రాజ్యాంగం ఒప్పుకోదు: రిజర్వేషన్లపై ఒవైసీ
ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణాలకు 10 శాతం రిజర్వేషన్ ఇవ్వాలన్న కేంద్ర క్యాబినెట్ నిర్ణయంతో మజ్లిస్ పార్టీ చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ విభేదించారు. ఆర్థిక కారణాలతో రిజర్వేషన్లు కల్పించడాన్ని రాజ్యాంగం ఒప్పుకోదని ఆయన అన్నారు. దళితులకు జరిగిన చారిత్రక అన్యాయాలను సరిదిద్దడం, వారికి సామాజిక న్యాయం చేయడమే రిజర్వేషన్ల ముఖ్యోద్దేశమని అన్నారు. పేదరిక నిర్మూలనకు అనేక పథకాలు అమలు చేయవచ్చని చెప్పారు. అయితే రిజర్వేషన్లు మాత్రం సామాజిక న్యాయం అందించడానికే పరమితమన్నారు. రాజ్యంగం సైతం ఆర్థిక కారణాలను బట్టి రిజర్వేషన్లు ఇవ్వడాన్ని ఒప్పుకోదని ఒవైసీ చెప్పారు.
Comments
Post a Comment