జులై 1న హైదరాబాద్​కు నడ్డా.. భారీ ర్యాలీకి ప్రణాళిక

భాజపా జాతీయ కార్యవర్గ సమావేశాలకు హాజరయ్యేందుకు కమల దళపతి జేపీ.నడ్డా జులై ఒకటో తేదీన హైదరాబాద్ కు రానున్నారు. శంషాబాద్ విమానాశ్రయం వద్ద భారీ స్వాగతం పలికేందుకు రాష్ట్ర నాయకత్వం ఏర్పాట్లు చేసింది. విమానాశ్రయం నుంచి నోవాటెల్ వరకు 50వేల మందితో భారీ ర్యాలీ నిర్వహించనుంది.
హైదరాబాద్​లో జులై 2,3 తేదీల్లో భాజపా జాతీయ కార్యవర్గ సమావేశాల నేపథ్యంలో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఒక రోజు ముందుగానే ఇక్కడికి రానున్నారు. విమానాశ్రయంలో స్వాగతం పలికిన అనంతరం అక్కణ్నుంచి నోవాటెల్​ వరకు వేల మందితో భారీ ర్యాలీ నిర్వహించాలని పార్టీ హైదరాబాద్​, రంగారెడ్డి జిల్లాల అధ్యక్షులతో శుక్రవారం జరిగిన సమావేశంలో నిర్వహించారు. జులై 2న హైదరాబాద్​కు రానున్న ప్రధాని మోదీ 4వ తేదీవ రాష్ట్ర రాజధానిలోనే ఉంటారని పార్టీ ముఖ్య నేత ఒకరు తెలిపారు. 4న ఆయన హైదరాబాద్​ నుంచి ఆంధ్రప్రదేశ్​కు వెళ్తారని.. భీమవరంలో జరిగే అల్లూరి సీతారామరాజు జయంతి ఉత్సవాలలో పాల్గొంటారని సమాచారం.
రాష్ట్రంలో 119 శాసనసభ నియోజకవర్గాలకు ఇతర రాష్ట్రాలకు చెందిన భాజపా ముఖ్య నేతలు వెళ్లి బస చేసేలా పార్టీ ప్రణాళిక రూపొందించింది. 3న జరిగే మోదీ సభకు ఆయా నియోజకవర్గాల నుంచి ఎక్కువ జన సమీకరణ జరిగేలా చూడడం.. పార్టీ బలోపేతానికి తమ వంతు ప్రయత్నం చేయడం దీని ఉద్దేశం. ఇందులో కేంద్ర మంత్రులు, మాజీ సీఎంలు, జాతీయ పదాధికారులు, కార్యవర్గ సభ్యులు ఉన్నారు. ఎస్సీ, ఎస్టీ నియోజకవర్గాలకు దళిత, గిరిజన నేతలే వెళ్లేలా జాబితా రూపొందించారు.

Comments

Popular posts from this blog

అర్ధరాత్రి రోడ్లపై తిరిగితే అరెస్ట్‌! టోలీచౌకీ పోలీసుల కఠిన చర్యలు

🔐 కొత్త ఆధార్ కార్డు డిజైన్: ఫోటో & QR కోడ్ మాత్రమే – మీ గోప్యతకు కొత్త రక్షణ!

🗳️🔥 లోక్‌సభలో ఘాటు డిబేట్: రాహుల్ విసిరిన 3 ఆరోపణలకు అమిత్ షా ఇచ్చిన ఝలక్!