వాజ్పేయ్ స్మారకంగా రూ.100 కాయిన్
మాజీ ప్రధాని, భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి స్మారకంగా భారత ప్రభుత్వం రూ.100 కాయిన్ విడుదల చేసింది. రేపు(డిసెంబరు 25) వాజ్పేయి 94వ జయంతిని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ కాయిన్ను ఢిల్లీలో విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ అగ్రనేత ఎల్కే అడ్వాణీ, లోక్సభ స్పీకర్ సుమిత్రా మహాజన్, కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తదితరులు పాల్గొన్నారు.అనారోగ్యంతో చాలాకాలం పాటు ఇంటికే పరిమితమైన వాజ్పేయ్ ఈ ఏడాది ఆగస్టులో కన్నుమూసిన సంగతి తెలిసిందే.
Comments
Post a Comment