రైతులకు తాయిలాల కోసం మోదీ కీలక భేటీ!

నరేంద్ర మోదీ ప్రభుత్వం దేశంలోని రైతులకు భారీ వరాలు ప్రకటించబోతున్నట్లు తెలుస్తోంది. జాతీయ మీడియా కథనాల ప్రకారం ప్రధాని మోదీ బుధవారం సాయంత్రం కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా, వ్యవసాయ మంత్రి రాధామోహన్ సింగ్‌లతో సమావేశమమ్యారు. మోదీ నివాసంలో మూడు గంటలపాటు జరిగిన ఈ సమావేశంలో రైతుల కోసం కొత్తగా కొన్ని చర్యలను ప్రకటించబోతోంది. వచ్చే నెల 5న పార్లమెంటు శీతాకాల సమావేశాలు ముగుస్తాయి. అంతకుముందే ఈ ప్రకటన వెలువడే అవకాశం కనిపిస్తోంది.
 
కనీస మద్దతు ధరకు, మార్కెట్ ధరకు మధ్య వ్యత్యాసాన్ని రైతులకు నేరుగా చెల్లించడంపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ఈ సొమ్మును నేరుగా రైతుల బ్యాంకు ఖాతాలకు జమ చేసేందుకు ఆలోచన జరిగినట్లు సమాచారం.
 
మధ్య ప్రదేశ్‌లో శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రభుత్వం అమలు చేసిన భవతార్ స్కీమ్ (ధరల వ్యత్యాసం పథకం) విధానంలో ఈ నూతన పథకాన్ని రూపొందించాలని మోదీ ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు సమాచారం.

Comments

Popular posts from this blog

అర్ధరాత్రి రోడ్లపై తిరిగితే అరెస్ట్‌! టోలీచౌకీ పోలీసుల కఠిన చర్యలు

🔐 కొత్త ఆధార్ కార్డు డిజైన్: ఫోటో & QR కోడ్ మాత్రమే – మీ గోప్యతకు కొత్త రక్షణ!

🗳️🔥 లోక్‌సభలో ఘాటు డిబేట్: రాహుల్ విసిరిన 3 ఆరోపణలకు అమిత్ షా ఇచ్చిన ఝలక్!