బ్రేకింగ్: ఏపీకి నిధులు విడుదల చేసిన కేంద్రం
బ్రేకింగ్: ఏపీకి నిధులు విడుదల చేసిన కేంద్రం
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు శుక్రవారంతో ముగిసిన సంగతి తెలిసిందే. బడ్జెట్లో, ప్రధాని, అరుణ్ జైట్లీ ప్రసంగాలు చేసినప్పటికీ కేంద్రం నుంచి ఎలాంటి శుభవార్త రాలేదు. దీంతో ఐదురోజులుగా నిరసనలు చేపట్టిన ఏపీ ఎంపీలు, ప్రజలు తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. దీంతో సమావేశాలు ముగియగానే ఏపీకి చిన్నపాటి శుభవార్తను అందించిందిం కేంద్రం.
నిధుల వివరాలివే..
14వ ఆర్థిక సంఘం నిధుల కింద ఏపీకి రూ.369 కోట్లు
జాతీయ ఉపాధి హామీ నిధుల కింద రూ. 31.76 కోట్లు.. విడుదల చేస్తున్నట్లు శుక్రవారం సాయంత్రం కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ నిధులను కేంద్రం విడుదల చేసినప్పటికీ ఏపీలో మాత్రం ఎవరూ సంతృప్తి చెందలేదు. కనీసం ఒక్కటంటే ఒక్క శాతం ప్రజలు గానీ మిత్రపక్షమైన టీడీపీ కూడా సంతృప్తిగా లేనట్లుగా స్పష్టంగా అర్థమవుతోంది. అయితే ఈ నిధుల విషయంపై ఏపీకి సంబంధించిన మంత్రులు, అధికారులు గానీ ఎవరూ స్పందించలేదు.
By sources
Comments
Post a Comment