అమిత్ షా రథయాత్రకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కలకత్తా హైకోర్టు

పశ్చిమబెంగాల్ లో బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా నిర్వహింప తలపెట్టిన రథయాత్రకు ఆ రాష్ట్ర ప్రభుత్వం అనుమతిని నిరాకరించిన సంగతి తెలిసిందే. దీంతో, బీజేపీ శ్రేణులు కలకత్తా హైకోర్టును ఆశ్రయించాయి. పిటిషన్ ను విచారించిన హైకోర్టు... రాష్ట్రంలో మూడు రథయాత్రలకు అనుమతించింది. ఇదే సమయంలో శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించింది. రథయాత్రలు చట్టానికి లోబడి ఉన్నప్పుడు వాటిని అడ్డుకోవడం సరికాదని ఈ సందర్భంగా ధర్మాసనం అభిప్రాయపడింది.

 

Comments

Popular posts from this blog

అర్ధరాత్రి రోడ్లపై తిరిగితే అరెస్ట్‌! టోలీచౌకీ పోలీసుల కఠిన చర్యలు

🔐 కొత్త ఆధార్ కార్డు డిజైన్: ఫోటో & QR కోడ్ మాత్రమే – మీ గోప్యతకు కొత్త రక్షణ!

🗳️🔥 లోక్‌సభలో ఘాటు డిబేట్: రాహుల్ విసిరిన 3 ఆరోపణలకు అమిత్ షా ఇచ్చిన ఝలక్!