Posts

Showing posts from May, 2025

జ్యోతి మల్హోత్ర: దేశద్రోహం యొక్క చీకటి కథ - భారత్‌కు వెన్నుపోటు!

Image
దేశం కోసం ధర్మం కోసం హిందూ బందు మిత్రుల చైతన్యం కోసం అందరికీ పంపండి *జ్యోతి మల్హోత్ర: ఒక దేశ ద్రోహపు కథ‼️* దేశ సరిహద్దులు కాగితాల మీద గీసిన గీతలు మాత్రమే కాదు, అవి కోట్లాది మంది గుండె చప్పుడు! కానీ, ఆ గుండె చప్పుడులోనే కొన్నిసార్లు ద్రోహం అనే విషబీజం నాటుకుంటుంది. సరిగ్గా అలాంటి విషాదకరమైన కథే ఇది. భారతమాత ముద్దుబిడ్డల్లా కనిపించే కొందరు, తమ స్వార్థంతో దేశానికి వెన్నుపోటు పొడిచేందుకు సిద్ధపడతారని ఎవరూ ఊహించలేరు. వాళ్ళని చూస్తే ‘అటు పాకిస్తాన్ కాదు, ఇటు ఇండియా కాదు’ అన్నట్టుగా ఉంటారు. ఇండియాలో పుట్టి పెరిగి, ఇక్కడి గాలి పీల్చుకుంటూ, కడుపు నింపుకుంటూ, రహస్యంగా శత్రుదేశానికి సేవ చేస్తారు. ఇలాంటి వాళ్ళలో ఒకరు జ్యోతి మల్హోత్ర! 👇👇 చూడటానికి సాధువులా, మాటలకు తియ్యగా ఉండేది. యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్‌లలో లక్షల మంది ఫాలోవర్లు. ‘ట్రావెల్ విత్ జో’ అంటూ ప్రపంచాన్ని చుట్టేసే వ్లాగర్‌గా అందరికీ తెలుసు. కానీ, ఆ అందమైన ముఖం వెనుక ఒక చీకటి కోణం దాగి ఉందని ఎవరూ ఊహించలేకపోయారు. 2023లో ఢిల్లీలోని పాకిస్తాన్ హై కమిషన్‌కు వీసా కోసం వెళ్లినప్పుడే కథ మొదలైంది. అక్కడ ఏసానూర్ రెహ్మాన్ అలియాస్ దానిష్ అనే వ్యక్త...

సచ్చార్ కమిషన్‌ను అర్థం చేసుకోవడం మరియు ఓవైసీ డిమాండ్

Image
సచ్చార్ కమిషన్‌ను అర్థం చేసుకోవడం మరియు ఓవైసీ డిమాండ్ సచ్చార్ కమిషన్, అధికారికంగా భారతదేశంలో ముస్లిం సమాజం యొక్క సామాజిక, ఆర్థిక మరియు విద్యాపరమైన స్థితిపై ప్రధానమంత్రి ఉన్నత స్థాయి కమిటీగా పిలువబడుతుంది. ఇది 2005లో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం ఆధ్వర్యంలో సోనియా గాంధీ మరియు ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ నేతృత్వంలో ఏర్పాటైంది. జస్టిస్ రాజిందర్ సచ్చార్ అధ్యక్షతన, భారతదేశంలో ముస్లింల సామాజిక-ఆర్థిక స్థితిని అంచనా వేసి, వారి ఉన్నతి కోసం సిఫార్సులు చేయడం దీని లక్ష్యం. 2006లో విడుదలైన ఈ నివేదిక, ముస్లింలు విద్య, ఉపాధి మరియు ఆర్థిక అవకాశాలలో షెడ్యూల్డ్ కులాలు (SCs) మరియు షెడ్యూల్డ్ తెగలు (STs) కంటే వెనుకబడి ఉన్నారని వెల్లడించింది. ఈ అసమానతలను పరిష్కరించడానికి విద్య, ఉపాధి అవకాశాలు మరియు ఆర్థిక సహాయం వంటి సిఫార్సులను ప్రతిపాదించింది. ఓవైసీ సచ్చార్ కమిషన్ అమలు కోసం ఎందుకు డిమాండ్ చేస్తారు? అసదుద్దీన్ ఓవైసీ, ఆల్ ఇండియా మజ్లిస్-ఎ-ఇత్తెహాద్ ముస్లిమీన్ (AIMIM) అధ్యక్షుడు, తన బహిరంగ సమావేశాలలో సచ్చార్ కమిషన్ సిఫార్సులను తరచూ ప్రస్తావిస్తూ ముస్లింలు ఎదుర్కొంటున్న సామాజిక-ఆర్థిక సవాళ్లను హైలైట...

