Posts

Showing posts from February, 2025

“భాషా వివిధ్యత గౌరవం: దేశ సమగ్రతకు మూలస్తంభం”

Image
భాషా వివిధ్యతను గౌరవించడం ద్వారా మాత్రమే దేశ సమగ్రతను కాపాడుకోవచ్చు. భాషా ఆధారిత విభేదాలు సృష్టించడం సనాతన ధర్మానికి వ్యతిరేకం. త్రిభాషా విధానాన్ని నిరాకరించడం, ద్విభాషా విధానాన్ని మాత్రమే సమర్థించడం, రెండో భాషగా ఇంగ్లీషును మాత్రమే అంగీకరించడం వంటి చర్యలు ప్రాంతీయ విభేదాలను పెంచుతాయి. దేశీయ భాషలైన హిందీ, సంస్కృత భాషలను నిరాకరించడం ద్వంద్వ వైఖరికి నిదర్శనం. తమిళనాడులో తెలుగు, కన్నడ, మలయాళం వంటి ఇతర దక్షిణాది భాషలను అణచివేయడం భాషా సమగ్రతకు హానికరం. కేంద్ర ప్రభుత్వం అన్ని భారతీయ భాషలను గౌరవిస్తుండగా, ఒకే భాష పెత్తనం చేయాలనే ప్రయత్నాలు విభజనకు దారితీస్తాయి. • కేశబోయిన శ్రీధర్, జనరల్ సెక్రటరీ, హైదరాబాద్ సెంట్రల్ బీజేపీ ఓబీసీ మోర్చా

“సనాతన ధర్మ ఆనవాళ్లు: గుజరాత్ లో వెలుగులోకి వచ్చిన అద్భుతమైన స్పటిక శివలింగం”

Image
ఎంత తొక్కేసి, నలిపేసి, ధ్వంసం చేసి ఆనవాళ్లు లేకుండా చేద్దాం అని అనుకుంటూ ఉంటే అంత ఉవ్వెత్తున మళ్లీ ఎగిసి పడుతున్నాయి "సనాతన ధర్మ" ఆనవాళ్లు. గుజరాత్ లో భరూచ్ జిల్లాలోని జంబూసర్ తాలూకాలో ఉన్న ' కవి 'గ్రామం. బుధవారం కవి గ్రామ తీరానికి సమీపంలో అరేబియా సముద్రంలో చేపల వేటకు వెళ్లిన మత్స్యకారుల వలలో చిక్కుకున్న 100 కిలోగ్రాములకు పైగాబరువు ఉన్న సుమారు ఎనిమిది అడుగుల ఎత్తుల ఉన్న స్పటిక (క్రిస్టల్) శివలింగం దొరికింది. బాగా బరువు ఉండటంతో అతి కష్టం మీద 10 మంది మత్స్యకారులు శివలింగాన్ని జాగ్రత్తగా తమ పడవలోకి ఎక్కించి ఒడ్డుకు చేర్చారు. ఈ అరుదైన శివలింగాన్ని చూసేందుకు పెద్ద సంఖ్యలో గ్రామస్తులు సముద్రం ఒడ్డుకు చేరుకున్నారు కాళీ దాస్ వాఘేలా, మంగళ్ కాళీ దాస్ ఫకీరా మరియు మరో డజను మంది మత్స్యకారులు తీరానికి దగ్గరగా ఉన్న ఢంకా తీర్థం దగ్గర సాధారణ చేపల వేటకు బయలుదేరారు. వారి వల లాగుతున్నప్పుడు, వారి వలలో చేపలుతో పాటు ఈ పెద్ద స్పటిక శివలింగం కూడా చిక్కుకుంది. దానిని జాగ్రత్తగా శుభ్రపరచి పరిశీలించిన మీదట అది స్పటిక శివలింగం గా తేలింది. మత్స్యకారులు ఒడ్డుకు తీసుకువచ్చి పూర్తిగా శుభ్రం చేసి...

