కొవిడ్ టీకా పంపిణీలో భారత్ ప్రపంచ రికార్డు
ఒకరోజు టీకాల పంపిణీలో భారత్ మొదటి స్థానంలో నిలిచిందని కేంద్రం తెలిపింది. టీకా పంపిణీ విషయంలో యూకే, ఫ్రాన్స్, అమెరికాను భారత్ అధిగమించిందని పేర్కొంది. దీంతో కొవిడ్ టీకాల విషయంలో భారత్ ప్రపంచ రికార్డు సాధించిందని వెల్లడించింది. నిన్న దేశ వ్యాప్తంగా 2,07,229 మందికి టీకాలు ఇచ్చామని, రెండోరోజు ఆరు రాష్ట్రాల్లో కొవిడ్ వ్యాక్సినేషన్ కొనసాగించినట్లు కేంద్రం తెలిపింది. ఇవాళ మొత్తం 17,072 మందికి కొవిడ్ టీకాలు వేసినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. రెండ్రోజుల్లో మొత్తం 2,24,301 మందికి టీకాలు ఇచ్చినట్లు తెలిపింది
Comments
Post a Comment