పథకం కేంద్రానిది - పబ్లిసిటీ కెసిఆర్ ది
పథకం కేంద్రానిది - పబ్లిసిటీ కెసిఆర్ ది
#eShram
కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చిన ఈశ్రం పథకాన్ని అసంఘటిత రంగ కార్మికులు ఉపయోగించుకోవాలి. మీ సమీపంలోని కామన్ సర్వీస్ సెంటర్ల(CSC) ద్వారా ఉచితంగా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.వ్యవసాయ, అనుబంధ ఉపాధివర్గాలు, భవన, దాని అనుబంధ రంగాల వర్గాలు, మత్స్యకారులు, ఆటో డ్రైవర్లు చేనేత కార్మికులు, వడ్రంగులు, ఇటుక బట్టి కార్మికులు, క్వారీ కార్మికులు, మిల్లు కార్మికులు, వార్తాపత్రిక విక్రేతలు, రిక్షా కార్మికుడు, చిన్న మరియు సన్నకారు రైతులు, కూరగాయలు మరియు పండ్ల విక్రేతలు, మరియు అన్ని రకాల దినసరి కూలీలు నమోదు చేసుకోవచ్చు. 16 నుండి 59 సంవత్సరాల వయసు కలిగిన వారు, ఈపీఎఫ్, ఈఎస్ఐ సదుపాయం లేనివారు మరియు ఆదాయ పన్ను చెల్లించని వారు మాత్రమే అర్హులు.
ఈశ్రం నమోదు ద్వారా ప్రయోజనాలు...
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈశ్రం పథకంలో నమోదు చేసుకున్న ప్రతీ కార్మికునికి ఏడాది పాటు ప్రధానమంత్రి సురక్షా బీమా యోజన కింద రూ. 2లక్షలు ప్రమాద బీమా పథకం, అంగవైకల్య బీమా పథకం కల్పిస్తారు. రిజిస్ట్రేషన్ పూర్తయిన వారికి 12 అంకెలు గల యూనివర్సల్ ఐడెంటిఫికేషన్ నెంబర్ కార్డును ఇస్తారు. ఈ డేటాబేస్ ని ప్రామాణికంగా తీసుకుంటారని గుర్తుచేశారు. ప్రభుత్వం అందించే అన్ని రకాల సామాజిక భద్రతా పథకాలకు ఈ కార్డును వర్తింపజేస్తారు. *ఈ పధకంలో నమోదు చేసుకొనుటకు మీరు ఎలాంటి ప్రభుత్వ కార్యాలయంనకు వెళ్లవలసిన అవసరం లేదు కేవలం మీ ఆధార్ కార్డు మరియు మీ మొబైల్ నెంబర్ తో లింక్ అయిన బ్యాంక్ ఖాతా జిరాక్స్ ను తీసుకొని మీ సమీపంలోని కామన్ సర్వీస్ సెంటర్ ను(CSC) సంప్రదించి ఉచితంగా తక్షణమే ఈశ్రం కార్డును పొందగలరు.*
Comments
Post a Comment