నీట్, జేఈఈ, నెట్‌కు కొత్త షెడ్యూల్

నీట్, జేఈఈ, నెట్‌కు కొత్త షెడ్యూల్‌

నీట్, జేఈఈ, నెట్ పరీక్షలను ఇక నుంచి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహించనున్నది. ఈ విషయాన్ని కేంద్ర హెచ్‌ఆర్డీ మంత్రి ప్రకాశ్ జవదేకర్ తెలిపారు. ప్రస్తుతం సీబీఎస్‌ఈ ఈ పరీక్షలను నిర్వహిస్తున్నది. నెట్(నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్)ను డిసెంబర్‌లో, జేఈఈ మెయిన్స్‌ను జనవరి, ఏప్రిల్ నెల్లో, నీట్‌ను ఫిబ్రవరి, మే నెలల్లో నిర్వహించనున్నట్లు మంత్రి తెలిపారు. అన్ని పరీక్షలను కంప్యూటర్ ఆధారంగా చేపట్టనున్నారు. విద్యార్థులు పరీక్ష కోసం కంప్యూటర్ సెంటర్లలో ప్రాక్టీసు చేసుకోవచ్చు అని మంత్రి తెలిపారు. ప్రభుత్వ గుర్తింపు పొందిన కంప్యూటర్ సెంటర్ల వివరాలను త్వరలో వెల్లడించనున్నారు.
By sources

Comments

Popular posts from this blog

అర్ధరాత్రి రోడ్లపై తిరిగితే అరెస్ట్‌! టోలీచౌకీ పోలీసుల కఠిన చర్యలు

🔐 కొత్త ఆధార్ కార్డు డిజైన్: ఫోటో & QR కోడ్ మాత్రమే – మీ గోప్యతకు కొత్త రక్షణ!

🗳️🔥 లోక్‌సభలో ఘాటు డిబేట్: రాహుల్ విసిరిన 3 ఆరోపణలకు అమిత్ షా ఇచ్చిన ఝలక్!