20 రాష్ట్రాల్లో 100 ర్యాలీల్లో పాల్గోనున్న మోదీ
లోక్సభ ఎన్నికల వేడి రగిల్చేందుకు ప్రధాని మోదీ దేశవ్యాప్తంగా విస్తృతంగా ర్యాలీలు చేబట్టనున్నారు. ఎన్నికల తేదీలు ప్రకటించక ముందే ప్రధాని వరుస ర్యాలీలతో బీజేపీని విజయతీరాలకు చేర్చాలనే పట్టుదలతో ఉన్నారు. ఈనెల 3 నుంచి ఆయన పార్టీ ప్రచార ర్యాలీలకు శ్రీకారం చుట్టనున్నట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగా 20 రాష్ట్రాల్లో 100కు పైగా ర్యాలీల్లో పాల్గోనున్నారు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఐదేళ్ల పాలనలో సాధించిన విజయాలను ప్రధానంగా ప్రజల ముందుకు ఈ ర్యాలీలతో మోదీ తీసుకువెళ్తారని, కార్యకర్తలు, నేతల్లో ఉత్సాహం నింపి మరోసారి బీజేపీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా పెట్టుకున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి. ఏప్రిల్ ద్వితీయార్థం లేదా మే మొదట్లో దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికలు జరుగనున్నాయి.
Comments
Post a Comment