బర్డ్ఫ్లూ బారిన మరో రాష్ట్రం.. మొత్తం ఏడు రాష్ట్రాలలో వ్యాప్తి*
*బర్డ్ఫ్లూ బారిన మరో రాష్ట్రం.. మొత్తం ఏడు రాష్ట్రాలలో వ్యాప్తి*
*డిల్లీ పోలీస్ నిఘా* :దేశంలో కరోనా భయం తగ్గకముందే.. తాజాగా బర్డ్ఫ్లూ భయం పట్టుకుంది. మొదట పక్షులకు, ఆ తర్వాత మనుషులకు సోకి ప్రాణాలు తీసే ఈ జబ్బు ఇప్పటికే కొన్ని రాష్ట్రాలకు సోకింది. కేరళ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, హర్యానా, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్లతో పాటు తాజాగా ఉత్తరప్రదేశ్లోకి కూడా ఈ జబ్బు ఎంటరైంది. దాంతో బర్డ్ఫ్లూ బారినపడ్డ రాష్ట్రాల సంఖ్య ఏడుకు చేరింది. దేశంలో శనివారం ఒక్కరోజే 1200 పక్షులు మృత్యువాత పడ్డాయి. దీంతో అన్ని రాష్ట్రాలను కేంద్రం హెచ్చిరించింది. ఈ జబ్బు మనుషులకు సోకకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్రాలను కేంద్రం కోరింది.
Comments
Post a Comment