకు సులువవుతుందని ఈ పిటిషన్ వేసిన ఓ ఎన్జీవో వాదించింది. అంతేకాదు ఇలాంటి చిహ్నాలు ఉన్న కార్ల జోలికి పోలీసులు, ఇతర అధికారులు అస్సలు వెళ్లరు. దీనివల్ల కొందరు నేరస్థులు, ఉగ్రవాదుల తమ కార్యకలాపాల కోసం ఇలాంటి కార్లను వాడే ప్రమాదం కూడా ఉంది అని పిటిషన్ స్పష్టంచేసింది. రిజిస్ట్రేషన్ నంబర్ లేకపోవడం అంటే నిబంధనల ఉల్లంఘన జరగడంతోపాటు వాటికి ఇన్సూరెన్స్ లేదని కూడా స్పష్టమవుతుందని ఆ ఎన్టీవో తన పిటిషన్‌లో పేర్కొన్నది. విదేశాంగ శాఖ ఆధీనంలో ఉన్న 14 కార్లను రిజిస్టర్ చేయలేదన్న ఓ ఆర్టీఐ సమాచారం మేరకు ఈ పిటిషన్ దాఖలు చేశారు.

గ్రేట్ న్యూస్ పాకిస్తాన్‌ జెండాలను పోలిన ఆకుపచ్చ జెండాలను భారతదేశంలో నిషేధించాలని షియా వక్ఫ్‌ బోర్డు చైర్మన్‌ సయ్యద్‌ వసీం రజ్వీ సుప్రీంకోర్టు పిల్‌ దాఖలు

గ్రేట్ న్యూస్  పాకిస్తాన్‌ జెండాలను పోలిన ఆకుపచ్చ జెండాలను భారతదేశంలో నిషేధించాలని షియా వక్ఫ్‌ బోర్డు చైర్మన్‌ సయ్యద్‌ వసీం రజ్వీ సుప్రీంకోర్టు పిల్‌ దాఖలు దేశంలో చాలా చోట్ల నెలవంక, నక్షత్రంతో కూడిన ఆకుపచ్చ రంగ జెండాలను ముస్లిం ప్రభావిత ప్రాంతాల్లో ఎగరవేస్తున్నారని, వాటిని నిషేధించాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. దీనిపై స్పందించిన సుప్రీంకోర్టు ధర్మాసనం కేంద్ర ప్రభుత్వం అభిప్రాయం తెలుసుకున్న తరువాత తుది నిర్ణయం ప్రకటిస్తామని సోమవారం పేర్కొంది నక్షత్రంతో కూడిన ఆకుపచ్చ జెండా 1906లో మహ్మద్‌ అలీ జిన్నా స్థాపించిన ముస్లిం లీగ్‌ పార్టీకి చెందినది. మన దేశంలో దాన్ని ఇస్లామిక్‌ జెండాగా భావిస్తారు. ముస్లింలు అధికంగా ఉండే ముంబై లాంటి ప్రాంతాల్లో భవనాలపైన, మత స్మారక చిహ్నాలపైన పాకిస్తాన్‌కు చెందిన ముస్లిం లీగ్‌ పార్టీ జెండాను పొలిన జెండాలను ఎగరవేస్తున్నారని వసీం రజ్వీ తన పిటిషన్‌లో తెలిపారు

సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌కు వెళుతున్నారా..? అయితే జర జాగ్రత్త..!

సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌కు వెళుతున్నారా..? అయితే జర జాగ్రత్త..! టీటీఈల అరాచకానికి కేరాఫ్‌... సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌..! బెదిరింపులు, దాడులకు పాల్పడుతున్న టీటీఈలు ప్రయాణికులను కొట్టడానికి స్టేషన్‌లో ప్రత్యేక గది అక్రమ సంపాదనతో నిండుతున్న టీటీఈల జేబులు ప్రయాణికులపై హల్‌చల్‌ కొరవడిన రైల్వే ఉన్నతాధికారుల పర్యవేక్షణ అది దక్షిణమధ్య రైల్వే స్టేషన్లలో అత్యంత పెద్ద స్టేషన్‌. నిత్యం వందల రైళ్ల రాకపోకలతో.. లక్షల మంది ప్రయాణికులతో రద్దీగా ఉండే స్టేషన్‌. దేశం నలుమూలలకూ ప్రయాణికులను సురక్షితంగా చేరవేస్తూ.. కీర్తిప్రతిష్ఠలు పొందిన స్టేషన్‌. ప్రయాణికుల భద్రతకు మారుపేరుగా నిలిచిన స్టేషన్‌. ఇదీ ఇప్పటి వరకు ఈ స్టేషన్‌కున్న ఘన చరిత్ర...! కానీ.. కొంత మంది సిబ్బంది కారణంగా రూపుమాపేలా గొప్ప అపకీర్తిని మూటగట్టుకుంటోంది. కొందరు టీటీఈల అరాచకాలు, దాడులు, బెదిరింపుల కారణంగా స్టేషన్‌కు చెడ్డపేరుస్తోంది. స్టేషన్‌కు వచ్చే ప్రయాణికులను బెదిరించి, దాడులు చేసి బలవంతంగా డబ్బులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. అమయాక ప్రయాణికుల నిలువు దోపిడీకి కేరాఫ్‌ అడ్రస్‌గా మారుతోంది. అదే మన సికింద్రాబాద్‌ రైల్వే...

నేను సంఘ విద్రోహ శక్తినా?

నేను సంఘ విద్రోహ శక్తినా? తెలంగాణ ప్రభుత్వ విజ్ఞతకే వదిలేస్తున్నా! ఇలాంటి చర్యలు నా పోరాటాన్ని ఆపలేవు స్వామి పరిపూర్ణానంద హైదరాబాద్‌ నుంచి బహిష్కరణకు గురైన శ్రీ పీఠం పీఠాధిపతి స్వామి పరిపూర్ణానంద తెలంగాణ ప్రభుత్వం తీరు పై తీవ్రంగా మండిపడ్డారు. సంఘ విద్రో హ శక్తిగా పేర్కొంటూ తనను బహిష్కరించడం ఎంతవరకూ సబబని ప్రశ్నించారు. 300 గ్రామాలను దత్తత తీసుకుని, వెనకబడ్డ ప్రాంతాలలోని పిల్లలకు సంధ్యా గురుకులం పేరిట దేశభక్తిని పెంపొందిస్తున్నానని, వందలాది గోవులు, గిత్తలు రైతులకు దానం చేసి గోఆధారిత వ్యవసాయానికి తోడ్పాటునందిస్తున్నానని వివరించారు. దీనికి ప్రతిగా సంఘ విద్రోహశక్తి నిర్వచనం ఇవ్వడాన్ని తెలంగాణ ప్రభుత్వ విజ్ఞతకే వదిలేస్తున్నట్లు పరిపూర్ణానంద చెప్పారు. కాకినాడ శ్రీపీఠంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఇలాంటి చర్యలతో తన ధర్మపోరాటం ఆగిపోదని, దేశంలో ఉన్న మిగతా రాష్ట్రాల్లో హిందూ ధర్మపరిరక్షణ కోసం పాటుపడతానని స్పష్టం చేశారు.   హిందూ మతంపై అనుచిత వ్యాఖ్యలు, దూషిస్తూ పుస్తకాలు రాసిన వారిపై తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడం శోచనీయమని ఆయన అన్నారు. వేంకటేశ్వరస్వామి, సుప్రభాతాలపై బాబు గోగి...

అక్కడ ఒక్క నిమిషం ఆపితే చాలు..! 10 Jul 18, 11:53 AM నిమిషం హాల్టింగ్‌తో రైల్వేస్టేషన్‌పై తగ్గనున్న భారం ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు నగర శివారు స్టేషన్లలో ఆపాలి