చిలుకూరు అర్చకుడిపై దాడి: కేశబోయిన శ్రీధర్ న్యాయం కోసం డిమాండ్

Image
చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడు రంగరాజన్ గారిపై జరిగిన దాడిని ఖండిస్తూ, హైదరాబాద్ కేంద్ర బీజేపీ ఓబీసీ Morcha జనరల్ సెక్రటరీ కేశబోయినా శ్రీధర్ గారు చేసిన ప్రకటన ఇది. ఈ దాడిని ఆయన అత్యంత దుర్మార్గమైన, నైతికంగా అంగీకరించదగని చర్యగా అభివర్ణించారు. దేవ సేవలో నిమగ్నమయ్యే రంగరాజన్ గారి కుటుంబ పరిస్థితి మరింత బాధాకరమవుతోందని, రాష్ట్రంలో శాంతి భద్రతలు దిగజారిపోతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి దాడులను ఎటువంటి సందర్భంలోనూ ఉపేక్షించకూడదని, రాష్ట్ర భద్రత పట్ల అవహేళన జరుగుతున్నట్లు తెలుస్తోందని ఆయన అన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు మరలా జరగకుండా కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ ప్రకటనలో కేశబోయినా శ్రీధర్ గారు దాడిని ఖండించడంతో పాటు, రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేశారు. దోషులను కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు.

అన్నా హజారే ఆదర్శాలు: శిష్యుల చేతుల్లో ఎలా చెడిపోయాయి?"**

Image
మీ చుట్టూ చేరిన వారితో జాగ్రత్త అని చెప్పితే, గిట్టనివారు ఇలాగే దుష్ప్రచారం చేస్తారని పెద్దగా పట్టించుకోలేదు అన్నాహజారే.. క్రమంగా అనుభవానికి వచ్చేసరికి పరిస్థితి చేజారిపోయింది. అప్పటికే నిఖార్సయిన శిష్యులను దూరం చేసుకొని ఒంటరిగా మిగిలిపోయారు.. ఇంతకాలంగా ఆయన చేసిన పనంతా బూడదలో పోసిన పన్నీరైంది. హాజారేకన్నా తామే యోధులం అన్నట్లు మాటల గారడీతో నమ్మించేశారు సోకాల్డ్ శిష్యులు. మనకు రాజకీయాలు వద్దు, ఉద్యమం ద్వారా మార్పు తెద్దాం అని అన్నాహజారే చెప్పిన మాటలు ఎవరికీ రుచించలేదు. అలా ప్రారంభమైన పార్టీ తత్వం ప్రారంభంలోనే బోధపడ్డా ఎవరూ పెద్ద పట్టించుకోలేదు. ఏ పార్టీ అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేశారో, అదే పార్టీ మద్దతుతో ఢిల్లీలో అధికారం చేపట్టారు. ఈ విషయంలో వారిద్దరినీ కలిపిన ఎజెండా జాతీయవాద వ్యతిరేకత. అన్నా హజారే మద్యానికి వ్యతిరేకంగా ప్రజల్లో చైతన్యం తెచ్చి తన ఊరు రాలేగావ్ సిద్దీని అభివృద్ది చేశారు. కానీ ఈ సోకాల్డ్ శిష్యులు అదే మద్యం మాఫియాతో అంటకాగి ప్రజాధనాన్ని దోచుకొని శీష్ మహల్ లాంటి అద్దాల మేడలు కట్టుకున్నారు. చేసిన పాపం ఊరికే పోదు కదా.. ఎవరి కర్మ వారే అనుభవించాలి. చేస్తూనే ఉండండి..

