రానున్న రెండేళ్లు భాజపాకు కీలకం: కిషన్రెడ్డి
తెలంగాణలో కుటుంబ పాలన పోవాలి.. భాజపా పాలన రావాలని కేంద్ర మంత్రి, భాజపా నేత కిషన్రెడ్డి అన్నారు. పార్టీ కార్యకర్తలతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కిషన్రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజలు మార్పు కోరుకుంటున్నారని తెలిపారు. రానున్న రెండేళ్లు భాజపాకు అత్యంత కీలకమని చెప్పారు. వరంగల్ మేయర్ పీఠాన్ని భాజపా గెలుస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. నాగార్జునసాగర్లోనూ కాషాయం జెండా ఎగురుతుందన్నారు.
Comments
Post a Comment