“ఆపరేషన్ సిందూర్: ఉగ్రవాదంపై భారత్ విజయం, అంతర్గత శత్రువులపై ఆందోళన”

Image
రాజకీయాల్లో ఎవరి అభిప్రాయాలు వారికి ఉన్నా, దేశం విషయానికి వస్తే అందరూ పార్టీలకు, సిద్దాంతాలకు అతీతంగా ఏకతాటిపై ఉండాలి.. కొందరు సోకాల్డ్ మేధావులు, జర్నలిస్టులు, ఉద్యమకారుల పేరిట తమ రాతలు, కూతలతో అదుపు తప్పుతూ దేశం పరువు తీస్తున్నారు. పాకిస్తాన్ ప్రేరేపిత సీమాంతర ఉగ్రవాదం కన్నా ఇలాంటి అంతర్గత శత్రువులతోనే దేశానికి ఎక్కువ ప్రమాదకరం.. ఉగ్రవాదం, ఇస్లామిక్ తీవ్రవాదంపై జరుగుతున్న యుద్ధం ఇది. ఆపరేషన్ సిందూర్ ద్వారా ఎన్నో శిబిరాలు నాషనం చేసి, కీలక ఉగ్రవాదులను నిర్మూలించాం. పాకిస్తాన్ నాయకులు గగ్గోలు పెడుతున్నారు. ఇస్లామిక్ దేశాలు కూడా మనకు మద్దతు ఇచ్చాయి. మన దేశంలో మాత్రం ఈ అద్దె మెదళ్లు సొంద దేశానికి వ్యతిరేకంగా విషం కక్కుతున్నారు. దేశ నాయకత్వం, సైన్యం, అధికారులకు కించపరుస్తున్నారు. పహల్గాం ఘటన తర్వాత పాకిస్తాన్ మీద దాడి చేయొద్దని సుద్దులు చెప్పారు. అక్కడ చనిపోయింది మన దేశ ప్రజలు అనే సోయి కూడా వీరికి లేదు దేశభక్తి కలిగి ఉండటం ఉన్మాదమట. వీరంతా ఫేక్ దేశ భక్తులట.. ఫేక్ నేషనలిమట.. భారత్‌ది యుద్ధోన్మాదం అన్నారు. సిందూ జలాలను ఆపొద్దన్నారు. పాకిస్తాన్‌లో ధరల పెరుగుదల కారణంగా ప్రజలు తినడానికి తిండి...

ఆపరేషన్ సిందూర్: పాకిస్తాన్ & PoKలో ఉగ్రవాద నెట్‌వర్క్‌లను భారత్ ధ్వంసం చేసిన సర్జికల్ స్ట్రైక్”

Image
💥💥💥💥పాక్ మీద దాడుల వల్ల చైనా కు మన సైనిక బలం ఏమిటో ప్రాక్టికల్ గా చూపించాం. వాళ్ళ ఎయిర్ డిఫెన్స్ సిస్టం, యుద్ధ విమానాల నాణ్యత ప్రపంచానికి చూపించాం. 💥 💥💥💥😡😡😡😡😡ఆపరేషన్ సిందూర్....... మసూద్ అజార్, హఫీజ్ సయీద్, సయ్యద్ సలావుద్దీన్ ... విమానంలో ఏ ఉగ్రవాద గురువు గాయపడ్డాడు? పాకిస్తాన్ ఉగ్రవాద శిబిరాలపై ఆపరేషన్ సిందూర్ అరిస్ట్రైక్ .......భారతదేశం ఉగ్రవాదంపై నిర్ణయాత్మక దాడిని ప్రారంభించింది. లష్కరే తోయిబా, జైషే మొహమ్మద్ మరియు హిజ్బుల్ ముజాహిదీన్ సృష్టికర్తను పాకిస్తాన్ , పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (POK)లో మంగళ, బుధవారాల్లో ప్రారంభించింది. ఈ ఉమ్మడి ఆపరేషన్‌కు 'ఆపరేషన్ సిందూర్' అని పేరు పెట్టారు. రా నిఘా సమాచారం ఆధారంగా తీసుకున్న ఈ చర్యలో, భారతదేశంలోని ముగ్గురు ఉగ్రవాద నాయకుల మూలాలు కదిలాయి. ఏ ఉగ్రవాద సంస్థ నాయకుడు గాయపడ్డాడో చూద్దాం... 1. హఫీజ్ ముహమ్మద్ సయీద్ (లష్కరే తోయిబా) 26/11 ముంబై దాడికి మరియు లష్కరే తోయిబా కింగ్‌పిన్ హఫీజ్ సయీద్ యొక్క మూడు ముఖ్యమైన రహస్య స్థావరాలకు ప్రధాన సూత్రధారి. వీటిలో మురిద్కే, సవాయి నల్ల మరియు మర్కజ్ అహ్లే హదీత్ (బర్నాలా) ఉన్నాయి. భారత వైమాన...

