ఏపీ కోసం బీజేపీ మాత్రమే పోరాడింది: మోదీ
ఏపీ కోసం బీజేపీ మాత్రమే పోరాడిందని ప్రధాని మోదీ చెప్పారు. రాష్ట్రాన్ని కాంగ్రెస్ ఎలా విభజించిందో ప్రజలు మర్చిపోరని, ఏపీ ప్రజల కోరికకు వ్యతిరేకంగా రాష్ట్రాన్ని విభజించారని ధ్వజమెత్తారు. అన్నదమ్ముల మధ్య కాంగ్రెస్ చిచ్చుపెట్టి విడదీసిందని ఆరోపించారు. అలాంటి కాంగ్రెస్తో టీడీపీ చేతులు కలిపిందని దుయ్యబట్టారు. విభజన సమయంలో మిగతా పార్టీలు రాజకీయాలు చేస్తుంటే... సమస్యలను పరిష్కరించే బీజేపీని, టీడీపీ పక్కన పెట్టిందన్నారు. ఏపీ మార్పు కోరుకుంటోందని మోదీ పేర్కొన్నారు.
Comments
Post a Comment