వాట్సాప్కు పోటీగా కేంద్రం కొత్త యాప్, ఎలా ఉండబోతుందో తెలుసా..?
సిగ్నల్’, ‘టెలిగ్రామ్’ వంటి యాప్ల డౌన్లోడ్లు బాగా పెరిగిపోయాయి. ఇక ఇదిలా ఉంటే భారత్లో విదేశీ యాప్లకు దెబ్బ కొట్టేలా భారత ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగానే వాట్సాప్ను పోలీన ఫీచర్లతో దేశీయంగా ఒక యాప్ను తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ‘సందేశ్’ పేరుతో తీసుకురానున్న ఈ యాప్ ప్రస్తుతం టెస్టింగ్ దశలో ఉంది. అయితే ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్కు కేంద్రం త్వరలోనే గట్టి షాక్ ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. ఫేస్బుక్ నేతృత్వంలోని వాట్సాప్కు ధీటుగా సరికొత్త దేశీ యాప్ను లాంచ్ చేయనున్నట్టు వార్తలు వస్తున్నాయి.
వాట్సాప్ ఇటీవల ప్రవేశపెట్టిన కొత్త ప్రైవరీ నిబంధనలతో వినియోగదారులు మరో ప్రత్యామ్నాయం కోసం యోచిస్తున్న తరుణంలో ఈ విషయం వెలుగులోకి రావడం గమనార్హం. ‘సందేశ్ యాప్’ యాప్ పేరుతో విడుదల కానున్న ఈ యాప్ను ఇప్పటికే కొందరు ప్రభుత్వాధికారులు టెస్టింగ్ కోసం ఉపయోగిస్తున్నట్టు తెలుస్తోంది. ఐవోఎస్, ఆండ్రాయిడ్ ప్లాట్ఫామ్లపై సందేశ్ యాప్ పనిచేస్తుందని చెబుతున్నారు. వాట్సాప్ మాదిరిగానే వాయిస్, డేటా సహా ఇతర సేవలను కూడా సందేశ్లో పొందుపర్చనున్నారు. లాగిన్ కోసం ఓటీపీ లేదా ఎల్డీఎపీ ఆప్షన్లు అందుబాటులో ఉంటాయి.

ఇతర మెసేజింగ్ యాప్ల మాదిరిగానే సందేశ్ కూడా మొబైల్, సిస్టమ్లో కూడా ఉపయోగించుకోవచ్చు. అయితే ఈ యాప్ను కేవలం ఆయా శాఖలకు సంబంధించిన అధికారుల కోసం మాత్రమే రూపొందించారా లేక సాధారణ ప్రజలకు కూడా అందుబాటులో ఉంచుతారా అన్ని ఇంకా తెలియరాలేదు. కేంద్ర ప్రభుత్వం దీనిపై అధికారిక ప్రకటన చేస్తే మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంటుంది. కాగా వాట్సాప్కు ధీటుగా దేశీ ప్రత్యామ్నాయ యాప్ను తయారుచేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు గతేడాది కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే.
Comments
Post a Comment