భవిష్యత్తు ఎంత దూరంలో? భారత్-పాకిస్తాన్ ఘర్షణ పరిణామాలు

Image
ఇప్పటివరకు జరిగిందేమిటి? పాకిస్తాన్ పహల్గామ్ లో ఒక దుర్మార్గానికిపాల్పడి మానవాళికి సవాలు విసిరింది. దీనికిభారతదేశం స్పందించి పాకిస్థాన్ ప్రభుత్వానికి తన స్థానమేమిటో చూపిస్తున్నది. ఉభయదేశాలూ అణ్వస్త్రాలు కల్గిన దేశాలు కావటంతో మిగిలిన దేశాలు వారుకూడా ఏమైపోతుందో నని భయపడిపోతున్నారు. ఒక 48 గంటలపాటు యుద్ధం ఆపి, మీరెందుకు యుద్ధంచేస్తున్నారో, ఏమీకావాలనుకొంటున్నారో పరస్పరం తెలియజేసుకొని ఒక అవగాహన కు వచ్చే ప్రయత్నం చేయండి అని అమెరికా ప్రభుత్వం అడిగింది. యుద్ధం కొనసాగితే జరుగబోయేది ఏమిటో సంబంధితులకు తెలిసి వచ్చింది గనుక ఉభయదేశాల వారు తమలోతాము (ఎవరికి వారు) తర్కించుకొని వివిధరకాల ప్రత్యామ్నాయలను ఆలోచించుకొని వస్తారు. ఏవిషయాలలో ఇచ్చిపుచ్చుకొనే ధోరణితో ఉండాలో, ఏ విషయాల్లో రాజీ లేకుండా ఉండాలో వారి మనస్సుల్లో ఉంటుంది. ముఖాముఖీ మాట్లాడుకొనే సమయంలోనే అవి అవతలివారికి తెలియజేయబడుతాయి.‌ చివరికి ఏదైనా అంగీకారం కుదిరితే ఉభయపక్షాల వారు కలిసి మీడియాకు వెల్లడిస్తారు. అంగీకారం కుదర లేదనుకోండి.. మళ్లీ బలాబలాలను ప్రదర్శించుకోవటం, ప్రత్యర్థిని లొంగదీసుకొనే ప్రయత్నం కొనసాగించటం సాగిపోతుంది. కొద్ది గంటలు యుద్ధ విర...

భారత భద్రతా చరిత్ర: నీరవతనం నుండి ప్రతిఘటన వరకు

Image
చరిత్ర గతిని, మనుష్యుల స్వభావాలనూ గ్రహించుకొన్న వారు రాగల పరిణామాలను అంచనా వేసుకొని అవసరమైన సంసిద్ధతతో ఉంటారు. తక్కువ నష్టంతో పెనుప్రమాదాలను ఎదుర్కొంటారు. ఆపై మరెన్నో ప్రమాదాలను రాకముందే నివారిస్తారు. 1947 నుండి1998 వరకూ ముందుజాగ్రత్తలు గాని, గట్టి నివారణ చర్యలు గాని లేకుండా ఎప్పటి కప్పుడు నెట్టివేసుకొంటూ కాలయాపన చేసే పాలన సాగుతూ వచ్చింది. 1998-2004 లో మధ్య ప్రమాదాలు, దాడులూ జరుగుతూ వచ్చాయి, వాటికి దీటుగా స్పందించ నారంభించటమే గాక, లొంగుబాటు ఉండబోదనే సంకేతాలు బలంగా పంపబడినవి. 2004-14 మధ్య జరిగిన దాడులకు ప్రతిచర్య వ్యక్తమయ్యేదికాదు. మన ప్రభుత్వపు మెతకదనం బహిర్గతమైన రోజులవి. దీనికి ప్రజలు ఎంతగా విసిగి పోయారంటే, పాలక కూటమికి నాయకత్వం వహిస్తున్న కాంగ్రెసు బలం 2014 ఎన్నికల్లో ఐదవ వంతుకు (216 నుండి 44కి) దిగజారిపోయింది. 2014 లో అధికారానికి వచ్చిన బిజేపి ఎన్డీఏ ప్రభుత్వం రక్షణ ,భద్రతా రంగాలలో ప్రతిఘటనా సామర్థ్యాన్ని నిర్మించే ప్రయత్నాలు ఆరంభించింది. ఇప్పుడు శత్రువులు గతంలో వలె చీటీకి మాటీకీ వచ్చి మీద పడటంలేదు. మరీ దురద ఎక్కువై వచ్చిన సందర్భాల్లో చాలా గట్టిగా మరిచిపోలేని విధంగా పాఠం చెప్పబడుత...