నెహ్రూ విదేశీ విధానం మరియు జాక్విలినా కెన్నెడీ: 'JFK's Forgotten Crisis' పుస్తకం నుండి వివాదాస్పద విషయాలు #JawaharlalNehru #JFK #ForeignPolicy #NehruControversies #IndiraGandhi

Image
'డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రధాని మోదీని ఆహ్వానించే విధంగా అమెరికాను అడుక్కుందికి మోడీ ప్రభుత్వం భారత విదేశీ వ్యవహారాల మంత్రిని మూడు లేదా నాలుగు సార్లు అమెరికాకు పంపిందని" కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ మొన్న పార్లమెంట్‌లో మాట్లాడుతూ ఆరోపించాడు. మనం అద్దాల మేడలో ఉంటూ ఎదురు వాళ్ళ మీద రాళ్లు విసరకూడదు అని సామెత. అందులోనూ మోదీ వంటి వారితో అసలు పెట్టుకోకూడదు. కానీ రాహువు కి అంత IQ ఉంటే కాంగ్రేస్ నాయకులకు, నెహ్రూ కుటుంబ బానిసలకు విచారం ఎందుకు ఉంటుంది? మరి రాహుల్ చేసిన ఆరోపణలు పై మోడీ జవాబు చెప్పకుండా మౌనంగా ఉంటారా? అందుకే మొన్న మోడీ పార్లమెంట్ లో మాట్లాడుతూ ... "విదేశాంగ విధానంపై ఆసక్తి ఉన్నవారు అమెరికా అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెన్నెడీతో జవహర్‌లాల్ నెహ్రూ జరిపిన సమావేశాలపై సమాచారాన్ని ఇచ్చే JFK's Forgotten crisis అనే పుస్తకాన్ని చదవాలని ప్రధాని మోదీ అందరికి సలహా ఇచ్చారు. "ఒక వైపు దేశం గట్టి సవాళ్లను ఎదుర్కొంటున్న పరిస్థితులలలో నెహ్రూ మరియు అతని దౌత్యం విధానం పై కూడా ఈ పుస్తకంలో రాయబడింది అందుచేత తప్పక చదవండి" అని మోదీ చెప్పారు. ఇంతకీ " JFK's...

నెహ్రూ గురించి తెలియాలంటే కెన్నెడీ పుస్తకం చదవాలి..

Image
నెహ్రూ గురించి తెలియాలంటే కెన్నెడీ పుస్తకం చదవాలి.. దేశ తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూని ఉటంకిస్తూ ప్రధాని నరేంద్రమోడీ కాంగ్రెస్, రాహుల్ గాంధీలపై విరుచుకుపడ్డారు. విదేశాంగ విధానంపై ఆసక్తి ఉన్నవారు ‘‘జెఎఫ్‌కే ఫర్‌గటెన్ క్రైసిస్’’ బుక్ చదవాలని ప్రధాని మోడీ మంగళవారం పార్లమెంట్లో అన్నారు. ఈ పుస్తకం అమెరికా అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెన్నడ, అప్పటి ప్రధాని నెహ్రూ మధ్య సమావేశం గురించి తెలియజేస్తుంది డొనాల్డ్ ట్రంప్ ప్రమాణస్వీకార ఆహ్వానం కోసం విదేశాంగ మంత్రి జైశంకర్‌ని నాలుగైదు సార్లు ప్రధాని మోడీ అమెరికాకు పంపారని సోమవారం లోక్‌సభలో రాహుల్ గాంధీ ఆరోపించారు. ఈ వ్యాఖ్యలపై మాట్లాడుతూ ప్రధాని నెహ్రూ తీరు, కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించారు. ‘JFK’s Forgotten Crisis: Tibet, the CIA and the Sino-Indian War’ అనే బుక్‌ని మాజీ సీఐఏ అధికారి బ్రూస్ రీడెన్ రాశారు. ఇది 1962 లో ఇండియా-చైనా యుద్ధం గురించి వివరిస్తుంది. చైనాకు వ్యతిరేకంగా యుద్ధ విమానాలు అందించాలని నెహ్రూ కెన్నడీకి ఎలా లేఖలు రాశారనేదానిని వివరించింది. చైనా సరిహద్దు వివాదాన్ని నిర్వహించడంలో విఫలమయ్యారని బీజేపీ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న రాహుల్ గాంధీ,...

