అత్తసొమ్ము అల్లుడు

అత్తసొమ్ము అల్లుడు 

.        అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ & ఇప్పటి తెలాంగాణ రాష్ట్రంలోకి ప్రవేశించాక గోదావరి నదిపై వున్న మొట్టమొదటి ప్రాజెక్ట్ "శ్రీరాం సాగర్"కు ఎగువన అప్పట్లో మహారాష్ట్ర ప్రభుత్వం ఇదే గోదావరి నదిపై నిన్న BRS బహిరంగ సభ జరిగిన నాందేడ్ పట్టణానికి సమీపంలో బారేజ్ అనే పేరు చెప్పి "బాబ్లీ" అనే ప్రాజెక్ట్ కట్టడంతో "శ్రీరాం సాగర్ ప్రాజెక్ట్"లోకి మాంచి వర్ష కాలంలో కూడా చుక్క నీరు రాక, ఇదే ఈ "శ్రీరాం సాగర్ ప్రాజెక్ట్" వట్టి పోయి , సదరు ప్రాజెక్టు ఆయకట్టు ప్రాంతాలు మొత్తం నెర్రలు బారడంతో తల్లడిల్లిన అక్కడి ఆయకట్టు రైతులు సుప్రీంకోర్టు తలుపులు తట్టడంతో ప్రతీ సంవత్సరం జులై మొదటి తేదీ నుండి మొదలు అక్టోబర్ 28 తేదీవరకు "బాబ్లీ ప్రాజెక్టు" మొత్తం 14 గేట్లు తెరవాలని సుప్రీంకోర్టు ఉత్తర్వులివ్వడంతో అప్పటివరకు వట్టి పోయిన "శ్రీరాం సాగర్ ప్రాజెక్ట్" మళ్ళీ నీటితో కళకళ లాడుతూ ఇవ్వాళ్ల అక్కడి తెలంగాణ రైతుల పంట పండిస్తున్నది.

.                    ఇకలాటిది ఇవ్వాళ్ల తమ రాజకీయ స్వార్ధంకోసం... స్వప్రయోజనాల కోసం తెలంగాణ పొట్ట కొట్టి అదే "శ్రీరాం సాగర్ ప్రాజెక్టు" నుండి మహారాష్ట్ర నీళ్లు తోడుకోవచ్చు అనడం దారుణం... అన్యాయం... అక్రమం.

.          కాళేశ్వరంలో వచ్చిన డబ్బులతో బయటి రాష్ట్రాల్లో రాజకీయాలు చేయడమే కాకుండా, ఇప్పుడు ఇతర రాష్ట్రాలకు ఆఁ కాళేశ్వరం నీళ్లు కూడా ఇవ్వజూపడం అత్త సొమ్ము అల్లుడు దానం చేయడమే.

.      "నీళ్లు... నిధులు... నియామకాలు... "అనే నినాదంతో రాష్ట్రంలో అధికారం చెజిక్కించుకున్న వాళ్ళు రేపు బయటి రాష్ట్రాల్లో తమ పార్టీ విస్తరణ కోసం (ముస్లింలకు 12% రిజర్వేషన్లు లాగా) బయటి రాష్ట్రాల వారి కోసం ఇవ్వాళ్ల నీళ్ళిస్తానన్న వాళ్ళు.. మళ్ళీ అదే బయటి రాష్ట్రాల వారి కోసం రేపు తెలంగాణ రాష్ట్రంలో రిజర్వేషన్లు అని చెప్పిన ఆశ్చర్యం లేదు.

జాగో తెలంగాణ...
                   కేశబోయినాశ్రీధర్
             హైదరాబాద్ సెంట్రల్ బిజెపి
          ఓబీసీ మోర్చా జనరల్ సెక్రటరీ








Comments

Popular posts from this blog

అర్ధరాత్రి రోడ్లపై తిరిగితే అరెస్ట్‌! టోలీచౌకీ పోలీసుల కఠిన చర్యలు

🔐 కొత్త ఆధార్ కార్డు డిజైన్: ఫోటో & QR కోడ్ మాత్రమే – మీ గోప్యతకు కొత్త రక్షణ!

🗳️🔥 లోక్‌సభలో ఘాటు డిబేట్: రాహుల్ విసిరిన 3 ఆరోపణలకు అమిత్ షా ఇచ్చిన ఝలక్!