ఆపరేషన్ సిందూర్ విజయం vs పాకిస్తాన్ ఫేక్ ప్రాపగండా

Image
1948లో నిజాం నవాబు హైదరాబాద్ సంస్థానాన్ని విలీనం చేయకుండా మొండికేయడంతో భారత సైన్యం 'ఆపరేషన్ పోలో' ప్రారంభించింది. సంస్థానాన్ని చుట్టుముట్టిన భారత సైన్యాన్ని ఎదుర్కొని ఓడిస్తున్నామని దక్కన్ రేడియో, నిజాం అనుకూల పత్రికలు ప్రచారం చేశాయి. వాస్తవానికి చాలా చోట్ల హైదరాబాద్ సైనికులు, రజాకార్లు తోకముడిచి పారిపోయారు. నిజాం లొంగుబాటు ప్రకటనతో ప్రజలు సంబరాలు చేసుకున్నారు. 1939-45 రెండో ప్రపంచ యుద్ధ కాలంలో జర్మన్ నియంత హిట్లర్ సమాచార మంత్రి గోబెల్స్ ఇలాంటి తప్పుడు ప్రచారంలో దిట్ట. చివరి నిమిషం వరకూ జర్మనీ సైన్యం విజయపరంపరతో దూసుకెళ్లుతోందని రేడియో ప్రకటనలతో ఊదరడొట్టాడు. ఇప్పుడు పాపిస్తాన్ తప్పుడు ప్రచారంలో గోబెల్స్‌ను మించిపోయింది. 'ఆపరేషన్ సిందూర్' విజయం వార్తలను తక్కువ చేసి చూపడానికి భారత విమానాలకు కూలచేశామని, సైనిక స్థావరాలను ధ్వంసం చేశామని తప్పుడు వీడియోలు ప్రచారంలోకి పెట్టింది. ఇది నిజమని నమ్మిన మన దేశానికి చెందిన కొన్ని పత్రికలు వెంటనే షేర్ చేశారు. భారత సమాచార శాఖ ఇదంతా ఫేక్ న్యూస్ అని తేల్చడంతో నాలిక కరుచుకున్నాయి. పాపిస్తాన్ తప్పుడు వార్తలు ప్రచారం చేయడంతో 1965లోనే పీహెచ్‌డ...

🔥 పాకిస్తాన్‌కు మరో ఎదురు దెబ్బ.. జీ7 కీలక ప్రకటన!

Image
*పాకిస్తాన్‌కు మరో దెబ్బ..జీ7 దేశాల కీలక ప్రకటన..* జీ7 దేశాలు పహల్గామ్ ఉగ్రదాడిని ఖండించాయి. అమెరికా, కెనడా, జపాన్, ఫ్రాన్స్, జర్మన్, ఇటలీ దేశాలు ఉమ్మడి ప్రకటన విడుదల చేశాయి. పాకిస్తాన్ తీరును తప్పుబట్టాయి. జమ్మూకాశ్మీర్, పహల్గామ్‌లోని బైసరన్ లోయలో జరిగిన ఉగ్రదాడి కారణంగా పాకిస్తాన్ భవిష్యత్తు అగమ్యగోచరంగా మారిపోయింది. భారత్ యుద్ధం ప్రకటించటంతో పాక్ చుక్కలు చూస్తోంది. పాకిస్తాన్ పరిస్థితి చూసి ఏ దేశం కూడా జాలి తలచటం లేదు. అగ్రరాజ్యం అమెరికా తాము యుద్ధం మధ్యలో కలుగజేసుకోమంటూ స్పష్టం చేసింది. ఇలా అన్ని రకాలుగా దెబ్బ తింటున్న పాక్‌కు మరో షాక్ తగిలింది. జీ7 దేశాలు ఊహించని దెబ్బ కొట్టాయి. పహల్గామ్ ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించాయి. ఈ మేరకు అమెరికా, కెనడా, జపాన్, ఫ్రాన్స్, జర్మన్, ఇటలీ దేశాలు ఉమ్మడి ప్రకటన విడుదల చేశాయి. ఏప్రిల్ 22 విషాదం.. 2025, ఏప్రిల్ 22.. పాకిస్తాన్‌ వినాశనానికి కారణమైన రోజు. పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు జమ్మూకాశ్మీర్, పహల్గామ్‌లోని బైసరన్ లోయలో పర్యాటకులపై ఉగ్రదాడికి పాల్పడ్డారు. పర్యాటకుల మతం తెలుసుకుని మరీ కాల్చేశారు. మొత్తం 26 మంది అమాయక పర్యాటకుల ప్రాణాలు తీసేశారు. ద...

మే 15 నుంచి తెలుగు రాష్ట్రాల్లో వర్షాల జోరు: లా నీనా, పాజిటివ్ IODతో ముందస్తు నైరుతి రాక

Image
త్వరగా రానున్న వర్షాకాలం. మే 15 నుంచి ఉభయ తెలుగు రాష్ట్రాలలో పెరగనున్న వర్షాలు. మే నెల 16 లోపు అండమాన్ ను తాకనున్న నైరుతి. మే చివరి వారంలోగా కేరళను తాకనున్న నైరుతి. అత్యంత ప్రతిభావంతంగా నైరుతి వుండే అవకాశం వుంది. మే 3,4 వారాల్లో ఉభయ తెలుగు రాష్ట్రాలలో ముంచెత్తనున్న వర్షాలు. మెదట కేరళలో వరదలు వచ్చే అవకాశమే ఎక్కువుగా వుంది. ముందే రానున్న‌ తొలకరి. మే నెలంతా ఎండలు అని చాలా రైతాంగం ఇంకా కళ్ళాలలోనే ధాన్యం రాశులు, కుప్పలు వుంచుకుంటే చాలా ప్రమాదమే. ఈ పరిస్ధితికీ కారణం లానినో & positive IOD . అక్టోబర్ నుంచి ఎల్నినో పరిస్ధితులు పెరగనున్నాయి. దాని వలన‌ ఈశాన్య రుతుపవనాలు పై ప్రభావం పడనున్నది.

“ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన అణుబాంబు: అమెరికా B61-12 శక్తి, ధర వెనుక రహస్యం”

Image
*అత్యంత ఖరీదైన అణుబాంబు ఏ దేశం వద్ద ఉందో తెలుసా?* May 09, 2025, *అణుబాంబుల ధర విషయానికి వస్తే అత్యంత ఖరీదైనది అమెరికాలో ఉంది. యునైటెడ్ స్టేట్స్ శాస్త్రవేత్తల ఫెడరేషన్ 1999 నాటి నివేదిక ప్రకారం B61-12 అణుబాంబు ధర 28 మి. డాలర్లు. ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన అణుబాంబుగా పరిగణించబడుతుంది. ఈ అణుబాంబును అత్యంత ప్రమాదకరమైనదిగా కూడా భావిస్తున్నారు. దీనిని సమర్థవంతమైన ఆయుధంగా ఉపయోగించేందుకు ఉన్న ఖరీదు, శక్తి, గట్టి నిర్మాణం దృష్ట్యా, పలు దేశాలకు దీని అవసరం లేకపోవచ్చు.*

“ఎస్-400: పాక్ క్షిపణులకు చెక్‌పెట్టిన భారత్‌ ‘సుదర్శన చక్రం’ - రష్యా ఆయుధ వ్యవస్థ శక్తి వెనుక రహస్యం”

Image
S-400: పాక్ మిస్సైళ్లకు అడ్డుగా భారత 'సుదర్శన చక్రం'... ఏమిటీ ఎస్-400? పాక్ దాడులను ఎస్-400తో నిలువరించిన భారత్ మధ్యలోనే పాక్ క్షిపణులను అడ్డుకుని పేల్చివేసిన ఎస్-400 ఎస్-400... రష్యా తయారీ ఆయుధ వ్యవస్థ నాటో దేశాలకు కూడా సవాలుగా నిలిచిన గగనతల రక్షణ వ్యవస్థ పొరుగుదేశం పాకిస్థాన్ మరోమారు తన దుందుడుకు వైఖరిని ప్రదర్శించగా, భారత వాయుసేన (ఐఏఎఫ్) సమర్థవంతంగా తిప్పికొట్టింది. గత రాత్రి పాకిస్థాన్ సైనిక దళాలు ఉద్రిక్తతలను పెంచేందుకు చేసిన ప్రయత్నాలను భారత వాయుసేన రష్యా నిర్మిత అత్యాధునిక ఎస్-400 గగనతల రక్షణ వ్యవస్థ (సుదర్శన చక్ర)తో విఫలం చేసింది. భారత్ రంగంలోకి దించిన ఎస్-400 గగనతల రక్షణ వ్యవస్థను ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన భూమి నుంచి గాల్లోకి ప్రయోగించే (సర్ఫేస్-టు-ఎయిర్ మిస్సైల్ - SAM) వ్యవస్థల్లో ఒకటిగా పరిగణిస్తారు. ఈ వ్యవస్థ తన అపారమైన దూరశ్రేణి సామర్థ్యాల కారణంగా నాటో (NATO) సభ్య దేశాలకు కూడా ప్రధాన సవాలుగా మారింది. భారత్ తమకు చిరకాల మిత్రదేశం కావడంతో రష్యా వీటిని సరఫరా చేసింది. ఎస్-400 వ్యవస్థ ప్రత్యేకతలు ఎస్-400 క్షిపణి రక్షణ వ్యవస్థ ప్రపంచంలోనే అత్యంత ఆధునిక దీర్ఘశ్రేణి ...

