Posts

Showing posts from June, 2022

హైదరాబాద్‌ రానున్న ప్రధాని నరేంద్ర మోదీ మాత్రం ఓ సామాన్యురాలి చేతి వంట రుచి చూడబోతున్నారు...

Image
దేశ ప్రధానికి వండి, వడ్డించడమంటే... కనీసం అయిదు నక్షత్రాల హోటల్‌లో చేయి తిరిగిన నలభీములు అయ్యుండాలి కదా... కానీ... హైదరాబాద్‌ రానున్న ప్రధాని నరేంద్ర మోదీ మాత్రం ఓ సామాన్యురాలి చేతి వంట రుచి చూడబోతున్నారు... నేపథ్యం అతి సాధారణమైనా తెలంగాణ రుచుల తయారీలో మాత్రం అసామాన్యురాలీమె... అందుకే ఏరికోరి ఎంపికచేశారు... జులై 2 నుంచి జరగనున్న భాజపా జాతీయ కార్యవర్గ సమావేశాలకు హాజరయ్యే ప్రధాని నరేంద్రమోదీకి అచ్చ తెలంగాణ వంటలు రుచి చూపించాలని నిర్ణయించారు. దీనికోసం కరీంనగర్‌ జిల్లాకు చెందిన గూళ్ల యాదమ్మను ఎంపికచేశారు. 29 సంవత్సరాలుగా వంటలు చేస్తూ జీవిస్తున్న యాదమ్మ స్వగ్రామం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌ మండలం గౌరవెల్లి గ్రామం. 15వ ఏటనే కరీంనగర్‌ జిల్లా చిగురుమామిడి మండలం కొండాపూర్‌కు చెందిన వ్యక్తితో పెళ్లయింది. దీంతో కరీంనగర్‌ చేరుకున్న యాదమ్మ మంకమ్మతోటలో వెంకన్న అనే వ్యక్తి దగ్గర వంటలు నేర్చుకుంది. ఈమె చేసే శాకాహార, మాంసాహార వంటకాలు తిన్నవారు ఆహా అనకుండా ఉండలేరని చెబుతారు. 10వేల మందికి కూడా ఇట్టే వండివార్చేస్తారు యాదమ్మ. మంత్రులు కేటీఆర్‌, గంగుల కమలాకర్‌ పాల్గొన్న కార్యక్రమాలతో పాటు భాజపా రాష్ట్ర అధ్...

తెలంగాణలోనే కాకుండా జాతీయస్థాయిలో సైతం బీజేపీని ఎలాగైనా అడ్డుకోవాలని... సీఎం

Image
తెలంగాణలోనే కాకుండా జాతీయస్థాయిలో సైతం బీజేపీని ఎలాగైనా అడ్డుకోవాలని... సీఎం కేసీఆర్ చేస్తున్న ప్రయత్నాలు చూస్తుంటే ఉట్టికెగరలేనమ్మ స్వర్గానికి.... అన్న సామెత గుర్తుకొస్తోంది. కాషాయదళాన్ని అడ్డుకోవడమే లక్ష్యంగా కేసీఆర్ వేస్తున్న అడుగులు తప్పటడుగులు తప్ప ఇంకేం కాదనడానికి రాష్ట్రపతి ఎన్నికల విషయంలో ఆయన తీసుకున్న నిర్ణయమే పెద్ద ఉదాహరణ. జాతీయస్థాయిలో కాంగ్రెస్సేతర... బీజేపీయేతర కూటమి అంటూ బీరాలు పలికిన ఈ పెద్ద మనిషి... విపక్ష అభ్యర్థిగా యశ్వంత్ సిన్హా ఎంపిక అనంతరం అయనకు మద్దతునిచ్చే విషయంలో ఏ నిర్ణయమూ వెంటనే చెప్పక... బీజేపీని అడ్డుకునే విషయంలో తాను నిజాయితీగానే ఉన్నట్టు నటించి... చివరికి ఆ కాంగ్రెస్ పార్టీ ఉన్న విపక్షకూటమి అభ్యర్థికే మద్దతు పలికి తమ గులాబీ రంగు ఎప్పటికైనా వెలిసిపోయేదే... కాంగ్రెస్‌తో కలిసిపోయేదే అన్నట్టుగా అసలు రంగు బయటపెట్టుకున్నారు. మరోవైపు కేసీఆర్ మేకపోతు గాంభీర్యానికి తగ్గట్టుగానే కాంగ్రెస్ తీరు కూడా ఉంది. తెలంగాణలో టీఆరెస్, కాంగ్రెస్ పార్టీలు నానా విమర్శలూ చేసుకుంటున్నట్టు పైకి బిల్డప్పులిస్తుంటే... జాతీయ స్థాయిలో మాత్రం రాహుల్, సోనియాలు ఏమీ స్పందించరు. పైగా విపక్ష...

నిన్న కాంగ్రెస్ పార్టీ పాలిత రాజస్తాన్ రాష్ట్రంలోని "జయపూర్"లో జరిగిన అమానుష విషాద ఘటన

Image
నిన్న కాంగ్రెస్ పార్టీ పాలిత రాజస్తాన్ రాష్ట్రంలోని "జయపూర్"లో జరిగిన అమానుష విషాద ఘటన ఒకవైపు ఇరాక్ & సిరియా దేశాల్లో జరిగే మతోన్మాదుల ఆటవికతను తలపించింది... అలాగే కేరళ రాష్ట్రంలో తరచుగా జరిగే హిందువుల నరికివేత... ఇంకా ఆఁ మధ్య కర్ణాటక రాష్ట్రంలో హిజబ్ వివాద సమయంలో హర్ష అనే ఒక భజరంగ్ దళ్ కార్యకర్త నరికివేత... ఇకివన్నీ చూస్తుంటే... ఈమధ్యే హైదరాబాదులోని నాంపల్లి కోర్టు కొట్టేసిన "ఒక్క అయిదు నిముషాలు గనుక పోలీసులు పక్కకు జరిగితే ఒక్క హిందువు కూడా మిగలడు..." అంటూ ఆఁ మధ్య అక్బరుద్దీన్ ఓవైసి అన్న బహిరంగ బెదిరింపు గుర్తుకొస్తున్నది... ఈ సంఘటనలన్నీ కూడా మతోన్మాదుల నుండీ ముంచుకొస్తున్న ప్రమాదాన్ని సూచిస్తూ, ఏమారిస్తే హిందువులు ఎలాంటి పరిస్థితుల్ని ఎదుర్కొబోతున్నారో అనే హెచ్చరికను తెలియజెప్పుతున్నది. ఇక ఇలాంటి సంఘటల్ని అవకాశాన్ని తీసుకొని దాన్ని BJP పై తోసేందుకు అటు ఆఁ మతోన్మాదులతో పాటు ఇటు సెక్యూలర్ గాళ్ళు... సెక్యూలర్ పార్టీలు ఈ పెచ్చరిల్లుతున్న వీళ్ళ మతోన్మాదమంతటికీ అసలైన కారణం BJP పాలననే అని సుత్రీకరణలు చేస్తుండడం గమనించొచ్చు. అయితే ఇన్నాళ్లు కాంగ్రెస్ పార్టీ పాలనలో ఈ ...

నాడు... ముఖ్యమంత్రి పీఠం ఎక్కేందుకు :"హిందుత్వంను అటకెక్కించాడు.."

Image
నాడు...  ముఖ్యమంత్రి పీఠం ఎక్కేందుకు : "హిందుత్వంను అటకెక్కించాడు.." ఇవ్వాళ్ల... ముఖ్యమంత్రి పీఠం కాపాడుకునేందుకు : "హిందుత్వంను తలకెత్తుంటున్నాడు" నాడు మతోన్మాదులు మార్చిన :  'ఔరాంగాబాద్' పేరును "#శంభాజీనగర్"గా 'ఉస్మానాబాద్'పేరును "#ధారాశివ్"గా  మారుస్తూ ఇవ్వాల్టి ఉద్దావ్ థాక్రే మంత్రివర్గం నిర్ణయం. గమనార్హం మరియు విచిత్రమేంటంటే, ఇదే పేర్ల మార్పును ఎప్పటినుండో కోరుతున్నప్పటికీ అసలు పట్టించుకోని ప్రభుత్వం, ఇవ్వాళ్ల తానేదో హిందుత్వవాదిని అని చెప్పేందుకే ఉద్దావ్ హడావిడి నిర్ణయం. ఇకిదే సందర్బంలో 'సందట్లో సడేమియా'లా "పూణే" నగర పేరును కూడా "జిజావ్ నగర్"గా మార్చాలంటూ కాంగ్రెస్ పార్టీ డిమాండ్... ఇవ్వాల్టి వరకు అన్నీ హిందూ వ్యతిరేక నిర్ణయాలు తీసుకున్న ఈ హిందూ వ్యతిరేక ప్రభుత్వం ఇవ్వాళ్ల చావు ముంగిట్లో చిల్లర చేష్టలు...

మానవహక్కులు ఎక్కడ చచ్చాయి?సెక్యులరిజం ఎక్కడ దాక్కుంది?

Image
మానవహక్కులు ఎక్కడ చచ్చాయి? సెక్యులరిజం ఎక్కడ దాక్కుంది? భావప్రకటనా స్వేచ్ఛ మీ బావలకే పరిమితమా? మేతావులూ ఎక్కడ గడ్డి మేస్తున్నారు? ర్యాలీలకు కొవ్వొత్తులు దొరకలేదా? కన్హయ్య కుమార్ తప్ప కన్హయ్యా లాల్ అవసరం లేదా? తుకుడే టుకుడేలు తప్ప ఉదయపూర్ పూర్ టైలర్ కోన్ కిస్కానేనా? మీ మౌనం దేనికి సంకేతం?? ‘గప్పాల్ గొడ్తరు గాడ్దె కొడుకులు.. శబ్భాష్‌రా శంకరా’

బిజెపి స్టేట్ ఆఫీస్ ముందు ఏర్పాటుచేసిన డిజిటల్ కౌంట్ డౌన్ అడ్వర్టైజ్మెంట్ కు 55 వేల ఫైన్ విధించిన ఈ.వీ.డి.ఎం అధికారులు..

Image
బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశాలకు దేశ ప్రధాని వస్తుండడంతో నగర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు, బ్యానర్లు, కట్ అవుట్లను ఏర్పాటు చేసిన బిజెపి.. హైదరాబాద్ నగర వాసులు ఫిర్యాదు మేరకు వాటి ను ఏర్పాటు చేసిన బీ.జే.పి నాయకులకు  ఇప్పటివరకు దాదాపుగా 3 లక్షల 32000 ఫైన్ విధించిన జిహెచ్ఎంసి ఎన్ఫోర్స్మెంట్ విభాగం.. బిజెపి స్టేట్ ఆఫీస్ ముందు ఏర్పాటుచేసిన డిజిటల్ కౌంట్ డౌన్ అడ్వర్టైజ్మెంట్ కు 55 వేల ఫైన్ విధించిన ఈ.వీ.డి.ఎం అధికారులు.. దీంతో ఇప్పటి వరకు 3,57000 ఫైన్ లు విధింపు.. ఈ ఫైన్ ల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది..