అక్కడ ఒక్క నిమిషం ఆపితే చాలు..! నిమిషం హాల్టింగ్‌తో రైల్వేస్టేషన్‌పై తగ్గనున్న భారం ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు నగర శివారు స్టేషన్లలో ఆపాలి సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌పై ఒత్తిడి తగ్గించడానికి నూతనంగా చర్లపల్లి, నాగులపల్లి, లింగంపల్లి ప్రాంతాల్లో రైల్వే టర్మినల్స్‌ ఏర్పాటుకు రైల్వేశాఖ కసరత్తు చేస్తోంది. చర్లపల్లి టర్మెనల్‌కు తప్ప మిగతా రెండింటికి కేవలం కాగితాలకే పరిమితమైంది. టర్మినల్స్‌తో సమస్యలు తీరుతాయని భావించిన రైలు ప్రయాణికులకు నిరాశే మిగులుతోంది. చర్లపల్లి స్టేషన్‌లో ప్రస్తుతం ఉన్న రెండు ప్లాట్‌ఫామ్‌లకు అదనంగా మరో ఆరు ప్లాట్‌ఫామ్‌లు నిర్మించనున్నారు. ఇక్కడ సరిపడా భూమి లేకపోవడంతో భూసేకరణ పనిలో రైల్వేశాఖ ఉంది. సుమారు 80కోట్ల రూపాయలతో భారీ టర్మినల్‌ నిర్మించనున్నారు. గతంలో బడ్జెట్‌లో నిధులు సైతం కేటాయించారు.   నాగులపల్లి టర్మినల్‌కు 250 ఎకరాల భూమి అవసరం ఉండడంతో దక్షిణమధ్య రైల్వే, రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణపై దృష్టిసారించారు. ఇక లింగంపల్లి రైల్వేస్టేషన్‌లో ఇప్పటికే 6 ప్లాట్‌ఫామ్‌లు ఉండడంతో టర్మినల్‌ నిర్మాణం త్వరగా చేపట్టవచ్చని రైల్వేశాఖ యోచిస్తోంది. 200 రైళ్లు దేశంలోని వివిధ ప్రాంతాలకు...

హైదరాబాద్‌లో ప్రమాదభరితంగా యూటర్న్‌లు

హైదరాబాద్‌లో ప్రమాదభరితంగా యూటర్న్‌లు ఎక్కడా సూచిక బోర్డులు లేవు రహదారుల విస్తరణ లేదు ఇరుకు రోడ్లతో ప్రమాదాల్లో వాహనదారులు నగరంలో యూటర్న్‌లు ప్రమాదభరితంగా మారుతున్నాయి. అక్కడ సిగ్నల్స్‌, బారికేడ్లు లేకపోవడంతో యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. రోడ్లు ఇరుకుగా ఉండటంతో టర్న్‌ తీసుకోవడానికి వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో ట్రాఫిక్‌ జాం అవుతోంది. కొన్నిచోట్ల ఈ మలుపులు ఉపయోగపడే ప్రాంతాల్లో కాకుండా ఎక్కడో ఉంటున్నాయి. దాని వల్ల చాలా దూరం ప్రయాణించి వెనక్కి తిరిగి రావాల్సి వస్తోంది.   హైదరాబాద్‌: కేపీహెచ్‌బీ నుంచి కూకట్‌పల్లిలోని బాలాజీనగర్‌కు వెళ్లాలంటే ప్రభుత్వ డిగ్రీ కళాశాల వరకూ వెళ్లి యూటర్న్‌ తీసుకోవాలి. అంటే హనదారుడు దాదాపు 3 కిలోమీటర్లు అదనంగా వెళ్లి మలుపు తీసుకుని రావాలి. దీనివల్ల సమయం, డబ్బు వృథా అవుతోంది. దీనికి తోడు ట్రాఫిక్‌ జాం. దీంతో చాలా మంది వివేకానంద రిహబిలిటేషన్‌ సెంటర్‌ నుంచి రాంగ్‌రూట్‌లో వెళ్తూ ప్రమాదాలకు గురవుతున్నారు. లేదా చలానాలను భరిస్తున్నారు. అందువల్ల ఈ దూరాభారాలను తగ్గించాలని వాహనదారులు కోరుకుంటున్నారు.   సిగ్నల్స్‌ తొలగించి యూటర్న్‌లు ఆర్టీసీ క్రాస్‌రోడ్‌...

హైదరాబాద్ మెట్రో స్టేషన్లలో అయోమయ పరిస్థితి..!

