తెలంగాణలో కొత్త కోర్టులు ఏర్పాటు
తెలంగాణలో పలు కొత్త కోర్టులను న్యాయశాఖ ఏర్పాటు చేసింది. పోక్సో చట్టం కేసులను విచారించేందుకు రెండు ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేసింది. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా ఎల్బీనగర్లో ప్రత్యేక న్యాయస్థానాలు నెలకొల్పారు. అలాగే గోదావరిఖనిలో సీనియర్ సివిల్ జడ్జి కోర్టు, ధర్మపురి, చౌటుప్పల్లో జూనియర్ సివిల్ జడ్జి కోర్టులు ఏర్పాటు చేశారు. పెద్దపల్లిలో జిల్లా కోర్టు ఏర్పాటు చేస్తూ న్యాయశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
Comments
Post a Comment