గతంలో కెటిఆర్ బ్యానర్ల పై లెక్చర్లు ఇచ్చింది కూడా గుర్తు పెట్టుకోవాలి...

Image
బ్యానర్ల రాష్ట్ర సమితి ఎన్ని ఎత్తులు వేసిన ఎం కాదు.. బ్యానర్ల తో బీజేపీ దేశంలో అధికారంలోకి రాలేదు ... గొంతుక తో ప్రజల ఆదరణ తోనే బీజేపీ దేశంలో అధికారంలోకి వుంది అనేది గుర్తు పెట్టుకోవాలి... దేశ గౌరవం బ్యానర్లతో ముడిపడి లేదు.... బ్యానర్లు వేసుకొని బీజేపీ ప్రజలను ఆకర్షించే ప్రయత్నం ఎప్పుడు చేయలేదు... గతంలో కెటిఆర్ బ్యానర్ల పై లెక్చర్లు ఇచ్చింది కూడా గుర్తు పెట్టుకోవాలి...

మోడీ అధికారంలో ఉన్నాడు కాబట్టి సుప్రీం క్లీన్ చిట్ ఇచ్చింది అని మొన్నటి సుప్రీంకోర్టు తీర్పుపై కొందరి గోల.

Image
మోడీ అధికారంలో ఉన్నాడు కాబట్టి సుప్రీం క్లీన్ చిట్ ఇచ్చింది అని మొన్నటి సుప్రీంకోర్టు తీర్పుపై కొందరి గోల.  మొన్నటిది తుది తీర్పు కాదు.   తాము నియమించిన సిట్ ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా సుప్రీంకోర్టు మోడీ ప్రధాని కాక ముందే 2013 లోనే పూర్తి క్లీన్ చిట్ ఇచ్చింది.  సిట్ ఇచ్చిన ఆ క్లీన్ చిట్ పై 5 సం. లు తరువాత 2018 లో మళ్ళీ జకీయా జాఫ్రీ అనే ఆమె వేసిన పిటిషన్ పై నిన్న సుప్రీంకోర్టు తీర్పు చెపుతూ సిట్ పనితనాన్ని, నివేదికను మరొక సారి మెచ్చుకుంటూ ఈ అల్లర్లలో మోడీ పేరు ఎలాగైనా ఇరికించాలి అని కుట్ర చేసిన వారి అందరి పేర్లు, వారి చేతలు అన్ని సుప్రీంకోర్టు తన 452 పేజీల తీర్పులో వివరంగా పేర్కొంది. ఈ జకీయా జాఫ్రీ అనే ఆమె 2002 అల్లర్లలో తన భర్త పోయాడని అప్పటికి అధికారంలో ఉన్న వారి అలసత్వం వల్లే పోయాడు అని సంఘటన జరిగిన 4 సం. లు తరువాత 2006 లో మొదటి పిటిషన్ వేసింది. ఈ పిటిషన్ వేయించడం వెనకాల తీస్తా తెసేల్వాద్ అనే జర్నలిస్ట్ మరియు మానవ హక్కుల కార్యకర్త ఉంది అని అప్పుడే అనుమానాలు వ్యక్తం అయ్యాయి. ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పులో ఈ విషయం స్పష్టంగా పేర్కొంది. "ఈ తీస్తా అనే ఆమె పూర్వాపరాలు చూస్త...

*ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటనకు షెడ్యూల్ ఖరారు*.

Image
*ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటనకు షెడ్యూల్ ఖరారు*. హైదరాబాద్‌: ప్రధానమంత్రి నరేంద్రమోదీ తెలంగాణ పర్యటనకు షెడ్యూల్‌ ఖరారైంది. జులై 2న మోదీ హైదరాబాద్‌ రానున్నారు.  ఆరోజు మధ్యాహ్నం బేగంపేట విమానాశ్రయానికి చేరుకుని అక్కడి నుంచి రాజ్‌భవన్‌కు వెళ్తారు.రాజ్‌భవన్‌ నుంచి రోడ్డు మార్గం ద్వారా నోవాటెల్‌ హోటల్‌కు చేరుకుంటారు.  జులై 2, 3 తేదీల్లో మోదీ నగరంలోనే ఉండి రాజ్‌భవన్‌లో బస చేస్తారు.  తిరిగి 4వ తేదీ ఉదయం ఆంధ్రప్రదేశ్‌కు వెళ్తారు.  జులై 1న మధ్యాహ్నం 3గంటలకు భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హైదరాబాద్‌ చేరుకుంటారు.  ఆయనకు శంషాబాద్‌ విమానాశ్రయం వద్ద భాజపా శ్రేణులు ఘన స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.  శంషాబాద్‌లో కిలోమీటరు దూరం నిర్వహించే రోడ్‌షోలో నడ్డా పాల్గొంటారు.

*బిగ్ బ్రేకింగ్ న్యూస్**కేసీఆర్ జాతీయ పార్టీ ప్రకటన వాయిదా..*

Image
*బిగ్ బ్రేకింగ్ న్యూస్* *కేసీఆర్ జాతీయ పార్టీ ప్రకటన వాయిదా..* తెలంగాణ సీఎం శ్రీ కేసీఆర్ గారు జాతీయ పార్టీ పెట్టబోతున్న సంగతి తెలిసిందే. తెలంగాణ రాష్ట్రంలో తిరుగులేని నేతగా ఎదిగిన కేసీఆర్ , జాతీయ స్థాయిలో కూడా అదే మాదిరిగా తన సత్తా చాటుకోవాలని చూస్తున్నారు. ఇప్పటికే దీనికి సంబదించిన ఏర్పాట్లు చేసుకున్నారు. జాతీయ పార్టీ ఏర్పాటుపై ఈ నెల మూడో వారంలో ప్రకటన చేయబోతారని వార్తలు కూడా వినిపించాయి. కానీ ప్రస్తుతం ఆ ప్రకటనను వాయిదా వేసుకున్నట్లు తెలుస్తుంది. తాజా సమాచారం ప్రకారం రాష్ట్రపతి ఎన్నికల తర్వాతే జాతీయ పార్టీ ఏర్పాటుపై ప్రకటన చేయాలని కేసీఆర్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా రాష్ట్రపతి ఎన్నికల హడావుడి నెలకొంది. ఇలాంటి తరుణంలో కొత్త జాతీయ పార్టీని ప్రకటించినా అందరి అటెన్షన్ ఎన్నికల వైపే ఉంటుందని కేసీఆర్ భావించినట్లు తెలుస్తోంది. అదే సమయంలో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు కూడా పార్టీ ప్రకటన వాయిదా పడటానికి కారణమనే వాదన వినిపిస్తోంది. ఈ సమావేశాల సందర్భంగా ప్రధాని మోదీ టీఆర్ఎస్‌ పట్ల ఎలాంటి వైఖరి తీసుకుంటారో చూశాకే పార్టీపై ప్రకటన చేసే యోచనలో కేసీఆర్ ఉన్నట్లు ప్రచారం...

అంత్యక్రియలు అప్పుడు కుండలో నీరు పోసి రంధ్రాలు పెట్టి పగలగొడతారు ఎందుకో తెలుసా?

Image
అంత్యక్రియలు అప్పుడు కుండలో నీరు పోసి రంధ్రాలు పెట్టి పగలగొడతారు ఎందుకో తెలుసా? వాస్తవానికి శరీరం ఆత్మ రెండు వేరు వేరు. కలియుగ ధర్మం ప్రకారం.. మనిషి జీవితకాలం 120 సంవత్సరాలు. కానీ... ఈ మందుల తిండికి ఆయుష్షు 100 సంవత్సరాల లోపు పడిపోయింది. ఇంకా కొందరైతే ఈ కొత్త కొత్త రోగాలకు 60 కే అంతిమయాత్ర అవుతుంది. ఆత్మ చెప్పినట్టు శరీరం వినాలంటే... శరీరం ఆరోగ్యంగా ఉండాలి. శరీరంలో ప్రాణం ఉన్నంత సేపు అందులో ఆత్మ ఉంటుంది. శరీరం చనిపోయిందంటే ఆత్మ అందులో ఉండలేదు. ఎందుకంటే ఆత్మ చెప్పినట్టు శరీరం వినే స్థితిలో లేదు. బతికి ఉన్నంత కాలం భార్యాపిల్లలు, బంధువులు, స్నేహితులు, తాగుడు, తినుడు, పైసా సంపాదన లో లీనమై పోతుంది. ఎప్పుడైతే మనిషి చనిపోతాడో... శరీరం నుండి ఆత్మ వేరైపోతుంది. శరీరాన్ని దహనం చేసే దాకా... ఆత్మ, మళ్లీ తన శరీరం లోకి చొచ్చి తిరిగి శరీరాన్ని లేపి, మళ్ళి... తన వాళ్లతో కలిసి ఉండాలని ప్రయత్నిస్తూనే ఉంటుంది. పాడె కట్టి శరీరాన్ని ఎత్తుకు పోయేటప్పుడు స్మశానానికి కొద్ది దూరంలో దాన్ని దింపి, చిన్న ముల్లెలో కట్టిన బియ్యాన్ని (డెలివరీ అయి బిడ్డ బతికి చనిపోయిన ఆడవాళ్ళకి ఆవాలను కడతారు) విప్పి కింద పోస్తారు. ఎంద...

