పాకిస్థాన్ సెనేటర్ గా నామినేషన్ దాఖలు చేసిన హిందూ మహిళ
పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ తరఫున సెనేటర్ గా పోటీ చేసేందుకు అక్కడి హిందూ మహిళ, హక్కులసంఘం సభ్యురాలు, సామాజిక కార్యకర్త కృష్ణకుమారి నామినేషన్ దాఖలు చేశారు.
కృష్ణకుమారిని బాల్యంలోనే ఆమె తల్లిదండ్రులు వెట్టిచాకిరీ పనిలో పెట్టగా పోలీసుల ద్వారా విముక్తి లభించింది. 16 ఏళ్ల వయసులోనే పెళ్లిచేసుకున్న కృష్ణకుమారి అనంతరం విద్యాభ్యాసం కొనసాగించిన ఆమె సామాజిక శాస్త్రంలో ఉన్నతవిద్య అభ్యసించారు.
మార్చి 3న జరుగనున్న ఎన్నికల్లో గెలుపొందితే పాకిస్థాన్ సెనేటర్ గా ఎంపికైన రెండవ హిందూ మహిళగా కృష్ణకుమారి చరిత్ర సృష్టిస్తారు.
By sources
Comments
Post a Comment