జయహో మోడీ జయహో భారత్....
జయహో మోడీ జయహో భారత్....
మన దేశ సరిహద్దుల్లో పహరా కాస్తున్న సైనికులకు ఇక అత్యంత అధునాతన ఆయుధాలు అందించాలని కేంద్ర రక్షణ మంత్రిత్వశాఖ నిర్ణయించింది.
చైనా, పాకిస్థాన్ దేశాల సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో మన భారత సైనికులకు కొత్తగా రైఫిళ్లు, లైట్ మెషీన్ గన్స్, కార్బన్లను అందించనున్నారు.
ఆర్మీకి అధునాతన ఆయుధాల కొనుగోలు కోసం కేంద్ర రక్షణ మంత్రిత్వశాఖ రూ.5,366 కోట్లను కేటాయించింది.
సైనికులు సమర్పించిన ప్రతిపాదనల మేర 72,400 రైఫిళ్లు, 93,895 కార్బన్లు, 16,479 లైట్ మెషీన్ గన్స్ ను యుద్ధప్రాతిపదికగా ఇవ్వాలని రక్షణ మంత్రిత్వశాఖ నిర్ణయించింది.
పదిరోజుల్లో రక్షణ మంత్రిత్వశాఖ దీనికి సంబంధించిన ఫైలును ఆమోదించి మూడు నెలల నుంచి ఏడాది లోగా ఆయుధాలను సైనికులకు అందించాలని రక్షణమంత్రిత్వశాఖ అధికారులు యోచిస్తున్నారు.
Comments
Post a Comment