జులై 1న హైదరాబాద్​కు నడ్డా.. భారీ ర్యాలీకి ప్రణాళిక

Image
భాజపా జాతీయ కార్యవర్గ సమావేశాలకు హాజరయ్యేందుకు కమల దళపతి జేపీ.నడ్డా జులై ఒకటో తేదీన హైదరాబాద్ కు రానున్నారు. శంషాబాద్ విమానాశ్రయం వద్ద భారీ స్వాగతం పలికేందుకు రాష్ట్ర నాయకత్వం ఏర్పాట్లు చేసింది. విమానాశ్రయం నుంచి నోవాటెల్ వరకు 50వేల మందితో భారీ ర్యాలీ నిర్వహించనుంది. హైదరాబాద్​లో జులై 2,3 తేదీల్లో భాజపా జాతీయ కార్యవర్గ సమావేశాల నేపథ్యంలో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఒక రోజు ముందుగానే ఇక్కడికి రానున్నారు. విమానాశ్రయంలో స్వాగతం పలికిన అనంతరం అక్కణ్నుంచి నోవాటెల్​ వరకు వేల మందితో భారీ ర్యాలీ నిర్వహించాలని పార్టీ హైదరాబాద్​, రంగారెడ్డి జిల్లాల అధ్యక్షులతో శుక్రవారం జరిగిన సమావేశంలో నిర్వహించారు. జులై 2న హైదరాబాద్​కు రానున్న ప్రధాని మోదీ 4వ తేదీవ రాష్ట్ర రాజధానిలోనే ఉంటారని పార్టీ ముఖ్య నేత ఒకరు తెలిపారు. 4న ఆయన హైదరాబాద్​ నుంచి ఆంధ్రప్రదేశ్​కు వెళ్తారని.. భీమవరంలో జరిగే అల్లూరి సీతారామరాజు జయంతి ఉత్సవాలలో పాల్గొంటారని సమాచారం. రాష్ట్రంలో 119 శాసనసభ నియోజకవర్గాలకు ఇతర రాష్ట్రాలకు చెందిన భాజపా ముఖ్య నేతలు వెళ్లి బస చేసేలా పార్టీ ప్రణాళిక రూపొందించింది. 3న జరిగే మోదీ సభకు ఆయా నియోజకవర...

రైల్వే స్టేషన్ కాల్పుల్లో మరణించిన దామెర రాకేశ్ సోదరుడికి ప్రభుత్వ ఉద్యోగం ఉత్తర్వులు జారీ

Image
*రైల్వే స్టేషన్ కాల్పుల్లో మరణించిన దామెర రాకేశ్ సోదరుడికి ప్రభుత్వ ఉద్యోగం* హైదరాబాద్, జూన్ 24 : ఈనెల తేదీన 17 వ సికిందరాబాద్ రైల్వే స్టేషన్లో జరిగిన కాల్పుల్లో మరణించిన దామెర రాకేష్ కుటుంబ సభ్యులలో అర్హులైన ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించనున్నట్టు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటన అనుసరించి రాకేష్ అన్న అయిన దామెర రామ్ రాజు కు ఉద్యోగం కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. దామెర రామ్ రాజు విద్యార్హతలకనుగుణంగా వరంగల్ జిల్లాలో తగిన ఉద్యోగం ఇవ్వాల్సిందిగా వరంగల్ జిల్లా కలెక్టర్ ను ఆదేశిస్తూ ఆ ఉత్తర్వులో పేర్కొన్నారు.

వింతజీవి ఆర్జీవీకి కాస్త గట్టిగానే గడ్డి పెడదాం అనుకున్నా.. కానీ ట్విట్టర్ పరిమిత అక్షరాలనే అనుమతిస్తుంది కదా..

Image
వింతజీవి ఆర్జీవీకి కాస్త గట్టిగానే గడ్డి పెడదాం అనుకున్నా.. కానీ ట్విట్టర్ పరిమిత అక్షరాలనే అనుమతిస్తుంది కదా.. సోకాల్డ్ సెలబ్రిటీలకు అడ్డగోలుగా వాగే స్వేచ్ఛ ఎవడూ ఇవ్వలేదు. జీవితంలో కష్టపడి పైకి వచ్చిన గిరిజన మహిళ, ఆమెకు ఉన్న వ్యక్తిత్వం, సంస్కారం, సేవాగుణంలో గోరంత కూడా ఈయనకు ఉండకపోవచ్చు.. ద్రౌపది పాత్రకు ఉన్న ఔన్నత్యం గురుంచి దేవున్ని నమ్మని ఈయనకు చెప్పాల్సిన అవసరం లేదు.. కానీ వ్యక్తుల పేర్లను పట్టుకొని కించపరచడం ఏం సంస్కారం?. ఈయన బుద్దిలేని జీవి అని నేను ఎప్పుడూ పట్టించుకోలేదు.. కానీ ఇప్పుడు మాత్రం క్షమించలేకపోతున్నాను..

రాష్ట్రపతి అభ్యర్థిగా శ్రీమతి ద్రౌపది ముర్ము గారు నామినేషన్ దాఖలు చేసిన సందర్భంగా బిజెపి రాష్ట్ర కార్యాలయం వద్ద సంబరాల్లో

Image
ఎన్డీయే తరుపున రాష్ట్రపతి అభ్యర్థిగా శ్రీమతి ద్రౌపది ముర్ము గారు నామినేషన్ దాఖలు చేసిన సందర్భంగా బిజెపి రాష్ట్ర కార్యాలయం వద్ద బిజెపి ఎస్టీ మోర్చా ఆధ్వర్యంలో జరిగిన సంబరాల్లో పాల్గొనడం జరిగింది.  రాష్ట్రపతి అభ్యర్థిగా ఆదివాసీలకు అవకాశం ఇచ్చిన ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు, బిజెపి జాతీయ అధ్యక్షులు శ్రీ జేపీ నడ్డా గారికి ధన్యవాదాలు. శ్రీమతి ద్రౌపది ముర్ము గారి ఎంపిక దేశవ్యాప్తంగా ఎస్టీ సామాజివర్గానికి దక్కిన గుర్తింపు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్‌ గారి ఆశయాలకు అనుగుణంగా బిజెపి ముందుకెళ్తోంది. #DraupadiMurmu

సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మ పై అబిడ్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన బీజేపీ నాయకులు.

Image
సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మ పై అబిడ్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన బీజేపీ నాయకులు. NDA రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపతి ముర్ము ను కించపరిచే విదంగా వర్మ ట్వీట్ చేశారని ఫిర్యాదు లో పేర్కొన్న బీజేపీ నాయకులు. రాంగోపాల్ వర్మ చేసిన ట్వీట్ పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని అబిడ్స్ పోలీసులను కోరిన బీజేపీ నేతలు గూడూరు నారాయణరెడ్డి , మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్.

మిగతా పార్టీలతో పొత్తులు పెట్టుకొని ప్రభుత్వాలు ఏర్పాటు చేయడం ఎప్పటికైనా ప్రమాదమే... తలనొప్పినే...

Image
మిగతా పార్టీలతో పొత్తులు పెట్టుకొని ప్రభుత్వాలు ఏర్పాటు చేయడం ఎప్పటికైనా ప్రమాదమే... తలనొప్పినే... ఇక ప్రస్తుత మహారాష్ట్రా రాష్ట్ర అసెంబ్లీ పదవీ కాలం ఇంకో 2+ సంవత్సరాలు మాత్రమే... ఇక శివసేనతో సంబంధాలు తెగాక, మహారాష్ట్రాలో శివసేన పార్టీ ఎంతగా ప్రజల్లో పట్టు కోల్పోయిందో... అదే స్థాయిలో BJP బలపడింది. ఇక ఈ 2 సంవత్సరాలు గనుక BJP ఓపిక పట్టి వేచిచూస్తే, శివసేన పార్టీ ఇంచుమించు మొత్తంగా అంతర్ధానమై, ఆఁ స్థానాన్ని BJP ఆసాంతం ఆక్రమించే పరిస్థితులు కనబడుతున్న సమయంలో మళ్ళీ విడివడ్డ శివసేన పార్టీతో కేవలం ఈ రెండేళ్ల అధికారం కోసం అంటే తన ఎదుగుదలను తానే నరుక్కోవడమే కాకుండా... శాశ్వతంగా చెప్పులో రాయిని పెట్టుకోవడమే. పోనీ పార్టీ ఎదిగే అవకాశం లేదంటే... అది వేరే సంగతి. కానీ శివసేనతో విడివడ్డాక రోజురోజుకు BJP బలపడ్డమే కాకుండా 2019 అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 288 స్థానాల్లో శివసేన పొత్తుతో తన వాటా కొచ్చిన 144 స్థానాల్లో 106 BJP గెలవగా అదే శివసేన తాను తన వాటాగా వచ్చిన 144 స్థానాల్లో కేవలం 56 మాత్రమే గెలవడం గమనార్హమే కాదు... BJP బలానికి తార్కానం. మరలాంటి పరిస్థితుల్లో BJP పార్టీ శివసేనతో పొత్తుకు వెంపర్లాడ్డం త...

పప్పూగాడు భారతీయుడా ? బ్రిటీషోడా ?

Image
ఇది చదివితే మీకే తెలుస్తుంది. పప్పూగాడూ, వాళ్ళమ్మ నేషనల్ హెరాల్డ్ కేసులో అడ్డంగా బుక్కయ్యారు కదా, నెక్స్‌ట్ లైన్లో ఉన్న కేసు గురించి చెప్పుకొందాం. వివరాల్లోకెళ్ళేముందు ఓసారి సుబ్రహ్మణ్యస్వామిగారికి జేజేలు పలుకుదాం. ఎందుకంటే, సుబ్రహ్మణ్యస్వామిగారే నేషనల్ హెరాల్డ్ కేసుని తవ్వితీసారు, పప్పూగాడి పౌరసత్వం గురించీ తెలియజేశారు. అంతేకాక తల్లీకొడుకుల ఫేక్ సర్టిఫికెట్స్ కూడా తెప్పించి కంప్లెయింట్ చేశారు. సుబ్రహ్మణ్యస్వామిగారు లీక్ చేసిన వివరాల్లోకెళితే.. పప్పూగాడు భారతీయుడు కాదు. వాడికి 4 పాస్‌పోర్టులున్నాయి. బ్రిటీష్ పౌరసత్వం ఉంది. దానికి ఆధారాలేమిటంటే,  బ్యాకప్స్‌ లిమిటెడ్‌ అనే బ్రిటీష్ కంపెనీ  51, సౌత్‌గేట్ స్ట్రీట్, వించెస్టర్, హ్యాంప్‌షైర్ ఎస్‌వో23 9ఈహెచ్ అడ్రస్ పై రిజిస్టరై ఉంది. ఆ కంపెనీకి ఒక డైరెక్టరుగా నమోదు కోసం సమర్పించిన పత్రాల్లో పప్పూగాడు తాను బ్రిటీష్ పౌరుణ్ణని చెప్పాడు. ఆ కంపెనీ యొక్క వార్షిక రిటర్నుల్లో (10/10/2005 నుంచి 31/10/2006) పప్పూ పుట్టిన తేదీ 19/06/1970 అనీ, జాతీయత బ్రిటిషర్ అనీ పత్రాలు సమర్పించాడు. అంతేకాదు, బ్యాకప్స్ లిమిటెడ్ కంపెనీని 2009 ఫిబ్రవరి 17 నాటి కం...