రాఫెల్ ఒప్పందం: రాహుల్ గాంధీ డిమాండ్‌తో భిన్నంగా, మోదీ నిర్ణయం భారత రక్షణ బలాన్ని ఎలా పెంచింది”

Image
భారతదేశంలో రాఫెల్ ఒప్పందాన్ని రద్దు చేయాలని ఆరోజు Rahul Gandhi డిమాండ్ చేశారు. ఇప్పుడు అదే రాఫెల్ #indiapakistan యుద్ధం సమయంలో భారతదేశం యొక్క బలమైన ఆయుధం. Narendra Modi గారు రాఫెల్ ఒప్పందాన్ని రద్దు చేసి ఉంటే, నేటి పరిస్థితి భిన్నంగా ఉండేది. భారత వైమానిక దళం యొక్క సామర్థ్యం తగ్గి ఉండేది. శత్రు దేశాల నుంచి పొంచి ఉన్న ముప్పును ఎదుర్కోవడం కష్టమయ్యేది. భారతదేశ రక్షణ వ్యవస్థ బలహీనపడేది,భారతదేశం యొక్క భద్రత ప్రమాదంలో పడేది. #OperationSindoor #PahalgamTerroristAttack✍️👆🫵

పాకిస్తాన్ నీటి సంక్షోభం తీవ్రం: భారత్ వ్యూహాత్మక జల నియంత్రణ మధ్య చీనాబ్ నది చరిత్రలో అత్యల్ప స్థాయికి Hashtags: #ChenabRiver #WaterCrisis #Pakistan #IndiaWaterPolicy #IndusWatersTreaty #WaterScarcity #AgricultureCrisis #NationalSecurity #BharatFirst #StrategicDiplomacy

Image
భారత ప్రభుత్వం తీసుకున్న జలాధిపత్య నిర్ణయాలు ఇప్పుడు పాకిస్తాన్‌పై ప్రభావం చూపిస్తున్నాయి. సింధు నదీ జలాల ఒప్పందాన్ని రద్దు చేసే దిశగా భారత్ అడుగులు వేయడంతో, పాకిస్తాన్‌లోని నీటినిల్వలు తీవ్రంగా తగ్గిపోయాయి. ప్రస్తుతం రావల్పిండిలో కేవలం 3 నెలలకు సరిపడా నీరు మాత్రమే మిగిలి ఉంది. 15.2 కోట్లకు పైగా పాకిస్తానీల జీవనోపాధి ఈ నీటికష్టాల వల్ల సంక్షోభానికి లోనవుతోంది. భారతదేశం, తన నదీజలాలను సమర్థవంతంగా వినియోగించుకునే హక్కును వినియోగించుకుంటోంది. పాకిస్తాన్‌కు ప్రవహించే జలాలపై నియంత్రణ పెంచడం ద్వారా, పాక్ వ్యవసాయ రంగం తీవ్ర ప్రభావానికి లోనవుతోంది. పాక్ ప్రభుత్వం కుశాసనంతో మరియు తీవ్ర ఉగ్రవాద మద్దతుతో భారతదేశానికి నిరంతరం హానికరంగా వ్యవహరిస్తుండటం వల్ల, ఈ విధంగా మేం మా జలాధికారాన్ని వినియోగించుకోవడం అనివార్యం అయింది. ఇది భారత సార్వభౌమత్వాన్ని కాపాడే చర్య మాత్రమే కాదు, మా వనరులను మా ప్రజల భవిష్యత్తు కోసం సద్వినియోగం చేసే అవసరం కూడా. దేశ భద్రతకే కాకుండా, అభివృద్ధికి దోహదపడే ఈ నిర్ణయం బలమైన నాయకత్వాన్ని ప్రతిబింబిస్తుంది. – కేసబోయిన శ్రీధర్, ప్రధాన కార్యదర్శి, హైదరాబాద్ సెంట్రల్ బీజేపీ ఓబీసీ మోర్చా

ప్రకాష్ రాజ్‌కు కేశబోయిన శ్రీధర్ స్ట్రాంగ్ రిప్లై: ‘అబిర్ గులాల్’ నిషేధంపై దేశ భద్రత కోణం! #PrakashRaj #AbirGulaal #FawadKhan #NationalSecurity #BJPResponse #TelanganaBJP #PahalgamAttack #FreedomOfExpression #IndianCinema

Image
ప్రకాష్ రాజ్ గారికి సూటిగా జవాబు పాకిస్తాన్‌లో రూపొందిన ‘అబిర్ గులాల్’ అనే సినిమాను భారత్‌లో నిషేధించడాన్ని వ్యతిరేకిస్తూ ప్రకాష్ రాజ్ గారు చేసిన వ్యాఖ్యలు పూర్తిగా దేశ భద్రతను తక్కువగా భావించే ధోరణికి నిదర్శనం. ఈ సినిమా హీరో ఫవాద్ ఖాన్, ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే నేపథ్యంతో వచ్చిన సినిమాల్లో నటించడమే కాకుండా, గతంలో భారత్‌పై వ్యతిరేక వ్యాఖ్యలు చేసిన చరిత్ర కలిగి ఉన్న వ్యక్తి. ఇలాంటి వ్యక్తి నటించిన సినిమాను భారత ప్రజలు తిరస్కరించడం సహజం. పుల్వామా దాడిలో 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. అప్పటి దాడి తర్వాత కూడా పాకిస్తాన్ నుంచి వచ్చే పాపం కండా కళాకారులను కొందరు “సాహిత్య స్వేచ్ఛ”, “కళా స్వేచ్ఛ” పేర్లతో సమర్థించడం దురదృష్టకరం. ప్రకాష్ రాజ్ గారు “ఫోర్న్ సినిమాలు తప్ప దేనిని నిషేధించకూడదు” అంటున్నారు. దేశానికి, జవాన్లకు వ్యతిరేకంగా రూపొందిన సినిమాలు వచ్చినప్పుడు మౌనంగా ఉండమంటారా? దేశభక్తిని తిట్టడం, దేశద్రోహాన్ని సమర్థించడం ఏ స్వేచ్ఛా కాదు. ఈ దేశ భద్రత మాకెందరికైనా మించి. దేశాన్ని తిడితేనే అభిప్రాయం అంటారా? అలాంటి సినిమాలకు, వ్యక్తులకు భారత్‌లో స్థానం లేదు. – కేశబోయిన శ్రీధర్ జన...