హైదరాబాద్ మెట్రో స్టేషన్లలో అయోమయ పరిస్థితి..! డిస్‌ప్లే బోర్డుల్లో అసంపూర్తి సమాచారం హైదరాబాద్‌: మెట్రో రైల్వే స్టేషన్లలో ఏర్పాటు చేసి డిస్‌ప్లే బోర్డులు ప్రయాణికులకు అర్థం కావడం లేదు. ఈ బోర్డుల్లో సమాచారం డిస్‌ప్లే అవుతున్నా.. రైళ్లు ఎటువైపు నుంచి వస్తున్నాయో తెలియడం లేదని అంటున్నారు. మెట్రో సేవలు అందుబాటులోకి రావడంతో నగరంలో ప్రజా రవాణా వ్యవస్థలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. అంతర్జాతీయ ప్రమాణాలు, అత్యాధునిక మౌలిక వసతులే కాదు సమయ పాలన మెట్రో రైళ్ల రాకపోకల్లో ఉంటోంది. అయితే కొన్ని మెట్రోస్టేషన్‌లలో ఉన్న డిస్‌ప్లే బోర్డుల్లో సమాచారం అసంపూర్తిగా ఉంటోంది. డిస్‌ప్లే బోర్డులపై సమయాన్ని సూచిస్తున్నా, అది ఎటువైపు నుంచి వస్తుందో తెలియక ప్రయాణికులు అయోమయానికి గురవుతున్నారు. సాధారణ రైల్వే స్టేషన్‌లలో రైళ్ల రాకపోకలపై ఉండే పబ్లిక్‌ అనౌన్స్‌మెంట్‌ వ్యవస్థ మెట్రోస్టేషన్‌లలో లేదు.   కేవలం మెట్రో ప్లాట్‌ఫాంపై ఏర్పాటు చేసిన డిస్‌ప్లే బోర్డులు చూసి తెలుసుకో వాల్సి ఉంటుంది. ఈ బోర్డులపై ఏర్పాటు చేస్తున్న సమయాలు అందరికీ సులభంగా అర్థం కావడం లేదు. చాలామంది రైలు ఎటు నుంచి వస్తుందో తోటి ప్రయాణికుల ను, మె...

హైదరాబాద్‌లో బస్సెక్కాలంటే..

హైదరాబాద్‌లో బస్సెక్కాలంటే.. పాతబస్సులతో ప్రయాణం నరకప్రాయం కండిషన్‌లో లేని వాహనాలతో అవస్థలు ట్రాఫిక్‌ వలయంలో డ్రైవర్లపై ఒత్తిడి పట్టించుకోని ఆర్టీసీ అధికా నగరంలో ఓ గంట బండి నడపాలంటే కష్టం. అలాంటిది ట్రాఫిక్‌ పద్మవ్యూహం చుట్టుముడుతున్న రోడ్లపై 8గంటలపాటు పాత బస్సులు నడపాలంటే ఎంత అవస్థనో అర్ధం చేసుకోవచ్చు. గ్రేటర్‌ ఆర్టీసీలోని 2,340 ఆర్డినరీ బస్సుల్లో సగం పాతవే కావడంతో డ్రైవర్లకు నిత్యం ఇబ్బందులు తప్పడం లేదు. కండిషన్‌ సరిగ్గా లేని బస్సులతో రద్దీ ప్రాంతాలు, ట్రాఫిక్‌లో ఎక్కడ నిలిచిపోతాయో, ఎక్కడ కంట్రోల్‌ అవ్వవోనని ఆందోళన చెందుతున్నారు.   డ్రైవింగ్‌ సీటు కూడా అనువుగా లేక ఆస్పత్రుల పాలవుతున్నారు. కొందరు డ్రైవర్లు సొంత ఖర్చులతో సీటు మరమ్మతులు చేయించుకుంటున్నారు. ప్రధాన రహదారుల్లో తిరిగే బస్సులకు సైతం బ్రేకులు సరిగ్గా పడక ప్రమాదాలు జరుగుతున్నాయి. వందల సంఖ్యలో బస్సులకు హెడ్‌లైట్స్‌ వెలగడం లేదు. శివారు ప్రాంతాలకు తిరిగే బస్సులకు హెడ్‌లైట్స్‌, ఇండికేటర్స్‌ లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. హారన్లు మోగడం లేదని డిపోల్లో ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా పట్టించుకునే వారు కరువయ్యారని డ్రైవర్లు వాపోత...