నీలోఫర్ దవాఖానాలో పీల్చి పిప్పి చేస్తున్న సిబ్బంది

Image
నీలోఫర్ దవాఖానాలో పీల్చి పిప్పి చేస్తున్న సిబ్బంది -రోగుల బంధువుల వద్ద నుంచి సిబ్బంది చేతి వాటం -ప్రభుత్వ దవాఖానకు వచ్చినా రోగులకు తప్పని ఖర్చులు ఖైరతాబాద్, ప్రజాతంత్ర, జూన్ 23 : నగరంలో ఎంతో పేరు ప్రఖ్యాతలు గల చిన్న పిల్లల, గర్భిణీ స్త్రీల దవాఖాన నీలోఫర్ లో అక్కడి సిబ్బంది రోగుల బంధువుల వద్ద నుంచి సిబ్బంది చేతి వాటం ప్రదర్శిస్తున్నారు. లోపలికి అనుమతించాలంటే డబ్బులు ఇవ్వాల్సిందే నంటూ పీల్చి పిప్పి చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి వైద్యం కోసం వస్తున్న నిరుపేదలను నిలువునా దోచేస్తున్నారు. ఇటీవల ఎర్రగడ్డకు చెందిన రేణుక తన కుమార్తె దివ్యను డెలివరీ నిమిత్తం నిలోఫర్ దవాఖానలో అడ్మిట్ చేసింది. మూడు రోజుల్లో అక్కడి సిబ్బందికి సుమారు రూ.2 వేల నుంచి రూ.3 వేల ఖర్చు చేశానని వాపోయింది. గేట్ వద్ద, వార్డు బయటకు వెలితే లోపలికి అనుమతించేందుకు తమ నుంచి, తమతో పాటు చూడటానికి వచ్చిన తమ బంధువుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారని వాపోయింది. ప్రైవేటు దవాఖానకు వెళ్ళే స్తోమత లేని తాము ప్రభుత్వ దవాఖానలో వెళితే అక్కడ కూడా వేలకు వేలు ఖర్చు చేసే పరిస్థితి ఏర్పడిందన్నారు. పేదలకు ఉచిత వైద్యం అందిస్తా...

గేమ్ ఓవర్,ఉద్ధవ్ ఠాక్రే కి చెక్ మేట్ పెట్టేసారు,

Image
గేమ్ ఓవర్, ఉద్ధవ్ ఠాక్రే కి చెక్ మేట్ పెట్టేసారు, తనకు మద్దతుగా 56మందిలో 42మంది శివసేన MLA లు ఉన్నారు కాబట్టి టెక్నీకల్ గా శివసేన పార్టీ తమదే అని పార్టీ చీఫ్ విప్ గా #Bharat_Gogawale ని నియమించిన శివసేన చీఫ్ ఏకనాధ్ షిండే, పార్టీ గుర్తు బాణం ధనస్సు కూడా తమకే ఇవ్వాలని ఎన్నికల కమిషన్ కి లేఖ, ఫైనల్ టచ్ ఏంటో తెలుసా..?? తొందరలో జరగబోయే ఫ్లోర్ టెస్ట్ లో శివసేన ఎమ్మెల్యేలకు విప్ జారిచేయనున్నారు, ఈ సందర్భంలో తమతోలేని ఉద్ధవ్ కోటరీలో ఉన్న 13మందికి కూడా విప్ అమలుకాబోతుంది, ఈ విప్ కి వ్యతిరేకంగా పార్టీకి వ్యతిరేకంగా ఓటు వేస్తే పార్టీ నిర్ణయం అతిక్రమించినందుకు వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోబోతున్నారు, సో ఇక ఆదిత్య ఠాక్రే(ఉద్ధవ్ ఠాక్రే కొడుకు) విప్ కి లోబడి షిండే వర్గానికి మద్దతు ఇస్తాడో లేదా వ్యతిరేకంగా ఓటేసి పార్టీ నుండి సస్పెండ్ అవుతాడో చూడాలి ఉద్ధవ్ ఠాక్రే ఎమ్మెల్సీ కాబట్టి బతికిపోయాడు.. నేను నిన్ననే చెప్పాను మహారాష్ట్రలో శివసేన ఉంటుంది కానీ అందులో ఉద్ధవ్ ఠాక్రే కుటుంబం మాత్రం ఉండదని అదే జరగబోతోంది

మొట్టమొదటగా నీ తండ్రి ఆశయాల్ని తుంగలో తొక్కి NCP& కాంగ్రెస్ పార్టీల ముందు ముఖ్యమంత్రి కుర్చీకై మోకరిళ్లడం...

Image
మొట్టమొదటగా నీ తండ్రి ఆశయాల్ని తుంగలో తొక్కి NCP& కాంగ్రెస్ పార్టీల ముందు ముఖ్యమంత్రి కుర్చీకై మోకరిళ్లడం... - ఫాల్గర్ సాదువుల హత్య పాపం... - సుశాంత్ సింగ్ రాజ్ పుత్ అసహజ మరణం... - కంగనా రౌనత్ వేధింపు... - అర్ణబ్ గోస్వామి అక్రమ అరెస్టు - హనుమాన్ చాలీసా పఠిస్తామన్న నవనీత్ కౌర్ దంపతుల అక్రమ నిర్భంధం... ఈ ఉసురులన్నీ నీకు తగిలి అత్యంత అవమానకర రీతిలో ఒక్క ముఖ్యమంత్రి పీఠంనే కాదు... చివరికి తండ్రి వారసత్వంగా వచ్చిన శివసేన పార్టీ కూడా చేజారింది...

బాలాసాహెబ్ సిద్ధాంతాలను నీరుగార్చాడు 'ఉత్త'వ్..పులి కడుపున పిల్లి పుట్టిందని నిరూపించాడు..

Image
అగడుపట్టి ఆగమైంది అఘాడి సర్కారు..  బాలాసాహెబ్ సిద్ధాంతాలను నీరుగార్చాడు 'ఉత్త'వ్.. పులి కడుపున పిల్లి పుట్టిందని నిరూపించాడు.. అధికారదాహం, పుత్రోత్సాహంతో బీజేపీతో మైత్రిని వీడి సైద్ధాంతిక శత్రువులతో చేతులు కలిపిన ఉత్తరకుమారునిపై సొంత ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేశారు.  కూటమిలో ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీల మంత్రులు, నాయకుల అవినీతిని మోయడం శివసైనికులకు నచ్చలేదు. కేడర్ మనోభావాలను అర్థం చేసుకోకుండా అఘాడిలో అనాడిగా మారి అద్దాల మేడకే పరిమితమైన ఉత్తవ్ ఇప్పుడు ఎంత ఏడ్చి ఏం లాభం? ఏక్ నాథ్ శిండే తిరుగుబాటు రాత్రికి రాత్రి జరగలేదు.. ఆయన తీసిపారేయదగ్గ అల్లాటప్పా నాయకుడేం కాదు.. నివురుగప్పిన అసంతృప్తిని తొక్కిపెడదాం అనుకున్నాడు ఉద్ధవ్.. శివసేనలో తిరుగుబాట్లు కొత్తేమీ కాదు.. రాజ్ ఠాక్రే, చగన్ భుజ్బల్, నారాయణ్ రాణేలాంటి గొప్ప సేనానులను పోగొట్టుకుంది.. వీరి కోవలోనే ఇప్పుడు ఏక్ నాథ్ శిండే..

కాశ్మీర్ ఇవాళ దేశంలో అంతర్భాగంగా ఉంది అంటే అది కేవలం ఒక్క బీజేపీ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ శ్యామ ప్రసాద్ ముఖర్జీ గారి త్యాగం వల్లే...

Image
కాశ్మీర్ ఇవాళ దేశంలో అంతర్భాగంగా ఉంది అంటే అది కేవలం ఒక్క బీజేపీ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ శ్యామ ప్రసాద్ ముఖర్జీ గారి త్యాగం వల్లే... ఖాన్ గ్రేస్ విభజన రాజకీయాల వల్ల దేశం ముక్కలైంది అనేదానికి ఇవాళ ఎన్నో కారణాలు స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం దేశాన్ని ముక్కలు చేసింది... కాశ్మీర్ కూడా మనకు దక్కేది కాదు... జిన్న తో కుదుర్చుకున్న చీకటి ఒప్పందం వల్ల కాశ్మీర్ కూడా తమకు అప్పజెప్పలని కోరాడు ఏక్ దేశ్ మే దో విధన్ ఏక్ దేశ్ మే దొ ప్రధాన్ ఏక్ దేశ్ మే దొ నిషాన్ నహి చెలెంగే అంటు ఇందిరా ఆటవిక రాజ్యం పై పోరాటం చేసి కాశ్మీర్ కోసం ఆయన పోరాటం చేసి జైల్ జీవితం అనుభవించాడు.. చివరికి జైల్ లోనే ప్రాణాలు వదిలారు... ఆయన మరణం ఇప్పటికీ అనుమానమే.. ఇందిరా గాంధీ అప్పట్లో దీనిపై విచారణ కు కూడా అనుమతి ఇవ్వలేదు అంటే ఎంతటి కుట్ర జరిగిందో అర్థం చేసుకోవాలి.... 1953 జూన్ 23 నా ఆయన ప్రాణాలు వదిలారు... బలిదాన్ దివాస్ గా ఇవాళ వారి త్యాగాన్ని స్మరించుకుందాం.... #BalidanDiwas #ShyamaPrasadMukherjee #kashmir

మొదలైన ఉద్దవ్ థాకరే ప్రభుత్వ కౌంట్‌డౌన్..

Image
మొదలైన ఉద్దవ్ థాకరే ప్రభుత్వ కౌంట్‌డౌన్.. అధికారం కోసం రాజీపడడం రాజకీయాల్లో అత్యంత సిగ్గుచేటు. మహారాష్ట్రలో రాజకీయ గందరగోళం మధ్య, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, 2019 డిసెంబర్‌లో అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడిగా, "నేను ఎప్పుడు వస్తానో నాకు తెలియదు," అన్న మాటలు నాకు గుర్తున్నాయి. కానీ నేను ఖచ్చితంగా తిరిగి వస్తాను." ఉద్ధవ్ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ, ఫడ్నవీస్ ఇలా అన్నారు, "నా నీరు తగ్గడం చూసి నా ఒడ్డున స్థిరపడకండి, నేను మహాసముద్రాన్ని నేను ఖచ్చితంగా తిరిగి వస్తాను" అని థాకరే యొక్క సాంస్కృతిక వారసత్వాన్ని ఛిన్నాభిన్నం చేస్తున్న నేటి శివసేన రాజకీయాల గడ్డు రోజులు త్వరలో వస్తాయి.  నేటి రాజకీయ గందరగోళంలో దేవేంద్ర ఫడ్నవీస్ ట్రంప్ కార్డ్ అని నిరూపించుకున్నారు. మహారాష్ట్ర రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ప్రతి క్షణం సమీకరణాలు మారుతున్నట్లు కనిపిస్తున్నాయి. మీడియా కథనాల ప్రకారం, శివసేన నాయకుడు మరియు రాష్ట్ర ప్రభుత్వ బలమైన మంత్రి ఏక్నాథ్ షిండే, 40 మంది ఎమ్మెల్యేలతో అస్సాంలో విడిది చేస్తూ రిసార్ట్ రాజకీయాలు చేస్తూ, శివసేన మరియు మహావికాస్ అఘాడీ ప్రభుత్వానికి మ...