నిర్బంధ కేంద్రాల్లో విదేశీయులు: సుప్రీం కోర్టు ఆగ్రహం** #SupremeCourt #Assam #Deportation

Image
విదేశీయుల్ని పంపేయడానికి ముహూర్తం కావాలా? సుప్రీం కోర్టు ఆగ్రహం విదేశీయుల్ని ఇంకెన్నాళ్లు నిర్బంధ కేంద్రాల్లో వుంచుతారంటూ సుప్రీం కోర్టు అసోం ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. వారిని స్వస్థలాలకు పంపడానికి ఏమైనా ముహూర్తం కావాలా? అంటూ ప్రశ్నించింది. నిర్బంధ కేంద్రాల్లో వుంచిన 63 మంది వలసదారులను రెండు వారాల్లోగా పంపించేయాలని న్యాయమూర్తులు జస్టిస్ అభయ్ ఓకా, జస్టిస్ ఉజ్జల్ భూయాన్ తో కూడిన ధర్మాసనం ఆదేశించింది. అయితే.. వారి చిరునామాలు తెలియపోవడం వల్లే జాప్యం అవుతోందని అసోం ప్రభుత్వం సుప్రీంకి నివేదించింది. దీంతో సుప్రీం కోర్టు స్పందిస్తూ..చిరునామా లేకున్నా సరే.. వారిని వెంటనే పంపేయాలని, ఇలాగే ఎన్ని రోజులు నిర్బంధ కేంద్రాల్లో వుంచుతారని ప్రశ్నించింది. వారి పౌరసత్వ పరిస్థితి ఏమిటో మీకు తెలుసని,అయినా చిరునామా కోసం ఎన్నాళ్లు వేచి చూస్తారంటూ సుప్రీం నిలదీసింది. అసలు చిరునామా అన్న విషయం పరిగణనలోకి తీసుకోవాల్సిన అంశమే కాదని, అలాగే వారిని జీవితాంతం కేంద్రాల్లో వుంచుతూ పోషించలేం కదా? అని అసహనం వ్యక్తం చేసింది. వెంటనే అక్రమ వలసదారుల బహిష్కరణ ప్రక్రియను ప్రారంభించాలని సుప్రీం ఆదేశించింది. మరోవైపు చిరునామ...

అక్రమ మత మార్పిళ్లను నిరోధించే బిల్లు: రాజస్థాన్ ప్రభుత్వ నిర్ణయం** #రాజస్థాన్ #మతమార్పిడి #AntiConversionBill"

Image
అక్రమ మత మార్పిళ్లు చేశారో... రాజస్థాన్ లో మూడినట్లే మతం మారేవారికి, అక్రమ మత మార్పిళ్లను ప్రోత్సహించే వారి విషయంలో రాజస్థాన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బలవంతపు మత మార్పిళ్లను నిరోధించేందుకు చట్టవిరుద్ధ మత మార్పిడి నిషేధ బిల్లు 2024 (రాజస్థాన్ ప్రొహిబిషన్ ఆఫ్ అన్ లాఫుల్ కన్వర్షన్ ఆఫ్ రిలిజయన్ బిల్లు 2024) ను తీసుకొచ్చింది. దీనిని రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్ లాల్ శర్మ ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. ఈ బిల్లుపై అసెంబ్లీలో చర్చించి, ఆమోద ముద్ర వేసేందుకు కూడా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అయితే.. 2024 నవంబర్ లోనే ఈ బిల్లు ముసాయిదాను భజన్ లాల్ శర్మ నేతృత్వంలోని కేబినెట్ ఆమోదం తెలిపింది. మత మార్పిడి చేసుకోవాలని భావించిన వారు దాదాపు రెండు నెలల ముందే జిల్లా కలెక్టర్ ముందు దరఖాస్తు చేసుకోవాలి. ఎవ్వరి ఒత్తిడీ దీని వెనుక లేదని, తమంతట తామే స్వచ్ఛందంగా మతం మారాలని నిర్ణయించుకున్నామంటూ కలెక్టర్ ముందు వాంగ్మూలం ఇవ్వాలి. అప్పుడే వారికి మత మార్పిడికి తగిన అనుమతినిస్తారు. అలాగే మత మార్పిడి కోసమే జరిగే వివాహాలను చట్టవిరుద్ధంగా పరిగణిస్తారు. అలాగే అది లవ్ జిహాద్ కిందికి వెళిపోతాయి. అలాంటి వివా...