శ్రీ పీఠం పీఠాధిపతి పరిపూర్ణానందస్వామిపై తీవ్రస్థాయిలో మండిపడ్డ కత్తి మహేష్ తండ్రి తండ్రి కత్తి ఓబులేసు

*తిరుపతి బ్రేకింగ్* శ్రీ పీఠం పీఠాధిపతి పరిపూర్ణానందస్వామిపై తీవ్రస్థాయిలో మండిపడ్డ కత్తి మహేష్ తండ్రి తండ్రి కత్తి ఓబులేసు పరిపూర్ణానందస్వామి అజ్ఞాని కత్తి మహేష్ ను కాదు హిందువులను రెచ్చగొడుతున్న పరిపూర్ణానందను దేశ బహిష్కరణ చేయాలి కత్తి మహేష్ దళితుడు కాబట్టే బ్రాహ్మణులు అనవసర రార్థాంతం చేస్తున్నారు రాముడు గురించి కత్తి మహేష్ మాట్లాడింది నూటికి నూరుశాతం నిజమే నా కొడుకు హిందువే కత్తి మహేష్ నాస్తికుడు కాదు...ఆస్తికుడు.. నా కొడుకు భార్యతో కలిసే ఉన్నాడు..విడిపోలేదు ఈనెల 4వతేదీ లక్నోకు వెళ్ళి కుమారుడి పుట్టినరోజు వేడుకలకు హాజరై వచ్చాడు సామాజిక మాథ్యమాల్లో కావాలనే కొంతమంది కత్తి మహేష్ పై వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారు రామాయణం విష వృక్షం పుస్తకం పూర్తిగా చదివితే రాముడు ఎలాంటి వాడో అందరికీ అర్థమవుతుంది By sources 

నీట్, జేఈఈ, నెట్‌కు కొత్త షెడ్యూల్

నీట్, జేఈఈ, నెట్‌కు కొత్త షెడ్యూల్‌ నీట్, జేఈఈ, నెట్ పరీక్షలను ఇక నుంచి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహించనున్నది. ఈ విషయాన్ని కేంద్ర హెచ్‌ఆర్డీ మంత్రి ప్రకాశ్ జవదేకర్ తెలిపారు. ప్రస్తుతం సీబీఎస్‌ఈ ఈ పరీక్షలను నిర్వహిస్తున్నది. నెట్(నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్)ను డిసెంబర్‌లో, జేఈఈ మెయిన్స్‌ను జనవరి, ఏప్రిల్ నెల్లో, నీట్‌ను ఫిబ్రవరి, మే నెలల్లో నిర్వహించనున్నట్లు మంత్రి తెలిపారు. అన్ని పరీక్షలను కంప్యూటర్ ఆధారంగా చేపట్టనున్నారు. విద్యార్థులు పరీక్ష కోసం కంప్యూటర్ సెంటర్లలో ప్రాక్టీసు చేసుకోవచ్చు అని మంత్రి తెలిపారు. ప్రభుత్వ గుర్తింపు పొందిన కంప్యూటర్ సెంటర్ల వివరాలను త్వరలో వెల్లడించనున్నారు. By sources

సికింద్రాబాద్ రైల్వేస్టేషనే వారి టార్గెట్..అక్కడ జరిగే పని ఇదే..