ముఖ్యమంత్రి నివాసం నుంచి కుటుంబంతో సహా బయటకు వెళ్లిపోయిన ఉద్ధవ్ ఠాక్రే

Image
మహారాష్ట్ర ముఖ్యమంత్రి, శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే తన అధికారిక నివాసం నుంచి బుధవారం రాత్రి బయటకు వెళ్లిపోయారు ఆయన వెనుకే ఆయన కుమారుడు, రాష్ట్ర మంత్రి ఆదిత్య ఠాక్రే, ఆయన సోదరుడు తేజస్ ఠాక్రే, వారి తల్లి రష్మీ ఠాక్రేలు కూడా ఆ నివాసం నుంచి వెళ్లిపోయారు. నివాసం వెలుపల భారీగా పోగైన పార్టీ కార్యకర్తలు, అభిమానులు ‘ఉద్ధవ్ మీరు వెళ్లండి.. మీ వెంటే మేమున్నాం’ అంటూ నినాదాలు చేశారు. అసహజ సంకీర్ణం’ నుంచి తప్పుకోవాలి: ఏక్‌నాథ్ షిందే దీనికి ముందు శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యే ఏక్‌నాథ్ షిందే అస్సాం రాజధాని గౌహతిలో బుధవారం రాత్రి మీడియాతో మాట్లాడుతూ.. మహారాష్ట్రలో శివసేన మనుగడ సాగించాలంటే ‘అసహజ సంకీర్ణం’ నుంచి శివసేన బయటపడాల్సి ఉందని పేర్కొన్నారు. రాష్ట్రంలో రెండున్నరేళ్ల సంకీర్ణ ప్రభుత్వ హయాంలో భాగస్వామ్య పార్టీలే లాభపడ్డాయని ఆయన వ్యాఖ్యానించారు. ఇప్పుడు మహారాష్ట్ర ప్రయోజనాల కోసం నిర్ణయం తీసుకోవాల్సిన సమయం వచ్చిందన్నారు. ఏక్‌నాథ్ షిందే కొందరు తిరుగబాటు ఎమ్మెల్యేలను వెంటబెట్టుకుని మంగళవారం నాడు ముంబై నుంచి గుజరాత్‌లోని సూరత్‌కు చేరుకోవటంతో మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం మొదలైంది. ఆయన బుధవారం సాయంత్రం సూరత...

సీఎం కేసీఆర్ ప్ర‌జ‌ల ఆరోగ్యాన్ని గాల్లోకి వదిలేశాడు

Image
సీఎం కేసీఆర్ ప్ర‌జ‌ల ఆరోగ్యాన్ని గాలికొదిలేసి చిల్ల‌ర రాజ‌కీయాలు చేస్తుండు. రాష్ట్రంలో వానాకాలం ప్రారంభమైంది. కానీ, ఎక్కడికక్కడ పారిశుద్ధ్యం లోపించింది. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి ముగిసినా శివారు ప్రాంతాల పరిస్థితి మారలేదు. హాస్పిటల్స్‌లో డాక్టర్లు, సిబ్బంది కొరత వేధిస్తోంది. ఏళ్లకేళ్లుగా వైద్యుల పోస్టులు భర్తీ చేయకపోవడంతో జనం ఇబ్బంది పడుతున్నరు. ఒక్క ఆదిలాబాద్ జిల్లానే చూసుకుంటే.. గత ఏడాది డయేరియా కేసులు 16,089 నమోదు కాగా, ఈ ఏడాది ఇప్పటి వరకు 6,452 కేసులు నమోదయ్యాయి. గతేడాది మలేరియా రెండు, డెంగీ 231 కేసులు నమోదు కాగా... ఈ ఏడాది ఇప్పటి వరకే 38 కేసులు రికార్డ్ ​అయ్యాయి. ఆదిలాబాద్ జిల్లాలో 22 పీహెచ్​సీలు, ఏరియా హాస్పిటల్, ఐదు అర్బన్ హెల్త్ సెంటర్లు, 126 సబ్ సెంటర్లు ఉండగా... పీహెచ్​సీల్లో 13 డాక్టర్​ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అర్బన్​ సెంటర్లలో ఏడు డాక్టర్ ​పోస్టులు ఖాళీగా ఉన్నయి. ఫార్మసిస్ట్ పోస్టులు ఆరు, ల్యాబ్ టెక్నిషియన్ పోస్టులు ఐదు, మిగతావి 94 పోస్టులు ఖాళీగా ఉన్నయి. ఈ ఒక్క‌ జిల్లానే కాదు.... రాష్ట్రం మొత్తం ఇదే ప‌రిస్థితి ఉంది. వైద్యులు లేక.. సిబ్బంది లేక.. ప్ర‌జ‌ల‌కు వైద్యం ఎట్లా...

|| *తెలంగాణ పోలీసుల అదుపులో సుబ్బారావు*||

Image
|| *తెలంగాణ పోలీసుల అదుపులో సుబ్బారావు*||  ◻️పక్కా ప్లాన్ తో విద్యార్థులను రెచ్చగొట్టిన సుబ్బారావు ◻️ఏపీ తెలంగాణ సహా దేశవ్యాప్తంగా 9 బ్రాంచ్ లు నడిపిస్తున్న సుబ్బారావు ◻️ఆర్మీ కోచింగ్ సెంటర్ పేరుతో 2 లక్షలు ఫీజ్ తీసుకుంటున్న సబ్బారావ్ ◻️అభ్యర్ధులు తన అకాడెమీ లో చేరాలా పేమెంట్స్ ను విడతల వారీగా చెల్లించేలా ఆకర్షించిన సుబ్బారావు ◻️తన వద్ద శిక్షణ తీసుకుంటే ఎంపిక గ్యారెంటీ అని హామీ లు ఇచ్చిన సుబ్బారావు ◻️మొదట రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లిస్తే చాలాంటు అభ్యర్థులను ఆకర్షణ  ◻️ఆర్మీ కి సెలెక్ట్ అయ్యిన తర్వాత మిగతా మొత్తం చెల్లించేలా అభ్యర్ధులకు కొటేషన్ ◻️గ్యారెంటీ కింద అభ్యర్థుల కు చెందిన 10 వ తరగతి మెమో లు తన దగ్గరే పెట్టుకున్న సుబ్బరావ్ ◻️ఇప్పటికే ప్రాథమిక పరీక్ష పూర్తి చేసుకున్న అభ్యర్థులు ◻️ఇక రిటెన్ ఎగ్జామ్ క్లియర్ చేస్తే అభ్యర్థుల నుండి పెద్ద మొత్తం లో సుబ్బారావు కు ఫీజులు ◻️రాత పరీక్ష లేదని ప్రభుత్వం అగ్నిపధ్ ప్రకటించడంతో 50 కోట్లు నష్టపోయిన సుబ్బారావు ◻️ఎలా అయిన అభ్యర్థులను రెచ్చగొట్టి రాత పరీక్ష నిర్వహించేలా ప్రభుత్వం పై ఒత్తిడి పెంచాలని ప్లాన్  ◻️పల్నాడు జిల్లా రావిపాడు పం...

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నిరసన లో పాల్గొన్న అభ్యర్థి ఆత్మహత్యాయత్నం.

Image
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నిరసన లో పాల్గొన్న అభ్యర్థి ఆత్మహత్యాయత్నం. జనగాం జిల్లా స్టేషన్ ఘనపూర్ కు చెందిన గోవింద్ అజయ్ అనే యువకుడు ఆత్మహత్య యత్నం.  తన మీద పోలీసులు కేస్ నమోదు చేస్తారేమో అని భయంతో ఆత్మ హత్య యత్నం చేసిన అజయ్. ప్రస్తుతం వరంగల్ నగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అజయ్ అజయ్ ఆరోగ్యం నిలకడగానే ఉంది...

దిల్లీకి భాజపా సీనియర్​ నేతలు.. సంజయ్​కు భద్రత పెంపు

Image
భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​ మంగళవారం రాత్రి దిల్లీకి బయలుదేరి వెళ్లారు. వచ్చే నెల 2,3 తేదీల్లో హైదరాబాద్​లో పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దానిపై చర్చించేందుకు బుధవారం అందుబాటులో ఉండాలంటూ భాజపా అధిష్ఠానం ఇచ్చిన సమాచారం మేరకు ఆయన దిల్లీ వెళ్లినట్లు తెలిసింది. కార్యవర్గ సమావేశాల స్టీరింగ్​ కమిటీలో ఉన్న రాష్ట్రానికి చెందిన సీనియర్​ నేతలు కూడా ఆయన వెంట వెళ్లారు. వారంతా పార్టీ సంస్థాగత వ్యవహారాల జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్​ సంతోష్​ సహా ముఖ్య నేతలను కలిసే అవకాశం ఉంది. సంజయ్​కు అదనపు భద్రత.. బండి సంజయ్​కు పోలీసులు భద్రత పెంచారు. ప్రస్తుతమున్న దానికి అదనంగా(1+5) ఆరుగురితో కూడిన రోప్​ పార్టీని కేటాయించారు. మరో ఎస్కార్టు వాహనం ఏర్పాటు చేశారు. పర్యటనల సమయంలో ఆయనకు ఈ మేరకు అదనపు సిబ్బంది భద్రత కల్పిస్తారు. అగ్నిపథ్​ పథకంపై ఆందోళనలతో పాటు ఇటీవల కరీంనగర్​లో సంజయ్​ వ్యాఖ్యల నేపథ్యంలో ఆయనకు భద్రత పెంచాలని నిఘా వర్గాలు సూచించిన మీదట అదనపు భద్రత కల్పించినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి

కాంగ్రెస్ కూటమితోనే కేసీఆర్.. కొత్త పార్టీ లేనట్టేనా? తెలంగాణలో ఏం జరగబోతోంది?