UPI లావాదేవీలపై ఛార్జీలు లేవు: ఆర్థిక మంత్రిత్వ శాఖ తప్పుడు వార్తలు ఖండించింది** #డిజిటల్చెల్లింపులు #UPI #ఆర్థికమంత్రిత్వశాఖ"

Image
"డిజిటల్ చెల్లింపుల" పై చార్జీలు వేసే ఉద్దేశ్యంతో ఉన్న కేంద్ర ప్రభుత్వం అని మీడియాలోనూ మరియు సోషల్ మీడియాలో నూ వస్తున్న వార్తలు తప్పు కేంద్ర ప్రభుత్వానికి అటువంటి ఉద్దేశ్యం లేదు అని కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ ఈ రోజు వివరణ ఇచ్చింది. UPI పేమెంట్ వ్యవస్థ ( అంటే ఈ G పే, పే టీఎం, ఫోన్ పే వంటివి) అనేది ప్రజలకు అపారమైన సౌలభ్యం కలుగ చేస్తున్నాది. అలాగే ఆర్థిక వ్యవస్థకు కూడా చాలా ఉపయోగకరమైన డిజిటల్ వ్యవస్థ ఇది. అందువల్ల ఇటువంటి UPI సేవలకు ఎలాంటి ఛార్జీలు విధించేందుకు ప్రభుత్వం వద్ద ఎలాంటి ప్రతిపాదన పరిశీలనలో లేదు. వీటిని నడపడంలో అయ్యే తమ ఖర్చులు గురించి సర్వీస్ ప్రొవైడర్ల ఆందోళనలను ఇతర మార్గాల ద్వారా తీర్చాలి. దీనిని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం గత సంవత్సరం #DigitalPayment వ్యవస్థకు ఆర్థిక సహాయాన్ని అందించింది మరియు #DigitalPayments మరియు చెల్లింపు ప్లాట్‌ఫారమ్‌లను ఆర్థికంగా మరియు వినియోగదారు-స్నేహపూర్వకంగా ఉండేలా ప్రోత్సహించడానికి ఈ సంవత్సరం కూడా అదే విధంగా ఆర్ధిక సహాయం ప్రకటించింది అని ....కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ తెలిపింది.

మహా కుంభమేళా లో స్నానం చేయాలని అన్ని కోట్ల మంది ఎందుకు వస్తున్నారు?

Image
#mahakumbh2025 #kumbhmela2025 #హిందుత్వం #జాగోహిందూ #జైశ్రీరామ్ #హైందవశంఖారావం #haindavasankharavam #బాకీసబ్_బక్వాస్ మహా కుంభమేళా లో స్నానం చేయాలని అన్ని కోట్ల మంది ఎందుకు వస్తున్నారు? మొదట నలభై-నలభై అయిదు కోట్లమంది వస్తారని అంచనా వేశారు . ఇంకా ఇరవై రోజులు పూర్తి కాలేదు. ఇప్పటికే ముప్పై మూడు కోట్లమంది స్నానాలు చేశారు. ఇంకా ఇరవై రోజుల పైనే ఉంది . ఇంకో నలభై కోట్లమంది స్నానాలు చేసినా ఆశ్చర్యపోయే అవసరం లేదు. డెబ్బై ఎనభై కోట్ల మంది స్నానాలు చేయగా, భక్తి శ్రద్ధలు, ఆసక్తి ఉండీ. అవకాశాలు లేక రాలేనివారు అంతకన్నా ఎక్కువమందే ఉంటారు, ప్రపంచమంతా కలిపి. సుమారు నూటయాభై కోట్లమంది శ్రద్ధాళువులు మహా కుంభమేళా గురించి రోజురోజూ వివరాలు తెలుసుకుంటున్నారు. కుంభమేళాలో స్నానం చేస్తే తిండి దొరుకుతుందా? అంటూ మల్లికార్జున ఖర్గే... ది పూర్ ఫెలో--- లేకిగా అడుగుతున్నాడు. అంటే ఈ నూటయాభై కోట్లమందికి తెలిసినది, ఆ పూర్ ఫెలో కు తెలియలేదు. తిండి అనేది అత్యంత ప్రాథమిక అవసరము. కుంభమేళాలో స్నానం చేస్తే, తిండి మాత్రమే కాదు, అత్యంత ఉన్నతమైన ప్రయోజనము--- బ్రహ్మానందము, లేదా మోక్షము కలుగుతుంది. అది తెలీక ఇతగాడు మొదటి మెట్టులోనే త...

