నెక్లెస్ రోడ్‌లో బీజేపీ కైట్ ఫెస్టివల్.. గాలిపటం ఎగరేసిన కిషన్ రెడ్డి

కరోనా నుంచి కోలుకుని దేశ ఆర్థిక వ్యవస్థ గాడిన పడుతుందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. కరోనా వైరస్ కట్టడి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఎంతో పని చేసిందని కొనియాడారు. వ్యాక్సిన్ కోసం సైంటిస్ట్‌లు ఎంతగానో కష్టపడ్డారని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సిన్‌ను తయారు చేసిన ఆరు సంస్థల్లో ఒకటి హైదరాబాద్‌కు చెందినది ఉండడం గర్వకారణంగా ఉందని అన్నారు.

కైట్ ఫెస్టివల్
నెక్లెస్ రోడ్‌లో బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన కైట్ ఫెస్టివల్‌లో కిషన్ రెడ్డి, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. ఉత్సాహంగా పతంగులు ఎగరవేశారు. ఈ సంక్రాంతి ద్వారా ప్రజల జీవితాల్లో కాంతి రావాలని, కరోనా వ్యాక్సిన్ పంపిణీని విజయవంతం చేయాలని కిషన్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు.

‘‘తెలుగు ప్రజలందరికీ బీజేపీ, కేంద్ర ప్రభుత్వం తరపున సంక్రాంతి శుభాకాంక్షలు. రానున్న రోజుల్లో దేశం అన్ని రంగాల్లో మార్పులు తీసుకురావాలని ఈ పండగ సందర్భంగా కోరుకుంటున్నా. కరోనా మహమ్మారి ఎదుర్కోవడానికి వ్యాక్సిన్ వచ్చింది. దేశంలో అన్ని రంగాలు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాయి. వారి జీవితాల్లో ఈ సంక్రాంతి నుండే మార్పు వస్తుంది. కొత్త వ్యవసాయ చట్టాల వల్ల రైతుల జీవితాల్లో వెలుగులు నింపాలి.’’ అని కిషన్ రెడ్డి అన్నారు.

Comments

Popular posts from this blog

అర్ధరాత్రి రోడ్లపై తిరిగితే అరెస్ట్‌! టోలీచౌకీ పోలీసుల కఠిన చర్యలు

🔐 కొత్త ఆధార్ కార్డు డిజైన్: ఫోటో & QR కోడ్ మాత్రమే – మీ గోప్యతకు కొత్త రక్షణ!

🗳️🔥 లోక్‌సభలో ఘాటు డిబేట్: రాహుల్ విసిరిన 3 ఆరోపణలకు అమిత్ షా ఇచ్చిన ఝలక్!