Image
👆President Election: కాంగ్రెస్ కూటమితోనే కేసీఆర్.. కొత్త పార్టీ లేనట్టేనా? తెలంగాణలో ఏం జరగబోతోంది? President Election: విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి ఎంపిక విషయంలో ఆసక్తికర ఘటన జరిగింది. అదే ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో చర్చకు దారి తీసింది. తెలంగాణలో కీలక పరిణామాలు ఉండబోతున్నాయా అన్న చర్చ సాగుతోంది. విపక్షాల ఉమ్మడి రాష్ట్రపతి అభ్యర్థికి తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మద్దతు ఇచ్చారు.  •   • విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా యశ్వంత్ సిన్హా  • కాంగ్రెస్ కూటమికి కేసీఆర్ మద్దతు  • తెలంగాణలోనూ కాంగ్రెస్, టీఆర్ఎస్ కలిసిపోతాయా? President Election: రాష్ట్రపతి ఎన్నికలతో దేశ రాజకీయాల్లో కీలక మార్పులు జరుగుతున్నాయి. అధికార ఎన్డీఏకు వ్యతిరేకంగా బలమైన అభ్యర్థిని బరిలోకి దింపాలని ప్రయత్నించిన విపక్షాలు ఎట్టకేలకు ఏకాభిప్రాయానికి వచ్చాయి. 18 విపక్షాల ఉమ్మడి రాష్ట్రపతి అభ్యర్థిగా బీజేపీ మాజీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్ సిన్హా పేరును ప్రకటించాయి. ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌ సారథ్యంలో జరిగిన విపక్షాల సమావేశంలో యశ్వంత్ పేరును ఖరారు చేసి అధికారికంగా ప్రకటించారు. విప...

తిరుమల కొండపై "ప్లాస్టిక్ బ్యాన్"తో... త్రాగునీటి కోసం భక్తుల ఇక్కట్లు!

Image
తిరుమల కొండపై "ప్లాస్టిక్ బ్యాన్"తో... త్రాగునీటి కోసం భక్తుల ఇక్కట్లు! తిరుమల కొండపై పర్యావరణ పరిరక్షణలో భాగంగా టీటీడీ ప్లాస్టిక్ నిషేధించడాన్ని స్వాగతిస్తున్నాం కానీ భక్తులకు పూర్తి అవగాహన వచ్చేవరకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై కూడా టీటీడీ దృష్టి సారించాలి! తిరుపతి అలిపిరి టోల్ గేట్ వద్ద బస్సులలో కార్లలో తిరుమలకు వెళుతున్న భక్తుల వద్ద ఉన్న ప్లాస్టిక్ బాటిల్స్ ను తనిఖీలు చేసి విజిలెన్స్ అధికారులు స్వాధీనం చేసుకుంటున్నారు! తిరుమల ఘాట్ రోడ్డు ప్రయాణం సుమారు 20 కిలోమీటర్ల మేర ప్రతి ఐదు కిలోమీటర్లకి ఒకచోట ప్రత్యామ్నాయంగా "జల ప్రసాదం"త్రాగునీటి కౌంటర్లను ఏర్పాటు చేయాలి! తిరుమలకు వెళ్లే ప్రతి బస్సు లో అత్యవసర పరిస్థితులలో భక్తులకు అందుబాటులో ఉండే విధంగా కనీసం 10 లీటర్ల వాటర్ క్యాన్ తో పాటు పేపర్ గ్లాసులు అందుబాటులో ఉంచేలా చర్యలు చేపట్టాలి తిరుమల కొండకు సుదూర ప్రాంతాల నుంచి బస్సులలో కార్లలో వచ్చే భక్తులలో అనేక మంది వయస్సులో పెద్దవారు,పసిపిల్లలు కొంతమంది ఆరోగ్యరీత్యా హార్ట్ పేషెంట్లు,బీపీ, షుగర్ ఉన్నవారు ఘాట్ రోడ్ లో ప్రయాణించేటప్పుడు అత్యవసరంగా( మెడిసిన్) టాబ్లెట్లు వేసుకోవాల్...

అధికారికంగా "అగ్నివీర్" స్కీం లో సెలెక్టన్ పద్దతి మొదలగు వివరాలు ఇండియన్ ఆర్మీ విడుదల చేసింది.

Image
నిన్న అధికారికంగా "అగ్నివీర్" స్కీం లో సెలెక్టన్ పద్దతి మొదలగు వివరాలు ఇండియన్ ఆర్మీ విడుదల చేసింది. దాని వివరాలు క్లుప్తంగా : అగ్నిపథ్ పథకం కింద రిక్రూట్‌మెంట్ ర్యాలీకి ఇండియన్ ఆర్మీ నోటిఫికేషన్ నిన్న జూన్ 20, 2022న  అంటే సోమవారం  విడుదల చేసింది. మొదటి రీక్రూట్మెంట్ రాలీలు సెప్టెంబర్/అక్టోబర్ నెలలో నిర్వహిస్తారు. ఈ నోటిఫికేషన్‌లో, రిజిస్ట్రేషన్ ప్రక్రియ వచ్చే నెలలో ప్రారంభమవుతుందని పేర్కొంది. దరఖాస్తు చేయడానికి, ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ తప్పనిసరి అని, అభ్యర్థులందరూ joinindianarmy.nic.in అనే ఇండియన్ ఆర్మీ వెబ్‌సైట్‌లో చేరడానికి లాగిన్ అవ్వాలని కూడా పేర్కొనబడింది. * ఈ అగ్నివీర్‌లో అనేక కేటగిరీలు ఉన్నాయి మరియు అభ్యర్థులు తప్పనిసరిగా ఒక కేటగిరీలో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. ఎవరైనా బహుళ కేటగిరీ కోసం నమోదు చేసుకున్నట్లు గుర్తించబడితే, అతను అనర్హుడవుతాడు.  * వ్యక్తిగత ఇ-మెయిల్ ID మరియు మొబైల్ నంబర్ తప్పనిసరి. అన్ని ముఖ్యమైన సందేశాలు ఈ ఇ-మెయిల్ ID/మొబైల్ నంబర్‌కు పంపబడతాయి. * 'జనరల్ డ్యూటీ' అగ్నివీర్ దరఖాస్తుదారు  తప్పనిసరిగా 10వ తరగతిలో మొత్తం 45% మరియు ప్రతి సబ్జెక్ట్‌లో 3...

శివసేన తిరుగుబాటు MLA ల సంఖ్య 39 కు పెరిగిపోగా...

Image
శివసేన తిరుగుబాటు MLA ల సంఖ్య 39 కు పెరిగిపోగా... ఇక ఉద్దవ్ థాక్రే నీడలోని MLA ల సంఖ్య 18 నుండి కాస్తా ఇప్పుడు 16 కు పడిపోయింది... ఇక మరోవైపు కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన లెజిస్లెచర్ పార్టీ సమావేశానికి 4 గురు MLA డుమ్మా కొట్టడమే కాకుండా, వారి ఆచూకీ కూడా లేదు...  అలాగే వాళ్ళ ఫోన్లు కూడా స్విచ్ ఆఫ్ లో వుండడం విశేషం...

288 అసెంబ్లీ స్థానలున్న మహారాష్ట్రాలో మాజిక్ ఫిగర్ 145...

Image
288 అసెంబ్లీ స్థానలున్న మహారాష్ట్రాలో మాజిక్ ఫిగర్ 145... అయితే ప్రస్తుతం ఇద్దరు మహావికాస్ అఘాడీ MLA లైన అనిల్ దేశ్ ముఖ్ & నవాబ్ మాలిక్ లు గత 4/5 నెలలుగా అవినీతి కేసుల్లో ఇరుక్కొని జైల్లో వున్నారు. ఇక ఆఁ ఇద్దర్ని మొన్న జరిగిన రాజ్యసభ & MLC ఎన్నికల్లో ఓటసేందుకు కూడా కోర్టులు వారికి 'బేయిళ్ళు' ఇవ్వకపోవడంతో పాటు... ఇక మరోవైపు శివసేన MLA ఒకరు చనిపోవడంతో ప్రస్తుతం 'మాజిక్ ఫిగర్' 142 అయింది... ఇక అసెంబ్లీలో శివసేన సభ్యుల సంఖ్య 55 కాగా, అందులో 26 మంది ప్రస్తుతం ఉద్దావ్ థాక్రేకు ఎదురు తిరిగారు. విచిత్రం... గమనార్హమేంటంటే, 55 లో 26 పోగా ఆఁ 29 లో కూడా ఇందాక ఉద్దావ్ థాక్రే జరిపిన తన పార్టీ శాసన సభ్యుల మీటింగులో కేవలం 18 మంది మాత్రమే పాల్గొనడం విశేషం. అంటే ఉద్దావ్ థాక్రే వ్యతిరేకులు 26 + 9 కావచ్చు...!! ఇక BJP శాసన సభ్యుల సంఖ్య - 106 అదే మొత్తం NDA సభ్యుల సంఖ్య - 139 ఇక మరోవైపు : NCP - 51 కాంగ్రెస్ - 44 ఏ కాంగ్రెస్ పార్టీ విధానాలకు వ్యతిరేకంగానైతే ఆనాడు బాల్ సాహెబ్ థాక్రే జీ "శివసేన" అనే పార్టీని స్థాపించారో, ఆఁ తరువాత కాంగ్రెస్ పార్టీ నుండి విడివడి శరద్ పవర్ ...

దొంగలు ఎప్పుడూ.పోలీసులు, తలుపులు & తాళాలు ఉండద్దనే కోరుకుంటారు

Image
.                           దొంగలు ఎప్పుడూ .పోలీసులు, తలుపులు & తాళాలు ఉండద్దనే కోరుకుంటారు °°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°° .      భారత యువత మంచి క్రమశిక్షణ, సంస్కారం కల్గి బలవంతులుగా తయారయితే కమ్మీగాళ్ళకు, కాంగ్రెస్ పార్టీలకు, పిల్ల కాంగ్రెస్ పార్టీలకు, పాకిస్తాన్ ప్రేమికులకు, చైనాకి లాంటి మన శత్రు దేశాలకు చాలా పెద్ద కష్టం. ఎందుకంటే దేశ యువతలో దేశం పట్ల బాధ్యత తెలిస్తే, దేశ భక్తి పెరుగుతుంది....యువత తీవ్రవాదానికి ఆకర్షింప బడరు... .         ఒక 30ఏళ్ల క్రితం వరకు పిల్లలు ఎక్కువగా ఆటలు ఆడే వాళ్లు, చాలా దూరాలు నడిచి వెళ్లే వాళ్లు, సైకిల్ తొక్కే వాళ్లు, తొక్కుడు రిక్షాలు కూడా ఎక్కువగా ఉండేవి. ఇప్పుడు ఆటలు లేవు, నడిచే వాళ్లు ఆటోలో వెళుతున్నారు, సైకిల్ తొక్కే వాళ్లు బైక్ లో వెళుతున్నారు, రిక్షాలు పూర్తిగా అంతిరించి పోయాయి... వీటన్నిటికీ మించి లక్ష్యం లేని చదువులతో, ఉపయోగం లేని మార్కుల కోసం, అర్థం లేని కంపిటేషన్ తో విపరీతమైన మానసిక ఒత్తిడికి యువత గురవుతున్నది....

