రైల్వే స్టేషన్ కాల్పుల్లో మరణించిన దామెర రాకేశ్ సోదరుడికి ప్రభుత్వ ఉద్యోగం ఉత్తర్వులు జారీ
*రైల్వే స్టేషన్ కాల్పుల్లో మరణించిన దామెర రాకేశ్ సోదరుడికి ప్రభుత్వ ఉద్యోగం*
హైదరాబాద్, జూన్ 24 : ఈనెల తేదీన 17 వ సికిందరాబాద్ రైల్వే స్టేషన్లో జరిగిన కాల్పుల్లో మరణించిన దామెర రాకేష్ కుటుంబ సభ్యులలో అర్హులైన ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించనున్నట్టు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటన అనుసరించి రాకేష్ అన్న అయిన దామెర రామ్ రాజు కు ఉద్యోగం కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. దామెర రామ్ రాజు విద్యార్హతలకనుగుణంగా వరంగల్ జిల్లాలో తగిన ఉద్యోగం ఇవ్వాల్సిందిగా వరంగల్ జిల్లా కలెక్టర్ ను ఆదేశిస్తూ ఆ ఉత్తర్వులో పేర్కొన్నారు.
Comments
Post a Comment