సికింద్రాబాద్ రైల్వేస్టేషనే వారి టార్గెట్..అక్కడ జరిగే పని ఇదే.. అన్ని ప్రాంతాల్లో నిఘా కరువు దొంగలకు సేఫ్ జోన్ సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ సీసీ కెమెరాలున్నా ఫుటేజీల్లో స్పష్టత కరువు ముందుకు సాగని కేసుల దర్యాప్తు బయటి కెమెరాల ఆధారంగా ఛేదన సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌,  నేర పరిశోధనలో సీసీ ఫుటేజీలు కీలక భూమిక పోషిస్తాయి. తీగ లాగితే డొంక కదిలినట్టు నేరస్థుల కదలికలు వాటి ఆధారంగా బయటపడుతున్నాయి. కేసుల దర్యాప్తులో పోలీసులకు మార్గదర్శకంగా పనిచేసి దొంగలను పట్టుకోవడంలో సహకరిస్తున్నాయి. కెమెరాల నిఘాలో ఉన్న ప్రాంతాల్లో చోరీలకు పాల్పడిన నిందితులు సులువుగా దొరికే అవకాశాలు ఎక్కువ. సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో సీసీ కెమెరాలు ఉన్నా ఫుటేజీల్లో స్పష్టత లేకపోవడంతో నిందితులను గుర్తించడంలో పోలీసులకు సవాల్‌గా మారుతోంది. 220 రైళ్లలో సుమారు లక్షా 60 మంది ప్రయాణికులు రాకపోకలు సాగించే ఈ స్టేషన్‌లో సీసీ కెమెరాల వ్యవస్థ పటిష్ఠంగా లేదు. ఎప్పుడో ఏర్పాటు చేసిన వాటిపై ఆధారపడుతున్నారు తప్ప ఎప్పటికప్పుడు నూతన సాంకేతికతను అందుబాటులోకి తీసుకురావటానికి రైల్వేశాఖ శ్రద్ధ చూపడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. రైల్వేస...

బ్యాంకు అధికారుల సంచలన నిర్ణయాలు

బ్యాంకు అధికారుల సంచలన నిర్ణయాలు అన్ని కేంద్రాల వద్ద భద్రతా సిబ్బంది తక్కువ లావాదేవీలు జరిగేవి అర్ధరాత్రి మూసివేత సైబర్‌ నేరగాళ్లకు చెక్‌ పెట్టడానికి బ్యాంకర్ల చర్యలు శివారు ప్రాంతాల్లో ఉన్న వాటి వివరాలు అందజేయాలన్న పోలీసులు సైబర్‌ నేరగాళ్లకు చెక్‌ పెట్టడానికి బ్యాంకర్లు ప్రత్యేక చర్యలు చేపట్టారు. కేటుగాళ్లు ఏటీఎం మెషీన్లలో స్కిమ్మర్లను అమర్చి డెబిట్‌ కార్డుల సమాచారాన్ని తస్కరించే వీల్లేకుండా అన్నింట్లో యాంటీ స్కిమ్మర్‌ టెక్నాలజీని అప్‌లోడ్‌ చేసేందుకు చర్యలు తీసుకోనున్నట్టు బ్యాంకు అధికారులు తెలిపారు. సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్‌లో సీపీ సజ్జనార్‌ ఆధ్వర్యంలో సైబర్‌ క్రైం పోలీసులు, బ్యాంకు అధికారుల సమావేశం ఇటీవల జరిగింది. సైబర్‌ నేరగాళ్లు ఏటీఎం సెంటర్లలో స్కిమ్మర్లను బిగించి డెబిట్‌ కార్టుల సమాచారాన్ని తస్కరించి నకిలీ కార్డులను సృష్టించి అమాయకుల ఖాతాల నుంచి లక్షల రూపాయలు కొల్లగొట్టారు. మరికొంతమంది కేటుగాళ్లు నకిలీ ధ్రువీకరణ పత్రాలు సృష్టించి కిందిస్థాయి బ్యాంకు సిబ్బందిని బుట్టలో వేసుకొని క్రెడిట్‌ కార్డులు పొందారు. వాటి ద్వారా రెండు ముఠాలకు చెందిన సైబర్‌ నేరగాళ్లు బ్యాంకులకు రూ. 2 కోట్...

GST anniversary: A simplified tax regime has improved ease of doing business, but barriers remain: Entrepreneurs

The Goods and Services Tax (GST) regime celebrated its first anniversary on 1 July. The biggest tax reform since independence, the GST was rolled out at midnight on 30 June by Prime Minister Narendra Modi and the then President Pranab Mukherjee, in the central hall of Parliament. GST has subsumed over a dozen local taxes in its stated aim of 'One Nation One Tax'. Over 1.11 crore businesses are registered under the GST. Firstpost spoke to companies to find out what they view as the positives and the pain-points of the indirect tax regime. Almost everyone we spoke to said the GST has helped organise the unorganised sector to a large extent, and, in many cases, has revolutionised entire industries. However, our interviewees did dwell on certain aspects, in the GST regime, that can be improved. Industry speak follows: Simplicity, clarity and comfort: The main aim of the GST was a simplified tax system. Being deliberated for over 15 years, it became a reality under the Narendra Modi...