From Middle-Class Spending to Economic Growth: The Ripple Effect

Image
If a middle-class person has ₹5000 to spend in a month, what does he do? He buys more amenities. The person who receives that money also spends it on something else. The seller, who now has the money, uses it to avail a service he needs. How many hands does this money exchange in a year? Let’s assume it changes ten hands. In this process, nearly ₹2000 reaches the central and state governments in the form of GST. Now, let’s assume the same person invests in buying land or a house instead. In that case, the state government earns revenue through stamp duty and registration fees. Earlier, people used to register their properties for a lower amount than their actual purchase price. But now, as the market is stabilizing and the real estate sector is growing, buyers register properties at higher market values with pride. This growth in real estate transactions leads to a rise in vehicle sales, business investments, and overall economic activity. This is a chain reaction—one transaction influ...

పొడవాటి ఆకులుండే పంటలు పండించొద్దు: BSF రైతులకు సూచన #సరిహద్దుభద్రత #BSFఅప్రమత్తత #రైతులఅవగాహన

Image
పొడవాటి ఆకులుండే పంటలు పండించొద్దు : రైతులను కోరిన BSF సరిహద్దుల వెంబడి అక్రమ చొరబాట్లను నిరోధించడానికి సరిహద్దు భద్రతా దళం (BSF) కీలక నిర్ణయం తీసుకుంది. బంగ్లాదేశ్ సరిహద్దు ప్రాంతాల్లో వుండే రైతులు పొడవుగా ఆకులు వచ్చే పంటలను పండించొద్దని పేర్కొంది. ఈ మేరకు సరిహద్దు ప్రాంతాలను ఆనుకొని వుండే అన్ని జిల్లాల కలెక్టర్లకు బీఎస్ఎఫ్ లేఖలు రాసింది. పొడవాటి ఆకులు వచ్చే పంటలను పండించొద్దని రైతులకు సూచించాలని, ఈ మేరకు వారిని జాగృతం చేయాలని జిల్లాల కలెక్టర్లను కోరింది.దీనిపై రైతులకు అవగాహనా సదస్సులు కూడా నిర్వహించాలని సూచించింది. పొడవాటి ఆకులు వచ్చే పంటలను పండించడం వల్ల వాటి అక్రమ చొరబాటుదార్లు వాటి వెనుక దాక్కోవడం, అలాగే స్మగ్లర్లు వీటిని ఓ అవకాశంగా తీసుకోవడం జరుగుతోందని, అందుకే రైతులు ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలని బీఎస్ఎఫ్ పేర్కొంది. ఈ మేరకు రైతులను ఒప్పించాలని కూడా కలెక్టర్లను కోరింది. అయితే.. ఇలాంటి లేఖలు పంపడం ఇది మొదటిసారి కాదని అధికారులు అంటున్నారు. బంగ్లాదేశ్ లో రాజకీయ అస్థిరత నెలకొన్న నేపథ్యంలో సరిహద్దు ప్రాంతాల్లో బీఎస్ఎఫ్ నిఘా పెంచింది. బంగ్లాదేశ్ ను పంచుకొనే సరిహద్దు ప్రాంతాల్లో వైవ...

