వారణాసిలొ కాశీ విశ్వనాధ్ దేవాలయం సమీపంలొ బయటపడ్డ అతి పెద్ద రహస్య భూగర్బ మార్గం
భారత ప్రధాని నరేంద్ర మోది గారి సొంత నియొజకవర్గమయిన వారణాసిలొ రహస్యంగా నిర్మిస్తున్న అతి పెద్ద రహస్య భూగృహమార్గాన్ని పొలీసులు కనుగొన్నారు. వారణాసి లొని అత్యంత సున్నితమైన ప్రాంతమైన దాల్మందీ ప్రాంతంలొని భూగర్భంలొ ఏకంగా 8,000 చదరపు అడుగుల ప్రాంతంలొ ఈ రహస్య కేంద్రాన్ని నిర్మించారు. అత్యంత రహస్యంగా నిర్మిస్తున్న ఈ భుగృహ సొరంగమార్గం దాల్మందీ నుండి నేరుగా కాశీ విశ్వనాధ్ దేవాలయం దగ్గరగా ఈ భూగృహాన్ని నిర్మిస్తూ ఉండటం అనేక అనుమానాలకు తావిస్తుంది.
.వారణాసి సీనియర్ సూపర్నెంట్ ఆఫ్ పొలీస్ భరద్వాజ, అర్ధరాత్రి పెట్రొలింగ్ చేస్తుండగా, సున్నిత ప్రాంతమైన దాల్మందీలొ కాలినడకన ఆ ప్రాంతాన్ని పరిశీలిస్తుండగా, హఫీజ్ మాస్క్ ఏదురుగా ఉన్న పాడుబడిన ఇంటి కింద నుండి సన్నని వెలుగు కనబడటంతొ, పొలీసులు ఆ ఇంటి దగ్గరకు వెళ్లడానికి ప్రయత్నించగా అది సాద్యపడలేదు. ఆ ఇంటికి చేరుకొవడానికి వేరే ప్రాంతం నుండి చాలా దూరం ప్రయాణించి, రకరకాల మలుపులు తిరిగి ఆ ఇంటికి చేరుకొవాల్సి వచ్చిందని SSP భరద్వాజ తెలిపారు. తీరా అక్కడి వెళ్ళి చూసిన పొలీసులు ఒకసారిగా నిశ్చేష్టులయ్యారట. అక్కడ ఏకంగా ఒక చిన్న రహస్య పట్టణ్నాన్నే నిర్మించారని పొలీసులు తెలియజేశారు. ఆ అతి పెద్ద సొరంగంలొ ఏకంగా 40 స్థావరాలు నిర్మించి ఉన్నాయని దీనికితొడు అక్కడ పెద్ద పెద్ద కంటెయినర్లు ఉన్నాయని, పైగా ఈ సొరంగా మార్గం నేరుగా కాశీ విశ్వనాద్ అలయానికి దగ్గరగా నిర్మిస్తున్నట్టు పొలీసు అధికారులు తెలియజేశారు.
Comments
Post a Comment