నీటి సమస్యలు అధిగమించేందుకు చర్యలు: ప్రధాని
నీటి సమస్యలు అధిగమించేందుకు చర్యలు: ప్రధాని
దేశంలో నీటి సమస్యలు అధిగమించేందుకు చర్యలు చేపట్టామని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. నీటి సమస్యలకు చెక్ పెట్టేందుకు నమామి గంగే కార్యక్రమాన్ని ప్రారంభించామని తెలిపారు. న్యూఢిల్లీ విజ్ఞాన్భవన్లో జరిగిన కార్యక్రమంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ..గంగానది దేశంలో అత్యంత ప్రధానమైన నది అన్నారు. తక్కువ నీటితో ఎక్కువ పంటలు పండించాలనేది ప్రధాన ఉద్దేశమన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో వంట గదిలో పొగ వల్ల మహిళలకు అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయన్నారు. ఈ కార్యక్రమం అనంతరం ప్రధాని మోదీ విద్యార్థుల్లో ఎగ్జామ్ టెన్షన్ తగ్గించేందుకు పరీక్ష పే చర్చా కార్యక్రమంలో పాల్గొన్నారు.
By sources
Comments
Post a Comment