అంబర్‌పేట సభలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి హైలైట్స్: మోడీ హయాంలో తెలంగాణ రహదారుల అభివృద్ధి విజయగాథ! #KishanReddy #AmberpetFlyover #TelanganaDevelopment #NationalHighways #ModiGovernment #HyderabadInfra #BJPLeadership #InfrastructureGrowth

Image
అంబర్పేట్ సభలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి గారు సభలో మాట్లాడిన ముఖ్యంశాలు ఈరోజు మన దేశంలో ఎక్కడికెళ్లినా, మన తెలంగాణలో ఏ జిల్లాలోకి వెళ్లినా, స్పష్టంగా కనబడేది – జాతీయ రహదారుల అభివృద్ధి. ఇది నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో, నితిన్ గడ్కరీ గారి కృషితో సాధ్యమైంది. 2014లో తెలంగాణ ఏర్పడినప్పుడు రాష్ట్రంలో కేవలం 2,500 కిలోమీటర్ల జాతీయ రహదారులే ఉండగా, ఇవాళ కేంద్ర ప్రభుత్వం వల్ల అది 5,000 కిలోమీటర్లకు పైగా పెరిగింది. ఇది రహదారుల విస్తరణలో ఒక రికార్డే. రోడ్లు ఉంటే రైతులకు వ్యయనష్టం తగ్గుతుంది. పరిశ్రమలు అభివృద్ధి చెందుతాయి. ఉపాధి అవకాశాలు ఏర్పడతాయి. కనెక్టివిటీ పెరగడం వలన సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుంది. మౌలిక వసతుల విషయంలో రహదారుల పాత్ర ఎంతో కీలకం. గత పదేళ్లలో మోడీ పాలనలో జాతీయ రహదారులు, రైల్వేలు, పోర్టులు అన్నీ అభివృద్ధి చెందాయి. హైదరాబాద్‌లో ప్రత్యేకంగా చెప్పాలంటే — బాంబే హైవే ఫ్లైఓవర్, ఆరంఘార్ ఫ్లైఓవర్, అంబర్ పేట్ ఫ్లైఓవర్ వంటి మల్టీలెవెల్ ప్రాజెక్టులు ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చాం. నేను శాసనసభ్యుడిగా ఉన్న సమయంలో అంబర్ పేట్ ఫ్లైఓవర్ కోసం ఎంతో కష్టపడి సాధించాం. ఫ్లైఓవర్ కింద సర్వీస్ రోడ్డుల కోసం...

కేంద్ర చేయబోయే కులగణన లో ఎట్టి పరిస్థితి లో BC లో ముస్లిమ్స్ నీ చేర్చేది లేదు : కిషన్ రెడ్డి #KishanReddy #CasteCensus #NoMuslimsInBC #BCReservation #ConstitutionalRights #SocialJustice #BackwardClasses #BJPStand #IndiaPolitics #CensusDebate #TelanganaPolitics #BJPForBCs #CasteEquity #InclusivePolicy

Image
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇటీవల చేసిన ప్రకటనలో, కేంద్ర ప్రభుత్వం చేపట్టబోయే కులగణనలో ముస్లింలను బీసీ (బ్యాక్వర్డ్ క్లాస్) జాబితాలో చేర్చే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఆయన ప్రకారం, మత ప్రాతిపదికన ఎవరినీ బీసీల్లో చేర్చడం రాజ్యాంగ విరుద్ధమని, సుప్రీంకోర్టు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసిందని తెలిపారు . అదేవిధంగా, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన బీసీ సర్వేను ఆయన తప్పుబట్టారు. ముస్లింలను బీసీ జాబితాలో చేర్చడం ద్వారా బీసీలకు అన్యాయం జరిగిందని, ఇది రాజ్యాంగ విరుద్ధమని విమర్శించారు . కేంద్ర ప్రభుత్వం చేపట్టబోయే కులగణనను పారదర్శకంగా, శాస్త్రీయంగా నిర్వహించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని, ఇందులో మత ప్రాతిపదికన ఎవరినీ బీసీల్లో చేర్చే ప్రసక్తే లేదని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.