బీజేపీ రాష్ట్రపతి అభ్యర్థి మహిళ అభ్యర్థి ఆదివాసీ ట్రైబల్మహిళ ద్రౌపది మురుం

Image
బీజేపీ రాష్ట్రపతి అభ్యర్థి మహిళ అభ్యర్థి ఆదివాసీ ట్రైబల్ మహిళ ద్రౌపది మురుం ఒరిస్సాకు చెందిన ద్రౌపది మురుం వయసు 64 years  గతంలో ఝార్ఖండ్ గవర్నర్ గా పని చేశారు 2015 నుంచి 2021 వరకు జార్ఖండ్ గవర్నర్గా పనిచేశారు ద్రౌపది ముర్ము 20 జూన్ 1958న ఒడిశాలోని మయూర్‌భంజ్ జిల్లా బైదాపోసి గ్రామంలో జన్మించింది.  ఆమె తండ్రి పేరు బిరంచి నారాయణ్ తుడు ఒడిశాలోని భారతీయ జనతా పార్టీ మరియు బిజూ జనతాదళ్ సంకీర్ణ ప్రభుత్వం సమయంలో  మార్చి 6, 2000 నుండి ఆగస్టు 6, 2002 వరకు వాణిజ్యం మరియు రవాణాకు స్వతంత్ర రాష్ట్ర మంత్రిగా పనిచేశారు ఆగస్టు 6, 2002 నుండి 2004 మే వరకు మత్స్య మరియు జంతు వనరుల అభివృద్ధి  శాఖ మంత్రిగా పని చేశారు  2004 సంవత్సరాలలో  రాయరంగపూర్ అసెంబ్లీ నియోజకవర్గం ఎమ్మెల్యే.. మొట్టమొదటిసారిగా ఆదివాసి ట్రైబల్ మహిళా రాష్ట్రపతి అభ్యర్థిగా పోటీ

నా వ్యక్తిగత అభిప్రాయం

Image
నా వ్యక్తిగత అభిప్రాయం: ఏ ప్రభుత్వ ఉద్యోగం చేయాలన్నా ముందు కనీసం కొన్నేళ్ళు సైన్యంలో పనిచేయాలన్న నిబంధన పెట్టాలి. అప్పుడే మిగతా ప్రభుత్వ విభాగాలు, ప్రభుత్వ రంగ సంస్థలు కొంచెమైనా బాగుపడతాయి. నోట్: అందరికీ ఫిట్‌నెస్ ఉండకపోవచ్చు. అలాంటివారికి తగ్గ డెస్క్ జాబ్ చేయించాలి.

అక్రమంగా మన దేశం లోకి వచ్చిన రోహిగ్యాలకు బాంగ్లాదేశ్ వాళ్ళకి సపోర్ట్ చేసే లుచ్చగాళ్ళు గమనించాల్సిన విషయం

Image
అక్రమంగా మన దేశం లోకి వచ్చిన రోహిగ్యాలకు బాంగ్లాదేశ్ వాళ్ళకి సపోర్ట్ చేసే లుచ్చగాళ్ళు గమనించాల్సిన విషయం 🙊మీరు "దక్షిణ కొరియా" సరిహద్దు అక్రమంగా దాటితే,12 సంవత్సరాలు జైలులో పెడతారు .... !!  "ఇరాన్" సరిహద్దు అక్రమంగా దాటితే నిరవధికంగా అదుపులోకి తీసుకుంటారు .... !! "ఆఫ్ఘనిస్తాన్" అయితే చట్టవిరుద్ధంగా సరిహద్దును దాటండి  మిమ్మల్ని చూడగానే షూట్ చేయండని ఆర్డర్ ఇవ్వబడుతుంది....!!     మీరు "చైనీస్" సరిహద్దును అక్రమంగా దాటితే  మిమ్మల్ని కిడ్నాప్ చేస్తారు మరియు మీరు మళ్ళి కనపడరు .... !!       మీరు "క్యూబా" సరిహద్దు అక్రమంగా  దాటితే ...  కుట్ర చేసినందుకు జైలు పాలైతారు...!!      మీరు "బ్రిటిష్" బోర్డర్ అక్రమంగా దాటితే, మీరు అరెస్టు చేయబడతారు విచారణ జరుగుతుంది, జైలు శిక్ష పడుతుంది ...   మీరు పొరుగు దేశానికి చెందినవారై  చట్టవిరుద్ధంగా భారత దేశ సరిహద్దు దాటి వస్తేనో. అప్పుడు మీరు పొందుతారు 1 ఒక రేషన్ కార్డు 2 పాస్పోర్ట్, 3 డ్రైవింగ్ లైసెన్స్, 4 ఓటరు గుర్తింపు కార్డు, 5 క్రెడిట్ కార్డులు, 6 ప్రభుత్వ రాయితీ అద్దె వసతి, 7 ఇల్లు క...

కేంద్ర మంత్రి Kishan Reddy Gangapuram అన్న వ్యాఖ్యలను గులాబీ మీడియా వక్రీకరించి చూపిస్తుంది.

Image
కేంద్ర మంత్రి Kishan Reddy Gangapuram అన్న వ్యాఖ్యలను గులాబీ మీడియా వక్రీకరించి చూపిస్తుంది. అసలు ఇండియన్ ఆర్మీ అంటే ఏంటో తెలియని సన్నాసులు ఆర్మీ గురించి మాట్లాడుతున్నారు. ఇండియన్ ఆర్మీలో 27 Infantry Regiments ఉంటాయి. ఆర్మీలో ప్రతిఒక్కరు తుపాకులు పట్టుకుని ప్రతిరోజు సరిహద్దుల్లో తిరగరు. జవాన్లను వివిధ పనుల నిమిత్తం విభజిస్తారు. ఆఖరికి వాళ్ళ రీజిమెంట్ లో గడ్డి మొలచినా అందులోనే ఎవరికో ఒకరికి ఆ పనిని అప్పగిస్తారు. అంత మాత్రాన జవాన్లు గడ్డి పీకుతున్నారని, బట్టలు ఉతుకుతున్నారని, ఇస్త్రీ చేస్తున్నారని అనుకోవద్దు. సమయం వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు తుపాకీ పట్టి యుద్ధ మైదానంలోకి దిగుతారు. ఆర్మీ గురించి ఆర్మీ వాళ్ళను అడగండి, మీ కుటుంబసభ్యుల ఎవరైన ఆర్మీలో ఉంటే అడిగి తెలుసుకోండి....

700 కోట్ల ఆస్తి నష్టం...60 రైళ్లకు నిప్పంటించారు...బిహార్‌లో 11 ఇంజిన్‌లను తగలబెట్టారు...

Image
700 కోట్ల ఆస్తి నష్టం... 60 రైళ్లకు నిప్పంటించారు... బిహార్‌లో 11 ఇంజిన్‌లను తగలబెట్టారు... దేశవ్యాప్తంగా గడిచిన మూడు రోజుల్లో మొత్తం 138 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేయగా, 718 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 60 కోట్ల మంది ప్రయాణికులు తమ టిక్కెట్లను రద్దు చేసుకున్నారు... సీసీటీవీ, వీడియో ఫుటేజీల ద్వారా హింసకు పాల్పడుతున్న మరికొంత మందిని పోలీసులు పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.  రైల్వే అధికారుల ప్రకారం.. ఒక జనరల్‌ బోగిని నిర్మాణానికి రూ. 80 లక్షలు ఖర్చు అవుతుంది. అదే స్లీపర్‌ కోచ్‌కు 1.25 కోట్లు, ఏసీ కోచ్‌ రూ. 3.5 కోట్లు ఖర్చు అవుతుంది. ఇక ఒక రైలు ఇంజిన్‌ను తయారు చేసేందుకు ప్రభుత్వం అక్షరాల రూ. 20 కోట్లకు పైగా వెచ్చిస్తోంది. మొత్తంగా చూసుకుంటే 12 బోగీల రైలును ఏర్పాటుకు చేసేందుకు రూ. 40 కోట్లు, 24 కోచ్‌ల ట్రైన్‌ నిర్మించేందుకు రూ. 70 కోట్లకుపైనే ఖర్చు చేస్తోంది. మొత్తం మీద అభ్యర్దులు ఎంత మంది అంటే 750 మంది ఫిట్నెస్ పాస్ ఐతే అక్కడకి వచ్చింది ఒక 100+ మంది కావొచ్చు... కానీ 4000+మంది సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో జమైనరు అంటే ఎక్కడ ఏం లోపం జరిగింది. ఎవరో కావాలని తెరవెనుక ఉండి చేపించారు.....

అగ్నిపథ్‌కు ఎంపిక కావాలనుకునే వారు ఎలాంటి హింసాత్మక కార్యక్రమాల్లో పాల్గొనమని లిఖితపూర్వక హామీ ఇవ్వాలి.'

'👆అగ్నిపథ్‌కు ఎంపిక కావాలనుకునే వారు ఎలాంటి హింసాత్మక కార్యక్రమాల్లో పాల్గొనమని లిఖితపూర్వక హామీ ఇవ్వాలి.' అగ్నిపథ్ మీద స్పష్టత ఇచ్చేందుకు ఆదివారం మీడియా సమావేశంలో పాల్గొన్న త్రివిధ దళాల అధిపతులు ఇంకా ఏమన్నారంటే... #AgnipathScheme #IndianArmy అగ్నిపథ్ పథకాన్ని వెనక్కి తీసుకునేది లేదన్న త్రివిధ దళాల అధిపతులు, ఇంకా ఏమన్నారంటే... సైన్యంలో నియామకాలకు సంబంధించిన అగ్నిపథ్ పథకంపై దేశవ్యాప్తంగా చెలరేగిన ఆందోళనలను తగ్గించడానికి భారత త్రివిధ దళాల అధిపతులు ప్రయత్నించారు. సైన్యంలోని మూడు విభాగాలకు చెందిన అధిపతులు ఆదివారం దిల్లీలో విలేఖరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అగ్నిపథ్ పథకానికి సంబంధించిన అనేక విషయాలపై స్పష్టత ఇచ్చేందుకు ప్రయత్నించారు. ఇందులో రక్షణ శాఖ మిలిటరీ వ్యవహారాల అదనపు కార్యదర్శి, లెఫ్టినెంట్ జనరల్ అనిల్ పురీ, వాయుసేన నుంచి ఎయిర్ మార్షల్ ఎస్కే ఝా, నేవీ నుంచి వైస్ అడ్మిరల్ డీకే త్రిపాఠిలతో పాటు ఆర్మీ అడ్జటెంట్ జనరల్ బన్సీ పొన్నప్ప పాల్గొన్నారు. దీనికంటే ముందు అగ్నిపథ్ పథకానికి సంబంధించి ఆదివారం కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన జరిగిన సమావేశానికీ త్రివ...