మహా కుంభమేళాలో 16 వేల మంది స్వయంసేవకుల అద్భుత సేవా కార్యక్రమాలు

Image
కుంభమేళా సేవా కార్యక్రమాల్లో 16 వేల మంది స్వయంసేవకులు మహా కుంభమేళాలో ప్రమాదం జరిగిన తర్వాత ఆరెస్సెస్ స్వయంసేవకులు తమ తమ ప్రాంతాల్లో సేవా కార్యక్రమాల్లో మునిగిపోయారు. అత్యంత వేగంగా సహాయ కార్యక్రమాలు చేస్తున్నారు.స్వయంసేవకులు బృందాలుగా విడిపోయి, రవాణా ఏర్పాట్లు, పరిపాలనా అధికారులకు సహాయం చేస్తున్నారు. ఇలా 16 వేల మంది స్వయంసేవకులు సేవలో వున్నారు. యాత్రికుల కోసం కొన్ని స్థలాల్లో దుకాణాలను కూడా ప్రారంభించారు.సెక్టార్ 9 దగ్గర వుండే కలాష్ ద్వారం, సెక్టార్ 7 దగ్గర వుండే సూర్య ద్వారం దగ్గర ట్రాఫిక్ క్లియర్ చేయడంలో కూడా స్వయంసేవకులు మునిగిపోయారు. శ్యామా ప్రసాద్ ముఖర్జీ నగర్ కి చెందిన స్వయంసేవకులు మహా కుంభమేళా ప్రాంతం యొక్క ఉత్తర ద్వారం అని పిలువబడే ఫఫమౌలోని బేలా కచర్‌లో భండార్ ను నిర్వహించారు.యాత్రికులకు స్వయంసేవకులు భోజనం అందించారు. కుంభమేళా ప్రాంతంలోని మరో ద్వారం దారాగంజ్, సుబేదర్ గంజ్ లోని రజ్జుభయ్యా నగర్ లో స్వయం సేవకులు యాత్రికుల కోసం టీ, బిస్కెట్లు, ఆహార ప్యాకెట్లు అందజేశారు.అలాగే పరిపాలనా అధికారులకు కూడా స్వయంసేవకులు సహాయం చేస్తూ, ట్రాఫిక్ నియంత్రణలో కూడా చూసుకుంటున్నారు. మరోవైపు ప్రమాదం...

మహా కుంభమేళాలో విషాదం తర్వాత 5 ప్రధాన మార్పులు: భద్రత మరియు క్రమశిక్షణ నిర్ధారణ 🕉️🚶‍♂️🚫🚗

Image
విషాదం తర్వాత మహా కుంభమేళాలో 5 ప్రధాన మార్పులివీ మహా కుంభమేళాలో తొక్కిసలాట విషాదం జరిగిన తర్వాత యూపీ ప్రభుత్వం 5 ప్రధాన మార్పులు చేసింది. కుంభమేళా జరిగే మొత్తం ప్రాంతాన్ని వాహన రహిత జోన్ గా ప్రకటించింది. ఈ నిర్ణయంతో ఏ వాహనాన్ని కూడా ఇక లోపలికి అనుమతించరు. 1. అన్ని రకాల వాహనాల ప్రవేశాన్ని నిషేధించారు. 2. వీవీఐపీ పాసులు రద్దు... ప్రత్యేక పాస్ ద్వారా ఏ వాహనాలకు అనుమతి వుండదు. 3. భక్తుల సౌకర్యార్థం వన్ వే రోడ్డు వ్యవస్థ అమలులోకి వచ్చింది. 4.ప్రయాగరాజ్ కి ఆనుకొని వున్న జిల్లాల నుంచి వచ్చే వాహనాలను జిల్లా సరిహద్దుల్లోనే నిలిపేస్తున్నారు. 5. నగరంలో వచ్చే నెల 4 వ తేదీ వరకు నాలుగు చక్రాల వాహనాల ప్రవేశంపై పూర్తిగా నిషేధం వుంటుంది. కుంభ ప్రాంతంలో రద్దీని నియంత్రించడం, భక్తుల భద్రతకు అనుగుణంగానే ఈ మార్పుల ఉద్దేశమని అధికారులు ప్రకటించారు. భక్తులందరూ తమకు సహకరించాలని కోరారు.