అంబర్‌పేట ఫ్లైఓవర్ ఓపెనింగ్‌లో బీజేపీ ప్రచార రథంలో కాంగ్రెస్ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి!

Image
బీజేపీ ప్రచార రథం ఎక్కిన కాంగ్రెస్ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అంబర్ పేట ఫ్లై ఓవర్ ఓపెనింగ్ సందర్భంగా బీజేపీ నాయకులతో పాటు వారి ప్రచారం రథంలో ర్యాలీగా వెళ్ళిన మంత్రి కోమటిరెడ్డి #KomatireddyVenkatReddy #BJPCampaign #CongressMinister #AmberpetFlyover #TelanganaPolitics #BJPRally #PoliticalControversy #HyderabadNews

అయిదేళ్ల తరువాత కైలాస మానసరోవర యాత్ర.. ఎలా దరఖాస్తు చేసుకోవాలి? ఎంత ఖర్చవుతుంది? ఎవరు వెళ్లొచ్చు

Image
అయిదేళ్ల తర్వాత కైలాస మానసరోవర యాత్ర మళ్లీ ప్రారంభం కాబోతుంది.  ఈ యాత్రకు వెళ్లాలనుకునేవారు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.  ఈ నెల 13(2025 మే 13) వరకు దరఖాస్తు చేసుకోవచ్చని భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. తొలి యాత్ర జూన్ 30న దిల్లీ నుంచి లిపులేఖ్ మీదుగా సాగనుంది. యాత్ర నిర్వహించిన కాలంలో ఏటా సుమారు 900 మంది భారతీయులు కైలాస మానసరోవర్‌ను దర్శించుకునేవారు. హిందూ మత విశ్వాసాల ప్రకారం.. శివుడు కైలాస మానసరోవరలో కొలువై ఉన్నట్లు చెప్తారు.  సముద్ర మట్టానికి 6,638 మీటర్ల ఎత్తులో కైలాస పర్వతం, మానసరోవర సరస్సు ఉంటాయి. బౌద్ధ, జైన మతంలోనూ వీటికి చాలా ప్రాధాన్యం ఉంది. ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు? కైలాస మానసరోవర యాత్రకు సంబంధించిన నిబంధనలను విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. ఈ యాత్రకు తొలి అర్హత కచ్చితంగా భారతీయ పౌరులై ఉండడం.  సెప్టెంబర్ 1 నాటికి సుమారు ఆరు నెలల వాలిడిటీతో భారతీయ పాస్‌పోర్ట్ ఉండాలి.  ప్రస్తుత ఏడాది జనవరి 1 నాటికి వయసు 18 ఏళ్లు నుంచి గరిష్ఠంగా 70 ఏళ్ల మధ్య ఉండాలని భారత విదేశీ వ్యవహరాల మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ యాత్రకు అత్యంత ముఖ్యమ...

ఎల్లుండి దేశవ్యాప్తంగా వైమానిక దాడులపై మాక్‌ డ్రిల్‌! అన్ని రాష్ట్రాలకు కేంద్ర హోం శాఖ ఆదేశం

Image
ఎల్లుండి దేశవ్యాప్తంగా వైమానిక దాడులపై మాక్‌ డ్రిల్‌! అన్ని రాష్ట్రాలకు కేంద్ర హోం శాఖ ఆదేశం పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత, భారత ప్రభుత్వం పాకిస్థాన్‌లోని ఉగ్రవాద శిబిరాలపై దాడి చేయాలని నిర్ణయించింది. ఈ క్రమంలోనే దేశవ్యాప్తంగా అప్రమత్తతను పెంచేందుకు, వైమానిక దాడులపై అవగాహన కోసం మాక్ డ్రిల్‌ నిర్వహించాలని కేంద్ర హోంశాఖ ఆదేశించింది. భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. ఉగ్రవాదుల ఎరివేతలో భాగంగా పాకిస్థాన్‌లోని ఉగ్ర స్థావరాలపై భారత్‌ దాడి చేయాలని డిసైడ్‌ అయింది. ఆ విషయాన్ని స్వయంగా ప్రధాని మోదీనే ప్రకటించారు. పహల్గామ్‌ ఉగ్రదాడి తర్వాత.. స్పందిస్తూ ఉగ్రవాదులను, వారి వెనకున్న వారిని వెతికి వెతికి వేటాడుతాం అని అన్నారు. ఆ తర్వాత పాక్‌పై కొన్ని చర్యలు తీసుకున్నారు. దీంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. యుద్ధం జరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే ప్రధాని మోదీ త్రివిధ దళాల అధిపతులతో సమావేశాలు కూడా నిర్వహించారు. ఈ క్రమంలోనే సోమవారం కేంద్ర హోం శాఖ కీలక అన్ని రాష్ట్రాలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. వైమానిక దాడులపై అవగాహన కోసం ఈ నెల 7న అంటే బుధవారం రోజు మ...