KTR గారికి సూటి ప్రశ్న

Image
ఒక పక్క రైల్వే స్టేషన్ లొ బోగీలు తగలబడుతుంటే ఇంట్లో కూర్చుని కేంద్రాన్ని తిడుతూ ట్వీట్లు చేశారు కదా --- మరి మంటలార్పటానికి ఒక్క #ఫైరింజన్ ను అయినా ఎందుకు పంపలేదు. ఫైరింజన్ సర్వీస్ మొత్తం రాస్ట్ర ప్రభుత్వం చేతిలోనే కదా ఉండేది. మరి ఎందుకు స్పందించలేదు ???

అగ్నిపథ్‌లో చేరనున్న నటుడి కుమార్తె.. గర్వంగా ఉందంటూ సోషల్ మీడియాలో పోస్ట్..

Image
అగ్నిపథ్‌లో చేరనున్న నటుడి కుమార్తె.. గర్వంగా ఉందంటూ సోషల్ మీడియాలో పోస్ట్.. #అగ్నిపథ్ అనే పథకంతో దేశానికి కొన్నాళ్లు సేవ చేయవచ్చు అని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ చెప్పిన మాటలను స్ఫూర్తిగా తీసుకున్న ఓ సీనియర్ (భోజ్‌పూరీ) నటుడు రవి కిషన్ కుమార్తె ఇషితా శుక్లా ఉంది. నటుడు రవి కిషన్ 'రేసుగుర్రం' సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమయ్యాడు ఈ నటుడు. ఆ తర్వాత కూడా విలన్‌గా పలు చిత్రాల్లో నటించారు. నటుడు రవి కిషన్ మాట్లాడుతూ నా కూతురు ఇషితా శుక్లా.. ఈరోజు ఉదయం నేను కూడా అగ్నిపథ్ రిక్రూట్‌మెంట్ స్కీమ్‌లో భాగమవ్వాలని అనుకుంటున్నాను నాన్న అని నాతో చెప్పింది. నేను సంతోషంగా సరే అన్నాను'

సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ లోని డీజిల్ రిజర్వాయర్ పేల్చడానికి ప్రయత్నించారు కాబట్టే కాల్పులు జరిపారు పోలీసులు.

Image
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ లోని డీజిల్ రిజర్వాయర్ పేల్చడానికి ప్రయత్నించారు కాబట్టే కాల్పులు జరిపారు పోలీసులు. ఒక వేళ పేలి ఉంటే ఆ చుట్టుపక్కల ఎంత నష్టం జరిగి ఉండేదో ఊహాకు కూడా అందదు......  రోజు 229 సర్వీసులు పైగా నడుపుతూ ఉన్న స్టేషన్ లో ఎంత డీజిల్ రిజర్వ్ ఉండొచ్చు ?  తెలంగాణ మొత్తం మీద 750 మంది ఆర్మీ అభ్యర్థులు ఉన్నారు. స్టేషన్ ద్వంసం చేసింది దాదాపు 3000 అని అంచనా.... అంత అవసరం ఏమి వచ్చింది ???  ఈ దేశంలో ఆ 750 మందికి వేరే ఉద్యోగాలు లేవా ?  దేశ సేవ చేసే ఉద్దేశ్యం ఉంటే ఇంకొక మార్గం వెతుక్కోరా ?  పోలీసు FIR ఐతే ఉద్యోగం రాదు అని వాళ్లకు తెలియదా ?  రైల్వే పోలీసు FIR లు అంత సులువుగా వదలవు అని తెలియదా ?  తెలంగాణ రాక ముందు నుండి మంత్రిగా ఉన్న హరీష్ రావు కె 10 ఏళ్ళు సమయం పట్టింది కేసులు వదిలించుకోవడానికి . మరి ఏ తాడు బొంగరం లేని వాళ్ళ పరిస్థితి ఏమిటి ?  ప్రయాణీకుల ఆస్తులు ధ్వంసం చెయ్యడానికి వాళ్లకు ఏమి హక్కు ఉంది...?  రైతుల ఆస్తులు తగల పెట్టడానికి వాళ్లకు ఏమి హక్కు ఉంది ?  దుకాణాలు లూటీ చేశారు ? ఆర్మీ అభ్యర్థులు లూటీలు చేస్తే ఉద్యోగాలు ఇస్తారా ?...

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ విధ్వంసం.. సంచలన విషయాలు వెలుగులోకి..

*💥సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ విధ్వంసం..* *👉సంచలన విషయాలు వెలుగులోకి..* హైదరాబాద్ : సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ విధ్వంసంపై పోలీసులు కొనసాగిస్తోన్న విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. విచారణలో భాగంగా 'ఛలో సికింద్రాబాద్' వాట్సాప్ గ్రూపును గుర్తించారు. దీంతో పక్క ప్లాన్ ప్రకారం ముందస్తు కుట్రతోనే విధ్వంసం జరిపినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఆందోళనలో ఆర్మీ అభ్యర్థులతో పాటు కొందరు గుర్తు తెలియని ప్రైవేట్ వ్యక్తులు కూడా పాల్గొన్నట్లు పోలీసులు నిర్ధారించారు. అల్లర్లు సృష్టించడానికి రెండ్రోజుల ముందే వాట్సాప్ గ్రూపు క్రియేట్ చేసి, హకీంపేట ఆర్మీ ర్యాలీకి వచ్చిన వారే విధ్వంసానికి పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. ఆదిలాబాద్ నుంచి కృష్ణా ఎక్స్‌ప్రెస్‌లో 300 మంది ఆర్మీ అభ్యర్థులు నగరానికి వచ్చినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా ఆందోళన కారులను గుర్తిస్తున్న పోలీసులు, ఆందోళన కారులపై సెక్షన్ 14 కింద కేసు నమోదు చేశారు. ఐఆర్ఏ రైల్వే చట్టం సెక్షన్ 150 కింద కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. నేరం రుజువైతే యావజ్జీవం లేదా మరణశిక్ష పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అంతేగాక...

ఇంతకీ రాకేష్ ఏం ఘనకార్యం చేసిండు ???

Image
ఇంతకీ రాకేష్ ఏం ఘనకార్యం చేసిండు ??? 25లక్షలు, కుటుంబానికి ప్రభుత్వ ఉద్యోగం, రాష్ట్ర మంత్రులు, MLAలు, అధికార పార్టీ నాయకులు, పెద్ద యతున్న అంతిమయాత్ర నిర్వహించడం... ప్రజల ఆస్తి 30కోట్లు పైగా ధ్వంసం చేసినందుకా ??? రాజ్యాంగంలో ఎక్కడ ఉంది ఈవిధంగా ప్రజల ఆస్తి ధ్వంసం చేసి నిరసన చేయొచ్చు అని ??? రాజ్యాంగంలో ఎక్కడ ఉంది ప్రజల ఆస్తిని ధ్వంసం చేసిన వాళ్ళకి డబ్బులు, ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని ??? #JustAsking

సికింద్రాబాద్‌ అల్లర్లు.. సూత్రధారి అతడేనా?

Image
*సికింద్రాబాద్ విధ్వంసం లో ఇతనే ప్రధాన సూత్రధారుడు అంట* *సాయి డిఫెన్స్ అకాడమీ డైరెక్టర్* ▫️ *హకీంపేట్ ఆర్మీ సోల్జర్స్* వాట్సాప్ గ్రూప్ సృష్టించబడింది  ▫️ అతను SAI DEFENSE ACADEMY (ఆర్మీ కోచింగ్ సెంటర్) యజమాని  ▫️ అతను విద్యార్థులందరినీ/ ఆర్మీ కోచింగ్ ఇనిస్టిట్యూట్ విద్యార్థులను రెచ్చగొట్టాడు  ▫️ అతను హింసకు సంబంధించిన అన్ని కార్యాచరణ ప్రణాళికను వివరించాడు..  ▫️ హింస కోసం ప్రతిదీ అందించబడింది  ▫️ ఆవుల సుబ్బారావు స్వస్థలం నరసరావు పిఇటి, ఆంధ్రప్రదేశ్.  ▫️ఆయనకు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ 9 ఆర్మీ కోచింగ్ సంస్థలు ఉన్నాయి

అగ్నిపథ్‌’పై కేంద్రం కీలక నిర్ణయం

Image
అగ్నిపథ్‌ పథకంపై కేంద్ర హోంమంత్రిత్వశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ పథకంలో భాగంగా సైన్యంలో పనిచేసి రిటైర్‌ అయిన అగ్నివీరులకు కేంద్ర సాయుధ పోలీసు బలగాలు, అస్సాం రైఫిల్స్‌ నియామకాల్లో 10 శాతం రిజర్వేషన్‌ కల్పించనున్నట్లు ప్రకటించింది. అలాగే ఈ రెండు బలగాల్లో చేరడానికి కావాల్సిన గరిష్ఠ వయోపరిమితిలోనూ అగ్నివీరులకు మూడేళ్ల సడలింపు ఇవ్వనున్నట్లు చెప్పింది. ఇప్పటికే ఈ ఏడాది అగ్నిపథ్‌ కింద జరగబోయే నియామకాలకు గరిష్ఠ వయోపరిమితిని రెండేళ్లు పొడిగించిన విషయం తెలిసిందే. దీంతో మొత్తం ఐదేళ్లు సడలింపు ఇవ్వగా.. గరిష్ఠ అర్హత వయసు 26 ఏళ్లకు చేరింది.

మీరు తగలబెట్టిన పార్శిల్ లో ఎవరికి సంబంధించిన ఎలాంటి విలువైన వస్తువులు/సమాచారం/కష్టార్జితం ఉందో.....

Image
మీరు తగలబెట్టిన పార్శిల్ లో ఎవరికి సంబంధించిన ఎలాంటి విలువైన వస్తువులు/సమాచారం/కష్టార్జితం ఉందో..... 295 రైళ్లు , 50 గంటలదాకా పునరుద్ధరణ జరగదు. ఎంతో మంది పేదవారు, దినసరి కార్మికులు నిత్యం వాడే MMTS తిరిగే పరిస్థితి లేదు. ఇంత మందిని ఇబ్బంది పెట్టడమేనా నిరసన చెయ్యడం అంటే!!! మీకు ఆర్మీ లో ఉద్యోగాలు కావాలా? మీకు దేశభక్తి లేదు,సాటి వారికి ఇబ్బంది కలిగించ కూడదు అనే ఆలోచన లేదు,దేశ సంపద కాపాడే బాధ్యత లేదు.  మీకు ఆర్మీ లో ఉద్యోగం ఇవ్వకూడదు అని మేము ఆందోళన చేస్తాం.  ఇంత విధ్వంసం చేసిన మిమ్మల్ని అందరినీ ఖచ్చితంగా అరెస్ట్ చెయ్యాలి. మీ మీద అయ్యో పిల్లలు ఉద్యోగాలు అనే సానుభూతి లేకుండా చేసుకున్నారు.