BJP's attempts to form govt with runaway PDP MLAs may incite further turbulence in Jammu and Kashmir

Following the fall of the Mehbooba Mufti government in Jammu and Kashmir last month, the Bharatiya Janata Party (BJP) has been quietly examining various options to form the government in the state, although nothing concrete has come out so far. However, political analysts fear that any attempts by the BJP to form the government, with a breakaway faction of the Peoples Democratic Party (PDP), will trigger more resentment and unrest in the Valley, which is already reeling under intense volatility. A split in the PDP to form a third front, which could either align with the National Conference-Congress coalition or the BJP, would be seen as another intervention by New Delhi to rule the state by engineering 'defections'. The alliance, particularly with the BJP, would be seen by the people as another attempt that a ruling party at the Centre was turning to 'horse trading' to form the government. The resentment will get intensified as all political parties including NC, PDP an...

Amit Shah asks 'BJP cyber warriors' to spread like fire, ensure party's win in 2019 LS polls

Terming the party's social media volunteers "cyber warriors", BJP chief Amit Shah on Wednesday asked them to spread like fire from Jammu and Kashmir to Kanyakumari to ensure the party's victory in the 2019 Lok Sabha elections. Shah, who was the chief guest at the BJP's 'Social media volunteers meet of eastern UP' held in Varanasi, said the volunteers need to use their creative minds to defeat opponents and give a befitting reply to those spreading lies against the party and Prime Minister Narendra Modi. The BJP president was on a two-day visit to Uttar Pradesh to feel the pulse of the people ahead of the crucial 2019 Lok Sabha elections. He asked volunteers to spread like fire from Jammu and Kashmir to Kanyakumari to ensure the BJP's victory in the Lok Sabha elections scheduled next year. He said that there was no leader like Modi in the country whose reach was pan-India. "Does (Andhra Pradesh CM) Chandrababu (Naidu) or (former PM) Deve Gowda have...

Good governance and development our goal in Kashmir: PM Modi

Good governance and development our goal in Kashmir: PM Modi ... The union government's goal in Jammu and Kashmir is “good governance, development, responsibility and accountability”, Prime Minister Narendra Modi has said. “Recurrent terror attacks” that were common under the UPA rule are now history, Modi asserted in an interview to Swarajya magazine while discussing wide-ranging issues of internal security, including Maoist violence and the situation in the North East.

2 Amarnath Yatris dead, 4 injured as rains trigger landslide on Baltal route

2 Amarnath Yatris dead, 4 injured as rains trigger landslide on Baltal route Two yatris died and four others were injured, one of them critically, after rains triggered a landslide along the Baltal route of the ongoing Amarnath yatra in Kashmir Himalayas. An official said that landslide triggered by heavy rains occurred mid-way between Brarimarg and Railpathri along the Baltal route leading to cave shrine today evening, resulting into death of two pilgrims and injuries to four others. The injured yatris were shifted to a hospital for treatment where the condition of one of them is stated to be serious. The teams of army, state police, SDRF and NDRF have reached at the spot, said the official By sources

Amit Shah to conclude nation-wide tour for Lok Sabha polls on July 22

BJP president Amit Shah will by July 22 wrap up his nation-wide tour to firm up the party's organisational machinery ahead of the Lok Sabha elections and is scheduled to visit politically crucial states such as Uttar Pradesh and Bihar in the coming days. Amit Shah will be in Kerala on Tuesday, in UP on July 4 and 5, in Jharkhand on July 11 and in Bihar on July 12 before he concludes the exercise on July 22 with meetings in Mumbai with various party wings of Maharashtra and Goa, BJP sources said. The tour is focussed on the parliamentary polls, they said, adding that he meets the party's core group, scheduled castes and tribes leaders, Lok Sabha 'toli'- a group formed in every states with an eye on the general election - and full-time leaders made in charge of every constituency in respective states. Amit Shah also meets the party's social media team in every state. He has already finished the exercise in 18 states, they said. Meetings of some states like Andhra Prad...